Political News

చాగంటికి చంద్ర‌బాబు దిశానిర్దేశం.. ఏం చెప్పారంటే!

ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న క‌ర్త‌.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వ‌ర‌రావును ఏపీ ప్ర‌భుత్వం `నైతిక విలువ‌ల` స‌ల‌హాదారుగా నియ‌మించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న తాజాగా ఆ ప‌ద‌విని స్వీక‌రించారు. ఈ నెల నుంచే బాధ్య‌త‌లు తీసుకోవాల‌న్న సీఎం చంద్ర బాబు సూచ‌న‌ల మేర‌కు ఆయ‌న కార్య‌రంగంలోకి దిగారు. వ‌చ్చే ఏడాది విద్యార్థుల‌కు ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఉన్న నేప‌థ్యంలో వారిలో ఆత్మ స్థ‌యిర్యం నింపేందుకు, ప‌రీక్ష‌ల విష‌యంలో వారు మాన‌సిక ఆందోళ‌న లేకుండా ధైర్యంగా ప‌రీక్ష‌లు రాసేలా ప్రోత్స‌హిం చేందుకు ఈ నెల నుంచే నైతిక విలువ‌ల‌ను విద్యార్థుల‌కు బోధించాల‌ని చంద్ర‌బాబు సూచించారు.

ఈ క్ర‌మంలో తాజాగా సోమ‌వారం కాకినాడ నుంచి అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి వ‌చ్చిన చాగంటి కోటేశ్వ‌ర‌రావు.. సీఎం చంద్ర‌బాబును క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా చాగంటిని శాలువా, మొమెంటోతో సీఎం చంద్ర‌బాబు ఘ‌నంగా స‌త్క‌రించారు. అనంత‌రం 45 నిమిషాల పాటు ఇరువురు చ‌ర్చించుకున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు.. ఏయే అంశాల‌పై విద్యార్థుల‌కు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాల‌నే అంశంపై దిశానిర్దేశం చేశారు. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశ‌గా విద్యార్థుల‌ను మౌల్డ్ చేయాల‌ని సీఎం సూచించారు. అదేవిధంగా మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని పేర్కొన్నారు.

అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని… ఆ దిశగా అందరూ కృషి చేయాలని చాగంటికి సీఎం చంద్ర‌బాబు సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చని తెలిపారు. ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు మనకు ఉన్నాయ‌న్న చంద్ర‌బాబు.. ఈ తరానికి, భవిష్యత్ తరాలకు వాటిని అందించాలని కోరారు.

మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలని సూచించారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని నైతిక విలువల పతనానికి ఇవి కారణం అవుతున్నాయని అన్నారు. సుమతీ-వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్ధులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్‌తో చర్చించానని చాగంటి కోటేశ్వరావు తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తరువాత తొలిసారి తన వద్దకు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

Kumar

Recent Posts

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

2 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

2 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

2 hours ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

3 hours ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

3 hours ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

4 hours ago