ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్ని కల సంఘం తాజాగా షెడ్యూల్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఏపీ, పశ్చిమబెంగాల్, ఒడిశా, హరియాణాలు ఉన్నాయి. మొత్తం 6 స్థానాలకు గాను విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 2 స్థానాలు, ఒడిశాలో 1 స్థానం, పశ్చిమ బెంగాల్లో 2, హరియాణలో ఒక స్థానం ఖాళీ అయ్యాయి. వీటికి డిసెంబరు 20న ఎన్నికలు నిర్వహిస్తారు.
ఏపీలో రెండు స్థానాలను గమనిస్తే.. రెండు కూడా వైసీపీకి చెందిన స్థానాలే. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రెండు మాసాల కిందట వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారు తమ రాజ్యసభ స్థానాలకు కూడా రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో ఏపీలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని ఇంకా ఎవరికీ కేటాయించలేదు.
ప్రస్తుతం అసెంబ్లీలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీకి బలం ఎక్కువగా ఉన్నందున ఆపార్టీలకే దక్కనున్నాయి. అయితే.. తాజాగా రాజీనామా చేసిన వచ్చిన మోపిదేవి, బీదలకే రాజ్యసభ సీట్లు ఇస్తారా? లేక వేరేవారికి అవకాశం కల్పిస్తారా? అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉండడం గమనార్హం.
ఇదీ షెడ్యూల్..నోటిఫికేషన్ విడుదల: డిసెంబరు 3నామినేషన్లకు గడువు: డిసెంబరు 10నామినేషన్ల పరిశీలన: డిసెంబరు 11పోలింగ్ డేట్: డిసెంబరు 20ఓట్ల లెక్కింపు: అదే రోజు
This post was last modified on November 26, 2024 3:05 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…