Political News

పళనికి రూటు క్లియర్ అయినట్లేనా ?

ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామినే తదుపరి సిఎం అభ్యర్ధిగా ఏఐఏడిఎంకే నిర్ణయించింది. బుధవారం ఉదయం జరిగిన పార్టీ కీలక సమావేశంలో సభ్యులందరు ఈ మేరకు నిర్ణయించి ప్రకటన చేశారు. కొద్ది రోజులుగా ఏఐఏడిఎంకే తరపున రానున్న ఎన్నికల్లో సిఎం అభ్యర్ధి ఎవరనే విషయంలో వివాదాలు నడుస్తున్నాయి. కొంతకాలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ. పన్నీర్ సెల్వం తమిళనాడుకు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నారు. దాంతో ప్రస్తుత సిఎం పళనిస్వామికి ఒళ్ళుమండిపోయింది. దాంతో ఇద్దరి మధ్యే కాకుండా వాళ్ళ వర్గాల మధ్య కూడా పెద్ద గొడవలే అవుతున్నాయి.

వీళ్ళ గొడవలు ఇలాగుంటే డిఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలినే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధంటు డిఎంకే ఈ మధ్య ప్రకటించింది. స్టాలిన్ విషయంలో ఎవరికీ ఎటువంటి రెండో అభిప్రాయం లేకపోవటంతో స్టాలిన్ నాయకత్వానికి పార్టీ ఎంఎల్ఏలు, నేతలంతా జై కొట్టారు. కాబట్టి డిఎంకే ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో తేలిపోయింది. ఇక మిగిలింది దినకరన్ నేతృత్వంలోని కూటమి మాత్రమే. వీళ్ళు పార్టీ కీలక నేత శశికళ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఆమెమే కర్నాటకలోని పరప్పన జైలులో ఉన్నారు. నాలుగు సంవత్సరాల జైలు శిక్ష ముగించుకుని తొందరలోనే విడుదల అవుతారని అందరు అనుకుంటున్నారు.

ఒకవేళ ఆమె గనుక విడుదలైతే వేరు కుంపటి పెట్టుకుంటుందా ? లేకపోతే ఏఐఏడిఎంకే తమదే అంటూ మొదలు పెడుతా అన్నది చూడాలి. ఒకవేళ ఆమే గనుక ప్రస్తుత అధికారపార్టీపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఏఐఏడిఎంకేలోని ఎంతమంది ఎంఎల్ఏలు, నేతలు పార్టీని వీడి ఆమెవైపు వెళిపోతారన్నది సస్పెన్సుగా మారింది. ఎందుకంటే ఓ పన్నీర్ సెల్వం అయినా పళని స్వామికైనా ఒంటిచేత్తో పార్టీని ఎన్నికల్లో గెలిపించే సత్తా ఉందని ఎవరు అనుకోవటం లేదు. అప్పట్లో జయలిలత పుణ్యామని పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆమె చనిపోయిన తర్వాత ఇద్దరు సిఎంలు అవ్వగలిగారు.

ఏదేమైనా 2021లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే డిఎంకే మాత్రమే వ్యవస్ధాగతంగా బలమైన పార్టీగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు ఏదో ఓ పార్టీకి తోకపార్టీలుగా మాత్రమే ఉండాలి. ఇదే సమయంలో తమిళనాడులోనే పిఎంకే, ఎండిఎంకే లాంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలున్నా అవన్నీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదనే ప్రస్తుతానికి అనిపిస్తోంది. సరే ప్రస్తుతానికైతే అధికారపార్టీ తరపున మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పళనిస్వామినే ఎన్నుకున్నారు కాబట్టి పార్టీలో పెద్ద వివాదం పరిష్కారమైనట్లే అనుకోవాలి.

This post was last modified on October 7, 2020 2:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

3 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

5 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

13 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

13 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

14 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

16 hours ago