Political News

ఫ‌స్ట్ టూర్‌లోనే ప‌వ‌న్ స‌క్సెస్‌.. 172 కోట్లు ఇచ్చిన కేంద్రం!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. ఇది ఆయ‌న‌కు అధికారం లోకి వ‌చ్చిన త‌ర్వాత తొలి ప‌ర్య‌ట‌న‌. ఈ ఏడాది జూన్‌లో ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప‌వ‌న్ రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లినా.. వాటికి వేర్వేరు కార‌ణాలు ఉన్నాయి. సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి కూడా ప‌వ‌న్ వెళ్లారు. అయితే.. వాటికి, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌ర్య‌ట‌న‌కు సంబంధం లేదు. తాజాగా మాత్రం ఆయ‌న ఒంట‌రిగానే.. డిప్యూటీ సీఎం హోదాలో, పంచాయ‌తీ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగానే ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు.

దీంతో ఈప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇక‌, రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల‌పై కేంద్రం పెద్ద‌ల‌తో ప‌వ‌న్ చ‌ర్చించారు. వెళ్తూ వెళ్తూనే ఆయ‌న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రినిర్మ‌లా సీతారామ‌న్‌, జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి పాటిల్ స‌హా.. ప‌ర్యాట‌క శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో భేటీ అయ్యారు. అనేక స‌మస్య‌లు ప్ర‌స్తావించారు. ముఖ్యంగా ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగులో ఉన్న ప‌లు విష‌యాల‌ను కూడా ఆయ‌న చ‌ర్చించారు.

ఈ క్ర‌మంలో గోదావ‌రి జిల్లాల‌తోపాటు చుట్టుప‌క్క‌ల జిల్లాల‌కు కీల‌క‌మైన అఖండ గోదావ‌రి, గండి కోట ప్రాజెక్టుల అభివృద్దికి మార్గం సుగ‌మం చేసుకున్నారు. ప‌ర్యాట‌క, కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రుల‌కు ఆయా వివరాల‌ను వెల్ల‌డించిన రోజే అనూహ్యంగా కేంద్రం నుంచి రూ.172.34 కోట్ల రూపాయ‌లు ఇచ్చేందుకు అంగీక‌రించింది. దీనిలో తొలి విడ‌త‌గా 114 కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నిధుల‌తో ఆయా ప్రాజెక్టులు ప‌రుగులు పెట్ట‌నున్నాయి.

ఇక‌, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 30 ల‌క్ష‌ల ఇళ్ల‌కు కుళాయి క‌నెక్ష‌న్లు లేవ‌న్న విష‌యాన్ని కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రం అమ‌లు చేస్తున్న జ‌ల్ జీవ‌న్‌మిష‌న్ ద్వారా.. నిధులు ఇవ్వాల‌ని కోరారు. దీనికి కూడా కేంద్రం ఓకే చెప్ప‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా కీల‌క‌మైన ఎర్ర చందనం అక్ర‌మ ర‌వాణాను అడ్డుకోవ‌డం స‌హా.. ఈ దుంగలు ఎక్క‌డ దొరికినా అవి ఏపీకి చెందిన‌విగా ప్ర‌క‌టించాలని కూడా కోరారు. దీనికి కూడా కేంద్రం ఓకే చెప్ప‌డంగ‌మ‌నార్హం. మొత్తానికి ఫ‌స్ట్ టూర్‌లో నే ప‌వ‌న్ స‌క్సెస్ కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 28, 2024 10:44 am

Share
Show comments
Published by
Satya
Tags: Pawan Kalyan

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

8 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

12 hours ago