ఏపీ రాజధాని అమరావతిలో తొలి ప్రైవేటు నిర్మాణం ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. రాజధాని ప్రాంతంలో 2015-17 మధ్య నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ ఆధ్వర్యం లోని బసవ తారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి అప్పటి టీడీపీప్రభుత్వం భూమిని కేటాయించింది. దీంతో అప్పట్లో లీజుకు సంబంధించిన సొమ్మును బాలయ్య చెల్లించారు. కానీ, పనులు చేపట్టే సమయానికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది.
ఇక, మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేయడంతో అన్ని ప్రాజెక్టుల మాదిరిగానే బాలయ్య ఆసుపత్రి నిర్మాణం పనులు కూడా నిలిచిపోయాయి. ఐదేళ్ల తర్వాత.. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అమరావతి నిర్మాణాలపై సర్కారు దృష్టి పెట్టింది. కేంద్రం సాయంతో రూ.15 వేల కోట్లు, సొంతగా మరో 12 వేల కోట్లు, నాబార్డు ద్వారా మరో 15 వేల కోట్ల రూపాయలను తీసుకుని రాజధాని నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య కూడా తన ఆసుపత్రి నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఆదివారం ఆయన రాజధానిలో పర్యటించారు. ఇక్కడ తమ బసవ తారకం ఇండో-అమెరికన్ ఆసుపత్రికి కేటాయించిన భూములను పరిశీలించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ చేసిన నేపథ్యంలో పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి.
ఈ క్రమంలోనే అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కి సంబందించిన స్థలాన్ని సిఆర్డిఏ అధికారులుతో కలిసి పరిశీలించిన నందమూరి బాలకృష్ణ.. త్వరలో హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా సిఆర్డిఏ అధికారులతో చర్చలు జరిపారు. కేన్సర్ వైద్యం అందరికి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో బసవతరకం కేన్సర్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ నిర్మాణం ఈ నెల చివరలో ప్రారంభించనున్నట్టు తెలిసింది ఇదే జరిగితే.. అమరావతిలో ఏర్పడే తొలి ప్రైవేటు నిర్మాణం ఇదే అవుతుంది.
This post was last modified on November 24, 2024 7:08 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…