ఈ ఏడాది జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు మాత్రమే దక్కాయి. మొత్తం 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో కూటమి పార్టీలు 164 స్థానాల్లో విజయం దక్కించుకోగా.. కేవలం వైసీపీ 11 సీట్లకే నిలబడిపోయింది. అయితే.. దీనిపై అప్పట్లోనే చంద్రబాబు విశ్లేషించారు. కూటమి పార్టీలు కాలికి బలపం కట్టుకుని తిరిగాయని.. అయినా కూడా ఎందుకు ఇలా జరిగిందని ఆయన మీడియా ముందే చెప్పుకొచ్చా రు. దీనిపై అంతర్గత చర్చలు కూడా చేశారు.
ఈ సమయంలో ఆయన ఆ 11 స్థానాల్లోని టీడీపీ ఇంచార్జ్లకు కూడా వార్నింగులు ఇచ్చారు. “బీటెక్ రవి సునాయాసంగా గెలిచే ఛాన్స్ ఉంది. అయినా.. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. దీనికి సమన్వయం లేకపోవడాన్ని గుర్తించాం“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచిన విషయంపై అయితే.. చంద్రబాబు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గెలిచితీరాల్సిన స్థానం ఇదేనని, కానీ, అంతర్గత కుమ్ములాటలతోనే దీనిని చేజార్చుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
నిజానికి అంగళ్లలో చంద్రబాబుపై దాడులు జరిగినప్పుడు.. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య రాళ్ల యుద్ధం సాగినప్పుడు సానుభూతి పెరుగుతుందని ఆశించారు. అలానే పెరిగిందికూడా. కానీ, పుంగనూరులో `రామచంద్ర` పేరుతో ఎక్కువ మంది పోటీలో నిలిచారు. దీనికితోడు సమన్వయం కూడా సన్నగిల్లిందని తేల్చారు. అదేవిధంగా కడప జిల్లా బద్వేల్లోనూ టీడీపీ నేతలు వైసీపీకి సహకరించారన్న వాదనపై స్పందించారు. ఈ క్రమంలోనే అక్కడి టీడీపీ ఇంచార్జ్.. బొజ్జా రోశన్న ను పక్కన పెట్టారు.
ఇక, ఎస్టీ నియోజకవర్గాలైన అరకు, పాడేరులోనూ పరాజయం పాలవడానికి తమ్ముళ్లు సహకరించలేదన్న వాదనను కూడా చంద్రబాబు అంగీకరించారు. అలానే ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దర్శిలో ప్రస్తుతం మంత్రి గొట్టిపాటి రవి కుటుంబీకురాలు డాక్టర్ లక్ష్మి చివరి వరకు పోరాడారు. లీడ్లోనే కొనసాగారు. కానీ, చివరి రౌండ్లలో వైసీపీ అభ్యర్థి.. బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి విజయం దక్కించుకున్నా రు. ఇక్కడ కూడా తమ్ముళ్లదే తప్పని అప్పట్లోనే చంద్రబాబు తీర్మానించారు. సమన్వయ లేమి కారణంగా వైసీపీ 11 సీట్లు దక్కించుకుందన్నారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో మార్పులు చేశారు.
This post was last modified on November 24, 2024 2:28 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…