ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్ని కల సంఘం తాజాగా షెడ్యూల్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఏపీ, పశ్చిమబెంగాల్, ఒడిశా, హరియాణాలు ఉన్నాయి. మొత్తం 6 స్థానాలకు గాను విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 2 స్థానాలు, ఒడిశాలో 1 స్థానం, పశ్చిమ బెంగాల్లో 2, హరియాణలో ఒక స్థానం ఖాళీ అయ్యాయి. వీటికి డిసెంబరు 20న ఎన్నికలు నిర్వహిస్తారు.
ఏపీలో రెండు స్థానాలను గమనిస్తే.. రెండు కూడా వైసీపీకి చెందిన స్థానాలే. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రెండు మాసాల కిందట వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారు తమ రాజ్యసభ స్థానాలకు కూడా రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో ఏపీలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని ఇంకా ఎవరికీ కేటాయించలేదు.
ప్రస్తుతం అసెంబ్లీలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీకి బలం ఎక్కువగా ఉన్నందున ఆపార్టీలకే దక్కనున్నాయి. అయితే.. తాజాగా రాజీనామా చేసిన వచ్చిన మోపిదేవి, బీదలకే రాజ్యసభ సీట్లు ఇస్తారా? లేక వేరేవారికి అవకాశం కల్పిస్తారా? అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉండడం గమనార్హం.
ఇదీ షెడ్యూల్..నోటిఫికేషన్ విడుదల: డిసెంబరు 3నామినేషన్లకు గడువు: డిసెంబరు 10నామినేషన్ల పరిశీలన: డిసెంబరు 11పోలింగ్ డేట్: డిసెంబరు 20ఓట్ల లెక్కింపు: అదే రోజు
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…