Political News

పళనికి రూటు క్లియర్ అయినట్లేనా ?

ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామినే తదుపరి సిఎం అభ్యర్ధిగా ఏఐఏడిఎంకే నిర్ణయించింది. బుధవారం ఉదయం జరిగిన పార్టీ కీలక సమావేశంలో సభ్యులందరు ఈ మేరకు నిర్ణయించి ప్రకటన చేశారు. కొద్ది రోజులుగా ఏఐఏడిఎంకే తరపున రానున్న ఎన్నికల్లో సిఎం అభ్యర్ధి ఎవరనే విషయంలో వివాదాలు నడుస్తున్నాయి. కొంతకాలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ. పన్నీర్ సెల్వం తమిళనాడుకు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నారు. దాంతో ప్రస్తుత సిఎం పళనిస్వామికి ఒళ్ళుమండిపోయింది. దాంతో ఇద్దరి మధ్యే కాకుండా వాళ్ళ వర్గాల మధ్య కూడా పెద్ద గొడవలే అవుతున్నాయి.

వీళ్ళ గొడవలు ఇలాగుంటే డిఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలినే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధంటు డిఎంకే ఈ మధ్య ప్రకటించింది. స్టాలిన్ విషయంలో ఎవరికీ ఎటువంటి రెండో అభిప్రాయం లేకపోవటంతో స్టాలిన్ నాయకత్వానికి పార్టీ ఎంఎల్ఏలు, నేతలంతా జై కొట్టారు. కాబట్టి డిఎంకే ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో తేలిపోయింది. ఇక మిగిలింది దినకరన్ నేతృత్వంలోని కూటమి మాత్రమే. వీళ్ళు పార్టీ కీలక నేత శశికళ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఆమెమే కర్నాటకలోని పరప్పన జైలులో ఉన్నారు. నాలుగు సంవత్సరాల జైలు శిక్ష ముగించుకుని తొందరలోనే విడుదల అవుతారని అందరు అనుకుంటున్నారు.

ఒకవేళ ఆమె గనుక విడుదలైతే వేరు కుంపటి పెట్టుకుంటుందా ? లేకపోతే ఏఐఏడిఎంకే తమదే అంటూ మొదలు పెడుతా అన్నది చూడాలి. ఒకవేళ ఆమే గనుక ప్రస్తుత అధికారపార్టీపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఏఐఏడిఎంకేలోని ఎంతమంది ఎంఎల్ఏలు, నేతలు పార్టీని వీడి ఆమెవైపు వెళిపోతారన్నది సస్పెన్సుగా మారింది. ఎందుకంటే ఓ పన్నీర్ సెల్వం అయినా పళని స్వామికైనా ఒంటిచేత్తో పార్టీని ఎన్నికల్లో గెలిపించే సత్తా ఉందని ఎవరు అనుకోవటం లేదు. అప్పట్లో జయలిలత పుణ్యామని పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆమె చనిపోయిన తర్వాత ఇద్దరు సిఎంలు అవ్వగలిగారు.

ఏదేమైనా 2021లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే డిఎంకే మాత్రమే వ్యవస్ధాగతంగా బలమైన పార్టీగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు ఏదో ఓ పార్టీకి తోకపార్టీలుగా మాత్రమే ఉండాలి. ఇదే సమయంలో తమిళనాడులోనే పిఎంకే, ఎండిఎంకే లాంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలున్నా అవన్నీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదనే ప్రస్తుతానికి అనిపిస్తోంది. సరే ప్రస్తుతానికైతే అధికారపార్టీ తరపున మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పళనిస్వామినే ఎన్నుకున్నారు కాబట్టి పార్టీలో పెద్ద వివాదం పరిష్కారమైనట్లే అనుకోవాలి.

This post was last modified on October 7, 2020 2:48 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తెలుగులో స్టార్లతో హిందీలో కంటెంటుతో

కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న…

1 hour ago

నారా రోహిత్ సినిమాకు ఇన్ని కష్టాలా

ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…

2 hours ago

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

8 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

9 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

13 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

16 hours ago