Political News

జగన్ స్కూల్లో ఏ మంత్రికి ఎన్ని మార్కులు?

స్కూళ్లలో పిల్లలకు టీచర్లు పరీక్షలు పెట్టడం…మార్కులు వేయడం….ఆ సంవత్సరం ప్రోగ్రెస్ కార్డుల్లో పర్ ఫార్మెన్స్ ని బట్టి తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయడం…లేదంటే డిమోట్ చేయడం జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు….ఫస్ట్ ర్యాంకులు సాధించి బెస్ట్ పిల్లలు పరేషాన్ అవుతుంటారు. ఇదే తరహాలో ఇకపై ఏపీలోని వైసీపీ పొలిటికల్ స్కూల్లో మంత్రులకు మార్కులు వేయబోతున్నారట సీఎం జగన్.

టీచర్ అవతారమెత్తబోతోన్న జగన్ తన మంత్రి వర్గ సభ్యులను ‘టెస్ట్’చేసి మార్కులు ఇచ్చేందుకు రెడీ అయ్యారట. అంతేకాదు…ఆ మార్కుల ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కేటాయించి…వారికి ప్రమోషన్…డిమోషన్ డిసైడ్ చేయబోతున్నారట. సరైన ర్యాంకులు రాని మంత్రులకు ఉద్వాసన తప్పదని జగన్ సంకేతాలిచ్చారట. తాజాగా జరిగిన మంత్రి మండలి సమావేశంలో తక్కువ ర్యాంకులు తెచ్చుకున్న ఒకరిద్దరు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారట.

వాస్తవానికి రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని జగన్ గతంలో చెప్పారు. దీంతో, అప్పటిదాకా తమకు ఢోకా లేదని మంత్రులంతా అనుకున్నారు. అయితే, ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు, కొందరు మంత్రుల వ్యాఖ్యలు, పనితీరు, తనపైనా, ప్రభుత్వంపైనా రాస్తున్న కథనాలకు కొందరు మంత్రుల లీకులే కారణమన్న ఆరోపణలు నేపథ్యంలో జగన్ ఈ మార్కులు, ర్యాంకుల పద్ధతి ప్రవేశపెట్టారట.

మంత్రివర్గంలో ఇద్దరు ముగ్గరు మినహా మిగతా వారి పనితీరుపై జగన్ సంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. హోమంత్రి, సమాచార శాఖతో పాటు మరికొందరి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారట. ప్రభుత్వానికి డ్యామేజి కలిగేలా కొందరు మంత్రులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగిందట.

ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రిపై, రాయలసీమకు చెందిన మరో మంత్రిపై జగన్ కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొత్త మంత్రులిద్దరినీ మినహాయించి మిగతా మంత్రుల పనితీరుపై క్షేత్రస్ధాయి సమీక్షలు జరిపేందుకు జగన్ రెడీ అయ్యారట. మిగిలి ఉన్న ఏడాదికాలంలో మంత్రుల పనితీరు మెరుగుపరుచుకునేందుకు జగన్ ఈ అవకాశం ఇచ్చారట.

తన ప్రభుత్వానికి మంత్రుల పనితీరే గీటురాయి అన్న భావనలో ఉన్న జగన్…ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక, ఏడాది తర్వాత ఖాళీ అయ్యే బెర్తుల కోసం కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కర్చీఫ్ లు వేసి రిజర్వ్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ క్రమంలోనే ఇటు సీఎం జగన్ ను, అటు సీఎంవో అధికారులను ఇంప్రెస్ చేసే పనిలో వారంతా బిజీబిజీగా ఉన్నారట.

This post was last modified on October 6, 2020 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

2 hours ago

బల పరీక్షలో నెగ్గిన విజయ్… కానీ…

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…

2 hours ago

‘అందుకే ఇండస్ట్రీని వదిలేశా’

పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…

3 hours ago

తప్పు త్వరగా తెలుసుకున్న సీఎం విజయ్

టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…

3 hours ago

ఇంట్లో నేపాలీలు ఉంటే జాగ్రత్త

రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…

4 hours ago

IBOMMA 2.0: అరెస్ట్ అయినా ఆగలేదేంటి?

చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…

5 hours ago