ఇప్పటి వరకు వైసీపీకి చెందిన పలువురు కీలక నాయకులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీరిలో జోగి రమేష్ సహా నందిగం సురేష్(ప్రస్తుతం జైల్లో ఉన్నారు) వంటి ఫైర్ బ్రాండ్నాయకులు ఉన్నారు. అయితే.. ఇప్పుడు టీడీపీ టార్గెట్.. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు బ్రదర్స్ కావడం గమనార్హం. వీరిని ఈ రోజు లేదా రేపు అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు.
ఏం జరిగింది?
2022, నంబరు 4న అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. వైసీపీ హయాంలో ధరలు మండిపోతున్నాయని పేర్కొంటూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే 2022, నవంబరు 4న ఆయన ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో పర్యటించారు. రాత్రం 7 గంటల సమయంలో నందిగామ జంక్షన్తో ప్రసంగించేందుకు రెడీ అయ్యారు.
ఖచ్చితంగా ఇదే సమయంలో బాబు కాన్వాయ్పై కొందరు దుండగులు రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో చంద్రబాబు భద్రతా సిబ్బందికి నేతృత్వం వహిస్తున్న అధికారికి తీవ్రంగా గాయమైంది. అప్పట్లోనే దీనిపై కేసు నమోదైనా.. వైసీపీ అనుకూల వ్యక్తులు దీని వెనుక ఉన్నారన్న కారణంగా కేసు ముందుకు సాగలేదు. అయితే.. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఈ కేసును తిరగదోడారు. దీనిలో భాగంగా పోలీసులు ప్రత్యేకంగా దీనిని చేపట్టారు.
ఈ మొత్తం దాడి ఘటన నందిగామలోని వైసీపీ కార్యాలయంలో పురుడు పోసుకుందని, అక్కడే ప్లాన్ చేశారని, మొండితోక బ్రదర్స్ హస్తం ఉందని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే 15 మందని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కూపీ లాగుతున్నారు. వారు ఇచ్చే సమాచారం ఆధారంగా మొండితోక బ్రదర్స్ను ఈ రోజు లేదా రేపటిలోగా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు బ్రదర్స్ జాడ లేకుండా పోవడం గమనార్హం.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…