ఇప్పటి వరకు వైసీపీకి చెందిన పలువురు కీలక నాయకులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీరిలో జోగి రమేష్ సహా నందిగం సురేష్(ప్రస్తుతం జైల్లో ఉన్నారు) వంటి ఫైర్ బ్రాండ్నాయకులు ఉన్నారు. అయితే.. ఇప్పుడు టీడీపీ టార్గెట్.. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు బ్రదర్స్ కావడం గమనార్హం. వీరిని ఈ రోజు లేదా రేపు అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు.
ఏం జరిగింది?
2022, నంబరు 4న అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. వైసీపీ హయాంలో ధరలు మండిపోతున్నాయని పేర్కొంటూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే 2022, నవంబరు 4న ఆయన ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో పర్యటించారు. రాత్రం 7 గంటల సమయంలో నందిగామ జంక్షన్తో ప్రసంగించేందుకు రెడీ అయ్యారు.
ఖచ్చితంగా ఇదే సమయంలో బాబు కాన్వాయ్పై కొందరు దుండగులు రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో చంద్రబాబు భద్రతా సిబ్బందికి నేతృత్వం వహిస్తున్న అధికారికి తీవ్రంగా గాయమైంది. అప్పట్లోనే దీనిపై కేసు నమోదైనా.. వైసీపీ అనుకూల వ్యక్తులు దీని వెనుక ఉన్నారన్న కారణంగా కేసు ముందుకు సాగలేదు. అయితే.. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఈ కేసును తిరగదోడారు. దీనిలో భాగంగా పోలీసులు ప్రత్యేకంగా దీనిని చేపట్టారు.
ఈ మొత్తం దాడి ఘటన నందిగామలోని వైసీపీ కార్యాలయంలో పురుడు పోసుకుందని, అక్కడే ప్లాన్ చేశారని, మొండితోక బ్రదర్స్ హస్తం ఉందని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే 15 మందని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కూపీ లాగుతున్నారు. వారు ఇచ్చే సమాచారం ఆధారంగా మొండితోక బ్రదర్స్ను ఈ రోజు లేదా రేపటిలోగా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు బ్రదర్స్ జాడ లేకుండా పోవడం గమనార్హం.
This post was last modified on November 27, 2024 11:27 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…