తాజాగా ముగిసిన ఐపీఎల్-2025 వేలంలో అంతర్జాతీయ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్లుగా పేరున్న వార్నర్, బెయిర్ స్టో వంటి వారిని సైతం అన్ని ఫ్రాంచైజీలు పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అదే సమయంలో టాలెంట్ ఉన్న యువ క్రీడాకారులకు దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు పెద్దపీట వేశాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్-2025 వేలంలో ఆంధ్రా క్రికెటర్లు ఐదుగురు సత్తా చాటారు. ఈ నేపథ్యంలోనే వారికి ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
ఐపీఎల్ వేలంలో విశాఖపట్నానికి చెందిన ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకు వేలానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకుంది. ఇక, విశాఖపట్నానికి చెందిన మరో క్రికెటర్ పైల అవినాష్ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అదే క్రమంలో గుంటూరుకు చెందిన యంగ్ సెన్సేషన్ షేక్ రషీద్ను రూ. 30 లక్షలకి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. గత సీజన్లో కూడా రషీద్ ను చెన్నై కొనుగోలు చేసింది. ఆ తర్వాత కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజును రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇక, శ్రీకాకుళానికి చెందిన స్పిన్నర్ త్రిపురణ విజయ్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ జట్లకు సెలక్ట్ అయిన ఈ ఐదుగురు ఆంధ్రా ఆటగాళ్లకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. వీరంతా ఐపీఎల్ లో రాణించి అంతర్జాతీయ క్రికెట్ లో దేశం తరఫున ఆడి రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని లోకేష్ ఆకాంక్షించారు. క్రికెట్ పట్ల ఆ ఆటగాళ్ల అంకిత భావం, కఠోర శిక్షణ, కష్టపడేతత్వం వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకున్నారు.
This post was last modified on November 26, 2024 9:41 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…