Political News

అదానీ కేసును లైట్ తీసుకున్న కేంద్రం.. ఏమందంటే!

భార‌త్‌కు చెందిన‌, ముఖ్యంగా గుజ‌రాత్‌కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీపై అమెరికాలో కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. దీనిపై భార‌త్ స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో చ‌ర్చ జ‌రిగింది. అంతేకాదు.. ఈ కేసులు ప్రూవ్ అయితే.. అన్నేళ్లు జైలు ప‌డుతుంది… ఇంత జ‌రిమానా ప‌డుతుంద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి. ఇక‌, అదానీకి, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌కు మ‌ధ్య లంచాల లావాదేవీలు కూడా జ‌రిగాయ‌ని అమెరికా ద‌ర్యాప్తు అధికారులు ఎఫ్‌బీఐ.. స‌మ‌ర్పించిన ప‌త్రాల్లో స్ప‌ష్టంగా ఉంది. అదేస‌మ‌యంలో త‌మిళ‌నాడు, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఒడిశాల్లోనూ ఈ లంచాల వ్య‌వ‌హారం ముందుకు సాగింద‌న్న చ‌ర్చ కూడా ఉంది.

ఇంకా ఈ చ‌ర్చ‌కు తెర‌ప‌డలేదు. ఈ కేసు ముగిసి పోలేదు. మ‌రి దేశాన్ని, ప్ర‌పంచ దేశాల‌ను , రాజ‌కీయ పార్టీల‌ను కూడా ఇంత‌గా కుదిపేస్తున్న అదానీ వ్య‌వ‌హారంపై కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుంద‌ని.. అంద‌రూ వెయ్యిక‌ళ్ల‌తో ఎదురు చూశారు. అంతేకాదు.. పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో ఈ వ్య‌వ‌హారం వేడి పుట్టిస్తోంది కూడా. రోజూ స‌భ‌లు ఇదే విష‌యంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్ట‌డంతో వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. మ‌రి ఇంత ప్రాధాన్యంతో కూడుకున్న ఈ కేసును కేంద్రం ఎలా తీసుకుంది? అంటే.. లైట్ తీసుకుంది. ఇది `ప్రైవేటు వ్య‌క్తుల‌కు-అమెరికాకు మ‌ధ్య కేసు“ అని తేల్చి చెప్పింది.

అంటే.. ప్ర‌పంచ కుబేరుడిగా, ప‌లు రాష్ట్రాల్లో పోర్టులు సొంతం చేసుకుని భారీ పారిశ్రామిక వేత్త‌గా ఉన్న అదానీని కేవ‌లం `ప్రైవేటు వ్య‌క్తి` అనే చిన్న కార‌ణంగా కేంద్రం ఈ కేసును ప‌క్క‌కు పెట్టేయ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. “ఇది ప్రైవేటు వ్య‌క్తులు-అమెరికా న్యాయ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన కేసు. మ‌న‌కు ఎలాంటి సంబంధం లేదు. అమెరికా కూడా మ‌న‌ల్ని ఏమీ అడ‌గ‌లేదు. మ‌న నుంచి ఎలాంటి స‌మాచారం కూడా కోర‌లేదు. సో.. ఇంత‌క‌న్నా మ‌నకు తెలియ‌దు“ అని వ్యాఖ్యానించా రు. అంటే.. మొత్తంగా అమెరికా స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా అదానీపై దుమ్మెత్తి పోస్తున్నా.. కేసులు న‌మోదైనా కేంద్రం జోక్యం చేసుకునేది లేద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

అంతేకాదు.. దేశంలో కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు చేస్తున్న ఆందోళ‌న‌ను కూడా పెద్ద‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా కేంద్రం భావిస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది. దీనిని బ‌ట్టి అటు పార్ల‌మెంటులో అయినా.. ఇటు బ‌య‌ట అయినా.. ప్ర‌తిప‌క్షాలు యాగీ చేసిన‌న్నాళ్లు చేస్తాయి. త‌ర్వాత అవే శాంతిస్తాయ‌న్న ధోర‌ణిలో కేంద్రం ఉండ‌డం మ‌రో విశేషం. మ‌ణిపూర్ అల్ల‌ర్లు, అక్క‌డ మ‌హిళ‌ల‌పై జ‌రిగిన అత్యాచారాలు, దాడుల విష‌యంలోనూ కేంద్ర ప్ర‌భుత్వం గ‌త రెండేళ్లుగా మౌనంగా ఉన్న విష‌యం ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావ‌నార్హం.

This post was last modified on November 29, 2024 6:20 pm

Share
Show comments
Published by
Kumar
Tags: #Adani

Recent Posts

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

20 minutes ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

2 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

2 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

3 hours ago

రజినీకాంత్ సినిమాకు దర్శకుల కష్టాలు

అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…

4 hours ago

విజ‌య్ గ్రాఫ్‌… పోలింగ్ ముందు ఎలా ఉంది?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు త‌మ‌ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…

4 hours ago