తాజాగా ముగిసిన ఐపీఎల్-2025 వేలంలో అంతర్జాతీయ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్లుగా పేరున్న వార్నర్, బెయిర్ స్టో వంటి వారిని సైతం అన్ని ఫ్రాంచైజీలు పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అదే సమయంలో టాలెంట్ ఉన్న యువ క్రీడాకారులకు దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు పెద్దపీట వేశాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్-2025 వేలంలో ఆంధ్రా క్రికెటర్లు ఐదుగురు సత్తా చాటారు. ఈ నేపథ్యంలోనే వారికి ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
ఐపీఎల్ వేలంలో విశాఖపట్నానికి చెందిన ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకు వేలానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకుంది. ఇక, విశాఖపట్నానికి చెందిన మరో క్రికెటర్ పైల అవినాష్ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అదే క్రమంలో గుంటూరుకు చెందిన యంగ్ సెన్సేషన్ షేక్ రషీద్ను రూ. 30 లక్షలకి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. గత సీజన్లో కూడా రషీద్ ను చెన్నై కొనుగోలు చేసింది. ఆ తర్వాత కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజును రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇక, శ్రీకాకుళానికి చెందిన స్పిన్నర్ త్రిపురణ విజయ్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ జట్లకు సెలక్ట్ అయిన ఈ ఐదుగురు ఆంధ్రా ఆటగాళ్లకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. వీరంతా ఐపీఎల్ లో రాణించి అంతర్జాతీయ క్రికెట్ లో దేశం తరఫున ఆడి రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని లోకేష్ ఆకాంక్షించారు. క్రికెట్ పట్ల ఆ ఆటగాళ్ల అంకిత భావం, కఠోర శిక్షణ, కష్టపడేతత్వం వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకున్నారు.
This post was last modified on November 26, 2024 9:41 pm
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…