Political News

పళనికి రూటు క్లియర్ అయినట్లేనా ?

ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామినే తదుపరి సిఎం అభ్యర్ధిగా ఏఐఏడిఎంకే నిర్ణయించింది. బుధవారం ఉదయం జరిగిన పార్టీ కీలక సమావేశంలో సభ్యులందరు ఈ మేరకు నిర్ణయించి ప్రకటన చేశారు. కొద్ది రోజులుగా ఏఐఏడిఎంకే తరపున రానున్న ఎన్నికల్లో సిఎం అభ్యర్ధి ఎవరనే విషయంలో వివాదాలు నడుస్తున్నాయి. కొంతకాలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ. పన్నీర్ సెల్వం తమిళనాడుకు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నారు. దాంతో ప్రస్తుత సిఎం పళనిస్వామికి ఒళ్ళుమండిపోయింది. దాంతో ఇద్దరి మధ్యే కాకుండా వాళ్ళ వర్గాల మధ్య కూడా పెద్ద గొడవలే అవుతున్నాయి.

వీళ్ళ గొడవలు ఇలాగుంటే డిఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలినే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధంటు డిఎంకే ఈ మధ్య ప్రకటించింది. స్టాలిన్ విషయంలో ఎవరికీ ఎటువంటి రెండో అభిప్రాయం లేకపోవటంతో స్టాలిన్ నాయకత్వానికి పార్టీ ఎంఎల్ఏలు, నేతలంతా జై కొట్టారు. కాబట్టి డిఎంకే ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో తేలిపోయింది. ఇక మిగిలింది దినకరన్ నేతృత్వంలోని కూటమి మాత్రమే. వీళ్ళు పార్టీ కీలక నేత శశికళ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఆమెమే కర్నాటకలోని పరప్పన జైలులో ఉన్నారు. నాలుగు సంవత్సరాల జైలు శిక్ష ముగించుకుని తొందరలోనే విడుదల అవుతారని అందరు అనుకుంటున్నారు.

ఒకవేళ ఆమె గనుక విడుదలైతే వేరు కుంపటి పెట్టుకుంటుందా ? లేకపోతే ఏఐఏడిఎంకే తమదే అంటూ మొదలు పెడుతా అన్నది చూడాలి. ఒకవేళ ఆమే గనుక ప్రస్తుత అధికారపార్టీపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఏఐఏడిఎంకేలోని ఎంతమంది ఎంఎల్ఏలు, నేతలు పార్టీని వీడి ఆమెవైపు వెళిపోతారన్నది సస్పెన్సుగా మారింది. ఎందుకంటే ఓ పన్నీర్ సెల్వం అయినా పళని స్వామికైనా ఒంటిచేత్తో పార్టీని ఎన్నికల్లో గెలిపించే సత్తా ఉందని ఎవరు అనుకోవటం లేదు. అప్పట్లో జయలిలత పుణ్యామని పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆమె చనిపోయిన తర్వాత ఇద్దరు సిఎంలు అవ్వగలిగారు.

ఏదేమైనా 2021లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే డిఎంకే మాత్రమే వ్యవస్ధాగతంగా బలమైన పార్టీగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు ఏదో ఓ పార్టీకి తోకపార్టీలుగా మాత్రమే ఉండాలి. ఇదే సమయంలో తమిళనాడులోనే పిఎంకే, ఎండిఎంకే లాంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలున్నా అవన్నీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదనే ప్రస్తుతానికి అనిపిస్తోంది. సరే ప్రస్తుతానికైతే అధికారపార్టీ తరపున మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పళనిస్వామినే ఎన్నుకున్నారు కాబట్టి పార్టీలో పెద్ద వివాదం పరిష్కారమైనట్లే అనుకోవాలి.

This post was last modified on October 7, 2020 2:48 pm

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

4 hours ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

5 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

6 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

7 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

11 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

12 hours ago