ఏపీ రాజధాని అమరావతిలో తొలి ప్రైవేటు నిర్మాణం ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. రాజధాని ప్రాంతంలో 2015-17 మధ్య నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ ఆధ్వర్యం లోని బసవ తారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి అప్పటి టీడీపీప్రభుత్వం భూమిని కేటాయించింది. దీంతో అప్పట్లో లీజుకు సంబంధించిన సొమ్మును బాలయ్య చెల్లించారు. కానీ, పనులు చేపట్టే సమయానికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది.
ఇక, మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేయడంతో అన్ని ప్రాజెక్టుల మాదిరిగానే బాలయ్య ఆసుపత్రి నిర్మాణం పనులు కూడా నిలిచిపోయాయి. ఐదేళ్ల తర్వాత.. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అమరావతి నిర్మాణాలపై సర్కారు దృష్టి పెట్టింది. కేంద్రం సాయంతో రూ.15 వేల కోట్లు, సొంతగా మరో 12 వేల కోట్లు, నాబార్డు ద్వారా మరో 15 వేల కోట్ల రూపాయలను తీసుకుని రాజధాని నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య కూడా తన ఆసుపత్రి నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఆదివారం ఆయన రాజధానిలో పర్యటించారు. ఇక్కడ తమ బసవ తారకం ఇండో-అమెరికన్ ఆసుపత్రికి కేటాయించిన భూములను పరిశీలించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ చేసిన నేపథ్యంలో పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి.
ఈ క్రమంలోనే అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కి సంబందించిన స్థలాన్ని సిఆర్డిఏ అధికారులుతో కలిసి పరిశీలించిన నందమూరి బాలకృష్ణ.. త్వరలో హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా సిఆర్డిఏ అధికారులతో చర్చలు జరిపారు. కేన్సర్ వైద్యం అందరికి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో బసవతరకం కేన్సర్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ నిర్మాణం ఈ నెల చివరలో ప్రారంభించనున్నట్టు తెలిసింది ఇదే జరిగితే.. అమరావతిలో ఏర్పడే తొలి ప్రైవేటు నిర్మాణం ఇదే అవుతుంది.
This post was last modified on November 24, 2024 7:08 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…