Political News

వైసీపీకి ఆ 11 సీట్లు ఎలా వ‌చ్చాయి?: చంద్ర‌బాబు

ఈ ఏడాది జ‌రిగిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీకి 11 స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. మొత్తం 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో కూట‌మి పార్టీలు 164 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకోగా.. కేవ‌లం వైసీపీ 11 సీట్ల‌కే నిల‌బ‌డిపోయింది. అయితే.. దీనిపై అప్పట్లోనే చంద్ర‌బాబు విశ్లేషించారు. కూట‌మి పార్టీలు కాలికి బ‌లపం క‌ట్టుకుని తిరిగాయ‌ని.. అయినా కూడా ఎందుకు ఇలా జ‌రిగింద‌ని ఆయ‌న మీడియా ముందే చెప్పుకొచ్చా రు. దీనిపై అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు కూడా చేశారు.

ఈ స‌మ‌యంలో ఆయ‌న ఆ 11 స్థానాల్లోని టీడీపీ ఇంచార్జ్‌ల‌కు కూడా వార్నింగులు ఇచ్చారు. “బీటెక్ ర‌వి సునాయాసంగా గెలిచే ఛాన్స్ ఉంది. అయినా.. ఎక్క‌డో ఏదో పొర‌పాటు జ‌రిగింది. దీనికి స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డాన్ని గుర్తించాం“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పుంగ‌నూరులో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి గెలిచిన విష‌యంపై అయితే.. చంద్ర‌బాబు మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అస‌లు గెలిచితీరాల్సిన స్థానం ఇదేన‌ని, కానీ, అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తోనే దీనిని చేజార్చుకున్నామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

నిజానికి అంగ‌ళ్ల‌లో చంద్ర‌బాబుపై దాడులు జ‌రిగిన‌ప్పుడు.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య రాళ్ల యుద్ధం సాగిన‌ప్పుడు సానుభూతి పెరుగుతుంద‌ని ఆశించారు. అలానే పెరిగిందికూడా. కానీ, పుంగ‌నూరులో `రామ‌చంద్ర` పేరుతో ఎక్కువ మంది పోటీలో నిలిచారు. దీనికితోడు స‌మ‌న్వ‌యం కూడా స‌న్న‌గిల్లింద‌ని తేల్చారు. అదేవిధంగా క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌లోనూ టీడీపీ నేత‌లు వైసీపీకి స‌హ‌క‌రించార‌న్న వాద‌నపై స్పందించారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డి టీడీపీ ఇంచార్జ్‌.. బొజ్జా రోశ‌న్న ను ప‌క్క‌న పెట్టారు.

ఇక‌, ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాలైన అర‌కు, పాడేరులోనూ ప‌రాజ‌యం పాల‌వ‌డానికి త‌మ్ముళ్లు స‌హ‌క‌రించ‌లేద‌న్న వాద‌న‌ను కూడా చంద్ర‌బాబు అంగీక‌రించారు. అలానే ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ద‌ర్శిలో ప్ర‌స్తుతం మంత్రి గొట్టిపాటి ర‌వి కుటుంబీకురాలు డాక్ట‌ర్ ల‌క్ష్మి చివ‌రి వ‌ర‌కు పోరాడారు. లీడ్‌లోనే కొన‌సాగారు. కానీ, చివ‌రి రౌండ్ల‌లో వైసీపీ అభ్య‌ర్థి.. బూచేప‌ల్లి శివ ప్రసాద్ రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నా రు. ఇక్క‌డ కూడా త‌మ్ముళ్ల‌దే త‌ప్ప‌ని అప్ప‌ట్లోనే చంద్ర‌బాబు తీర్మానించారు. స‌మ‌న్వ‌య లేమి కార‌ణంగా వైసీపీ 11 సీట్లు ద‌క్కించుకుంద‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు చేశారు.

Kumar

Recent Posts

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

5 minutes ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

3 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

3 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

3 hours ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

4 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

4 hours ago