వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ మూల గంజాయి, డ్రగ్స్ దొరికినా..దానికి ఏపీతో లింకులు ఉండడంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే గంజాయి అమ్మేవారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో లోకేష్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేకాదు, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ‘ఈగల్’ గా మారుస్తున్నామని లోకేష్ చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మంది సభ్యులతో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆ కమిటీల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లకు కూడా చోటు కల్పించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అనేక దారుణాలకు గంజాయి, డ్రగ్స్ మత్తు కారణమని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం అరికట్టేందుకు పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఈగల్ తో గంజాయి, డ్రగ్స్ పై నిఘా పెంచాలని భావిస్తోంది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…