ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్ని కల సంఘం తాజాగా షెడ్యూల్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఏపీ, పశ్చిమబెంగాల్, ఒడిశా, హరియాణాలు ఉన్నాయి. మొత్తం 6 స్థానాలకు గాను విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 2 స్థానాలు, ఒడిశాలో 1 స్థానం, పశ్చిమ బెంగాల్లో 2, హరియాణలో ఒక స్థానం ఖాళీ అయ్యాయి. వీటికి డిసెంబరు 20న ఎన్నికలు నిర్వహిస్తారు.
ఏపీలో రెండు స్థానాలను గమనిస్తే.. రెండు కూడా వైసీపీకి చెందిన స్థానాలే. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రెండు మాసాల కిందట వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారు తమ రాజ్యసభ స్థానాలకు కూడా రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో ఏపీలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని ఇంకా ఎవరికీ కేటాయించలేదు.
ప్రస్తుతం అసెంబ్లీలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీకి బలం ఎక్కువగా ఉన్నందున ఆపార్టీలకే దక్కనున్నాయి. అయితే.. తాజాగా రాజీనామా చేసిన వచ్చిన మోపిదేవి, బీదలకే రాజ్యసభ సీట్లు ఇస్తారా? లేక వేరేవారికి అవకాశం కల్పిస్తారా? అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉండడం గమనార్హం.
ఇదీ షెడ్యూల్..నోటిఫికేషన్ విడుదల: డిసెంబరు 3నామినేషన్లకు గడువు: డిసెంబరు 10నామినేషన్ల పరిశీలన: డిసెంబరు 11పోలింగ్ డేట్: డిసెంబరు 20ఓట్ల లెక్కింపు: అదే రోజు
This post was last modified on November 26, 2024 3:05 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…