ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ మర్యాపూర్వకంగా విందుకు ఆహ్వానించారు. జనసేన ఎంపీలు బాలశౌరి, ఉదయ్ కుమార్ లతో కలిసి ఉప రాష్ట్రపతి ఇచ్చిన విందుకు పవన్ హాజరయ్యారు.
మరోవైపు, కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, సీఆర్ పాటిల్, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఏపీలో 7వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని నిర్మలా సీతాారామన్ కు పవన్ వివరించారు. గత ప్రభుత్వం నిర్లక్యపూరితంగా వ్యవహరించి ఏఐఐబీకి మ్యాచింగ్ గ్రాంట్స్ చెల్లించలేదని, దీంతో, గడువు ముగిసిందని అన్నారు. కాలపరిమితిని రెండేళ్లు పెంచాలని లేదంటే 90 శాతం నిధులు ఏఐఐబీ నుంచి ఇప్పించాలని రిక్వెస్ట్ చేశారు.
ఇక, టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ లాంటి అనేక అంశాలపై షెకావత్ తో మాట్లాడానని పవన్ చెప్పారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోనుగా మార్చినందుకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ హామీ పథకం (MGNREGS)లో భాగంగా చేస్తున్న సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణం, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణాలు, అంగన్వాడీ, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులకు సంబంధించి అంచనా వ్యయం నిధులను పెంచాలని కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో పలు కీలక అంశాలపై పవన్ చర్చించారు. ఉపాధి పథకంలో కూలీల బడ్జెట్ ను పెంచడం, రూ.2081 కోట్ల కూలీల వేతన సొమ్ము విడుదల చేయడంపై ధన్యవాదాలు తెలిపారు.
ఏపీలో 2,643 గ్రామాలకు అనుసంధాన రోడ్లు వేయాలని, అయితే పీఎం గ్రామీణ సడక్ యోజన కింద 413 రోడ్లు నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించిందని కేంద్ర మంత్రి దృష్టికి పవన్ తీసుకువెళ్లారు. పవన్ రెండో రోజు పర్యటలో భాగంగా ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు.
This post was last modified on November 27, 2024 2:36 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…