ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్ని కల సంఘం తాజాగా షెడ్యూల్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఏపీ, పశ్చిమబెంగాల్, ఒడిశా, హరియాణాలు ఉన్నాయి. మొత్తం 6 స్థానాలకు గాను విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 2 స్థానాలు, ఒడిశాలో 1 స్థానం, పశ్చిమ బెంగాల్లో 2, హరియాణలో ఒక స్థానం ఖాళీ అయ్యాయి. వీటికి డిసెంబరు 20న ఎన్నికలు నిర్వహిస్తారు.
ఏపీలో రెండు స్థానాలను గమనిస్తే.. రెండు కూడా వైసీపీకి చెందిన స్థానాలే. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రెండు మాసాల కిందట వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారు తమ రాజ్యసభ స్థానాలకు కూడా రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో ఏపీలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని ఇంకా ఎవరికీ కేటాయించలేదు.
ప్రస్తుతం అసెంబ్లీలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీకి బలం ఎక్కువగా ఉన్నందున ఆపార్టీలకే దక్కనున్నాయి. అయితే.. తాజాగా రాజీనామా చేసిన వచ్చిన మోపిదేవి, బీదలకే రాజ్యసభ సీట్లు ఇస్తారా? లేక వేరేవారికి అవకాశం కల్పిస్తారా? అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉండడం గమనార్హం.
ఇదీ షెడ్యూల్..నోటిఫికేషన్ విడుదల: డిసెంబరు 3నామినేషన్లకు గడువు: డిసెంబరు 10నామినేషన్ల పరిశీలన: డిసెంబరు 11పోలింగ్ డేట్: డిసెంబరు 20ఓట్ల లెక్కింపు: అదే రోజు
This post was last modified on November 26, 2024 3:05 pm
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…