Political News

ఐపీఎల్..ఆంధ్రా క్రికెటర్లకు లోకేష్ విషెస్

తాజాగా ముగిసిన ఐపీఎల్-2025 వేలంలో అంతర్జాతీయ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్లుగా పేరున్న వార్నర్, బెయిర్ స్టో వంటి వారిని సైతం అన్ని ఫ్రాంచైజీలు పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అదే సమయంలో టాలెంట్ ఉన్న యువ క్రీడాకారులకు దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు పెద్దపీట వేశాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్-2025 వేలంలో ఆంధ్రా క్రికెటర్లు ఐదుగురు సత్తా చాటారు. ఈ నేపథ్యంలోనే వారికి ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

ఐపీఎల్ వేలంలో విశాఖపట్నానికి చెందిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకు వేలానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకుంది. ఇక, విశాఖపట్నానికి చెందిన మరో క్రికెటర్ పైల అవినాష్‌ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అదే క్రమంలో గుంటూరుకు చెందిన యంగ్ సెన్సేషన్ షేక్ రషీద్‌ను రూ. 30 లక్షలకి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో కూడా రషీద్ ను చెన్నై కొనుగోలు చేసింది. ఆ తర్వాత కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజును రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇక, శ్రీకాకుళానికి చెందిన స్పిన్నర్ త్రిపురణ విజయ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ జట్లకు సెలక్ట్ అయిన ఈ ఐదుగురు ఆంధ్రా ఆటగాళ్లకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. వీరంతా ఐపీఎల్ లో రాణించి అంతర్జాతీయ క్రికెట్ లో దేశం తరఫున ఆడి రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని లోకేష్ ఆకాంక్షించారు. క్రికెట్ పట్ల ఆ ఆటగాళ్ల అంకిత భావం, కఠోర శిక్షణ, కష్టపడేతత్వం వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకున్నారు.

This post was last modified on November 26, 2024 9:41 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

గాడ్ ఫాదర్ తప్పులేంటో తెలిసొస్తున్నాయ్

మూడేళ్ళ క్రితం వచ్చి వెళ్లిపోయిన గాడ్ ఫాదర్ ప్రస్తావన ఇప్పుడెందుకు అనుకుంటున్నారా. ఎల్2 ఎంపురాన్ రిలీజ్ వేళ మోహన్ లాల్…

3 minutes ago

‘తాళం` తీసేవారు లేరు.. వైసీపీ ఏం చేస్తుంది?

ఔను.. నిజ‌మే! ఏపీలో వైనాట్ 175 నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్లిన వైసీపీ.. కేవ‌లం 11 స్థానాల‌కే ప‌రిమితమైంది. గ‌త ఏడాది…

31 minutes ago

బాబుకు ఉద్యోగి లేఖ!.. ఇంత చేస్తూ ప్రచారం చేసుకోరా?

ఏపీలో వైసీపీ పాలన, కూటమి పాలనల్లోని వ్యత్యాసాలను ఎత్తి చూపారు ఓ ఉద్యోగి. అంతేనా నాటి ప్రభుత్వ పాలనలో తామెలాంటి…

2 hours ago

కోర్టుల‌తో ప‌రిహాస‌మా?: ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసులో సుప్రీం ఫైర్

తెలంగాణ‌కు చెందిన ఎమ్మెల్యేల అన‌ర్హత పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌తివాదులైన జంపింగ్‌ ఎమ్మెల్యేల త‌ర‌ఫున…

3 hours ago

ట్విస్ట్ : ప్రీమియం లొకేషన్లకు మాత్రమే టికెట్ రేట్ల పెంపు

రాబిన్ హుడ్ టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జిఓ బయటికి వచ్చాక దాని…

3 hours ago

పెద్దాయన క్షమాపణ…ఇక వదిలేయొచ్చు

ఇటీవలే జరిగిన రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో చిన్న పాత్ర…

3 hours ago