Political News

ఆ కేంద్ర మంత్రుల భేటీలో పవన్ ఏం చెప్పారు?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ మర్యాపూర్వకంగా విందుకు ఆహ్వానించారు. జనసేన ఎంపీలు బాలశౌరి, ఉదయ్ కుమార్ లతో కలిసి ఉప రాష్ట్రపతి ఇచ్చిన విందుకు పవన్ హాజరయ్యారు.

మరోవైపు, కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, సీఆర్‌ పాటిల్‌, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఏపీలో 7వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని నిర్మలా సీతాారామన్ కు పవన్ వివరించారు. గత ప్రభుత్వం నిర్లక్యపూరితంగా వ్యవహరించి ఏఐఐబీకి మ్యాచింగ్ గ్రాంట్స్‌ చెల్లించలేదని, దీంతో, గడువు ముగిసిందని అన్నారు. కాలపరిమితిని రెండేళ్లు పెంచాలని లేదంటే 90 శాతం నిధులు ఏఐఐబీ నుంచి ఇప్పించాలని రిక్వెస్ట్ చేశారు.

ఇక, టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ లాంటి అనేక అంశాలపై షెకావత్ తో మాట్లాడానని పవన్ చెప్పారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోనుగా మార్చినందుకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ హామీ పథకం (MGNREGS)లో భాగంగా చేస్తున్న సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణం, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణాలు, అంగన్వాడీ, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులకు సంబంధించి అంచనా వ్యయం నిధులను పెంచాలని కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో పలు కీలక అంశాలపై పవన్ చర్చించారు. ఉపాధి పథకంలో కూలీల బడ్జెట్ ను పెంచడం, రూ.2081 కోట్ల కూలీల వేతన సొమ్ము విడుదల చేయడంపై ధన్యవాదాలు తెలిపారు.

ఏపీలో 2,643 గ్రామాలకు అనుసంధాన రోడ్లు వేయాలని, అయితే పీఎం గ్రామీణ సడక్ యోజన కింద 413 రోడ్లు నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించిందని కేంద్ర మంత్రి దృష్టికి పవన్ తీసుకువెళ్లారు. పవన్ రెండో రోజు పర్యటలో భాగంగా ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు.

This post was last modified on November 27, 2024 2:36 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

1 hour ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

1 hour ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

2 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

2 hours ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

3 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

4 hours ago