Political News

ఫ‌స్ట్ టూర్‌లోనే ప‌వ‌న్ స‌క్సెస్‌.. 172 కోట్లు ఇచ్చిన కేంద్రం!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. ఇది ఆయ‌న‌కు అధికారం లోకి వ‌చ్చిన త‌ర్వాత తొలి ప‌ర్య‌ట‌న‌. ఈ ఏడాది జూన్‌లో ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప‌వ‌న్ రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లినా.. వాటికి వేర్వేరు కార‌ణాలు ఉన్నాయి. సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి కూడా ప‌వ‌న్ వెళ్లారు. అయితే.. వాటికి, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌ర్య‌ట‌న‌కు సంబంధం లేదు. తాజాగా మాత్రం ఆయ‌న ఒంట‌రిగానే.. డిప్యూటీ సీఎం హోదాలో, పంచాయ‌తీ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగానే ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు.

దీంతో ఈప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇక‌, రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల‌పై కేంద్రం పెద్ద‌ల‌తో ప‌వ‌న్ చ‌ర్చించారు. వెళ్తూ వెళ్తూనే ఆయ‌న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రినిర్మ‌లా సీతారామ‌న్‌, జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి పాటిల్ స‌హా.. ప‌ర్యాట‌క శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో భేటీ అయ్యారు. అనేక స‌మస్య‌లు ప్ర‌స్తావించారు. ముఖ్యంగా ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగులో ఉన్న ప‌లు విష‌యాల‌ను కూడా ఆయ‌న చ‌ర్చించారు.

ఈ క్ర‌మంలో గోదావ‌రి జిల్లాల‌తోపాటు చుట్టుప‌క్క‌ల జిల్లాల‌కు కీల‌క‌మైన అఖండ గోదావ‌రి, గండి కోట ప్రాజెక్టుల అభివృద్దికి మార్గం సుగ‌మం చేసుకున్నారు. ప‌ర్యాట‌క, కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రుల‌కు ఆయా వివరాల‌ను వెల్ల‌డించిన రోజే అనూహ్యంగా కేంద్రం నుంచి రూ.172.34 కోట్ల రూపాయ‌లు ఇచ్చేందుకు అంగీక‌రించింది. దీనిలో తొలి విడ‌త‌గా 114 కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నిధుల‌తో ఆయా ప్రాజెక్టులు ప‌రుగులు పెట్ట‌నున్నాయి.

ఇక‌, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 30 ల‌క్ష‌ల ఇళ్ల‌కు కుళాయి క‌నెక్ష‌న్లు లేవ‌న్న విష‌యాన్ని కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రం అమ‌లు చేస్తున్న జ‌ల్ జీవ‌న్‌మిష‌న్ ద్వారా.. నిధులు ఇవ్వాల‌ని కోరారు. దీనికి కూడా కేంద్రం ఓకే చెప్ప‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా కీల‌క‌మైన ఎర్ర చందనం అక్ర‌మ ర‌వాణాను అడ్డుకోవ‌డం స‌హా.. ఈ దుంగలు ఎక్క‌డ దొరికినా అవి ఏపీకి చెందిన‌విగా ప్ర‌క‌టించాలని కూడా కోరారు. దీనికి కూడా కేంద్రం ఓకే చెప్ప‌డంగ‌మ‌నార్హం. మొత్తానికి ఫ‌స్ట్ టూర్‌లో నే ప‌వ‌న్ స‌క్సెస్ కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 28, 2024 10:44 am

Share
Show comments
Published by
Satya
Tags: Pawan Kalyan

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

29 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

59 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago