వైసీపీ పాలనలో ప్రజా ధనం నీళ్లలా దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అందిన కాడికి అప్పులు చేయడం ఒక ఎత్తయితే..అవకాశం ఉన్న చోటల్లా స్కామ్ లు చేసి సైలెంట్ గా ఉండడం మరో ఎత్తు అన్న రీతిలో జగన్ పాలన సాగిందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. పఫ్ లు మొదలు పెన్నుల వరకు జనం సొమ్మును జగన్ దుబారా చేసిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్ హయాంలో జరిగిన మరో భారీ స్కాం బయటపడింది.
కడప ఎయిర్ పోర్ట్ పనుల్లో రూ 165.72 కోట్లు మాయమయ్యాయని ఆడిటర్ జనరల్ (ఏజీ) తాజాగా నిర్ధారించిన వైనం సంచలనం రేపుతోంది. నిబంధనలను తుంగలో తొక్కిన జగన్ సర్కార్ భారీ మోసానికి తెరలేపిందని ఏజీ తాజాగా గుర్తించింది. ఆర్థిక శాఖకు తెలియకుండా పీఏవోల ద్వారా ఐ అండ్ ఐ ఎనర్జీస్ సంస్థకి రూ 165.72 కోట్ల బిల్లును పాస్ చేయించిందని ఏజీ గుర్తించంది. అంతేకాదు, ఆ భారీ మొత్తాన్ని ఏపీఐఐసీ బ్యాంకుకు బదిలీ చేసిన వైనాన్ని ఏజీ బట్టబయలు చేసింది. ఇలా తమ అనుయాయ కంపెనీకి జగన్ సర్కార్ ఇష్టం వచ్చినట్లు బిల్లులు పాస్ చేయడంపై ఏజీ వివరణ కోరింది.
అయితే, బయటపడింది ఈ ఒక్క వ్యవహారమేనని, ఇంకా బయటపడాల్సినవి చాలా ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన అనుయాయులకు జగన్ పలు బిల్లులను అడ్డగోలుగా మంజూరు చేసుకున్నారని, బయటి కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని విమర్శిస్తున్నారు. ఆ తరహాలోనే నిధుల మళ్లింపులు చాలా జరిగాయని వాటిపై కూడా ఏజీ ఫోకస్ చేయాలని కోరుతున్నారు.
This post was last modified on November 26, 2024 9:45 pm
సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న…
‘ఇరుముడి’ ఇప్పుడు పెద్ద హిట్. రవితేజ మాస్ ఇమేజ్ ఒక వైపు ఉన్నా, సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసింది అందులోని…
విజయ్ దేవరకొండ.. తమ్ముడి కెరీర్ మొదట్లో సినిమాలకు తనవంతు పుష్ ఇచ్చాడు. కానీ ఆనంద్కు సొంతంగా పేరు రావడం మొదలయ్యాక…
హనుమాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాణంలో మహాకాళి రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా…
టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ…
ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న రవితేజ తన అభిమానుల ఏళ్ళ తరబడి ఆకలిని ఒకేసారి తీర్చేశాడు. హిట్…