వైసీపీ పాలనలో ప్రజా ధనం నీళ్లలా దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అందిన కాడికి అప్పులు చేయడం ఒక ఎత్తయితే..అవకాశం ఉన్న చోటల్లా స్కామ్ లు చేసి సైలెంట్ గా ఉండడం మరో ఎత్తు అన్న రీతిలో జగన్ పాలన సాగిందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. పఫ్ లు మొదలు పెన్నుల వరకు జనం సొమ్మును జగన్ దుబారా చేసిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్ హయాంలో జరిగిన మరో భారీ స్కాం బయటపడింది.
కడప ఎయిర్ పోర్ట్ పనుల్లో రూ 165.72 కోట్లు మాయమయ్యాయని ఆడిటర్ జనరల్ (ఏజీ) తాజాగా నిర్ధారించిన వైనం సంచలనం రేపుతోంది. నిబంధనలను తుంగలో తొక్కిన జగన్ సర్కార్ భారీ మోసానికి తెరలేపిందని ఏజీ తాజాగా గుర్తించింది. ఆర్థిక శాఖకు తెలియకుండా పీఏవోల ద్వారా ఐ అండ్ ఐ ఎనర్జీస్ సంస్థకి రూ 165.72 కోట్ల బిల్లును పాస్ చేయించిందని ఏజీ గుర్తించంది. అంతేకాదు, ఆ భారీ మొత్తాన్ని ఏపీఐఐసీ బ్యాంకుకు బదిలీ చేసిన వైనాన్ని ఏజీ బట్టబయలు చేసింది. ఇలా తమ అనుయాయ కంపెనీకి జగన్ సర్కార్ ఇష్టం వచ్చినట్లు బిల్లులు పాస్ చేయడంపై ఏజీ వివరణ కోరింది.
అయితే, బయటపడింది ఈ ఒక్క వ్యవహారమేనని, ఇంకా బయటపడాల్సినవి చాలా ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన అనుయాయులకు జగన్ పలు బిల్లులను అడ్డగోలుగా మంజూరు చేసుకున్నారని, బయటి కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని విమర్శిస్తున్నారు. ఆ తరహాలోనే నిధుల మళ్లింపులు చాలా జరిగాయని వాటిపై కూడా ఏజీ ఫోకస్ చేయాలని కోరుతున్నారు.
This post was last modified on November 26, 2024 9:45 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…