Political News

ఐపీఎల్..ఆంధ్రా క్రికెటర్లకు లోకేష్ విషెస్

తాజాగా ముగిసిన ఐపీఎల్-2025 వేలంలో అంతర్జాతీయ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్లుగా పేరున్న వార్నర్, బెయిర్ స్టో వంటి వారిని సైతం అన్ని ఫ్రాంచైజీలు పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అదే సమయంలో టాలెంట్ ఉన్న యువ క్రీడాకారులకు దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు పెద్దపీట వేశాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్-2025 వేలంలో ఆంధ్రా క్రికెటర్లు ఐదుగురు సత్తా చాటారు. ఈ నేపథ్యంలోనే వారికి ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

ఐపీఎల్ వేలంలో విశాఖపట్నానికి చెందిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకు వేలానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకుంది. ఇక, విశాఖపట్నానికి చెందిన మరో క్రికెటర్ పైల అవినాష్‌ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అదే క్రమంలో గుంటూరుకు చెందిన యంగ్ సెన్సేషన్ షేక్ రషీద్‌ను రూ. 30 లక్షలకి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో కూడా రషీద్ ను చెన్నై కొనుగోలు చేసింది. ఆ తర్వాత కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజును రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇక, శ్రీకాకుళానికి చెందిన స్పిన్నర్ త్రిపురణ విజయ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ జట్లకు సెలక్ట్ అయిన ఈ ఐదుగురు ఆంధ్రా ఆటగాళ్లకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. వీరంతా ఐపీఎల్ లో రాణించి అంతర్జాతీయ క్రికెట్ లో దేశం తరఫున ఆడి రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని లోకేష్ ఆకాంక్షించారు. క్రికెట్ పట్ల ఆ ఆటగాళ్ల అంకిత భావం, కఠోర శిక్షణ, కష్టపడేతత్వం వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకున్నారు.

Kumar

Recent Posts

ఏషియ‌న్ సునీల్‌పై నాగ‌వంశీ రివెంజ్?

టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కున్న పాపులారిటీనే వేరు. ప్ర‌స్తుతం…

36 minutes ago

రామాయ‌ణ పై ముందే చేతులెత్తేసిన కాజ‌ల్

స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో న‌టించిన‌పుడు వారి ఇమేజ్‌కు త‌గ్గ పాత్ర‌లు లేక‌పోతే.. అభిమానులు ఫీల‌వ‌డం…

2 hours ago

టీడీపీ, జనసేనల మైత్రి క్షేత్రస్థాయిలో ఎలా ఉంది…?

ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…

2 hours ago

మావిగనా?… మాయా జగనా..?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…

4 hours ago

అంత అత్యాశ ఎందుకు ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…

11 hours ago

అవమానంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ‘అల్ఫా’

మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…

11 hours ago