స్కూళ్లలో పిల్లలకు టీచర్లు పరీక్షలు పెట్టడం…మార్కులు వేయడం….ఆ సంవత్సరం ప్రోగ్రెస్ కార్డుల్లో పర్ ఫార్మెన్స్ ని బట్టి తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయడం…లేదంటే డిమోట్ చేయడం జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు….ఫస్ట్ ర్యాంకులు సాధించి బెస్ట్ పిల్లలు పరేషాన్ అవుతుంటారు. ఇదే తరహాలో ఇకపై ఏపీలోని వైసీపీ పొలిటికల్ స్కూల్లో మంత్రులకు మార్కులు వేయబోతున్నారట సీఎం జగన్.
టీచర్ అవతారమెత్తబోతోన్న జగన్ తన మంత్రి వర్గ సభ్యులను ‘టెస్ట్’చేసి మార్కులు ఇచ్చేందుకు రెడీ అయ్యారట. అంతేకాదు…ఆ మార్కుల ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కేటాయించి…వారికి ప్రమోషన్…డిమోషన్ డిసైడ్ చేయబోతున్నారట. సరైన ర్యాంకులు రాని మంత్రులకు ఉద్వాసన తప్పదని జగన్ సంకేతాలిచ్చారట. తాజాగా జరిగిన మంత్రి మండలి సమావేశంలో తక్కువ ర్యాంకులు తెచ్చుకున్న ఒకరిద్దరు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారట.
వాస్తవానికి రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని జగన్ గతంలో చెప్పారు. దీంతో, అప్పటిదాకా తమకు ఢోకా లేదని మంత్రులంతా అనుకున్నారు. అయితే, ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు, కొందరు మంత్రుల వ్యాఖ్యలు, పనితీరు, తనపైనా, ప్రభుత్వంపైనా రాస్తున్న కథనాలకు కొందరు మంత్రుల లీకులే కారణమన్న ఆరోపణలు నేపథ్యంలో జగన్ ఈ మార్కులు, ర్యాంకుల పద్ధతి ప్రవేశపెట్టారట.
మంత్రివర్గంలో ఇద్దరు ముగ్గరు మినహా మిగతా వారి పనితీరుపై జగన్ సంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. హోమంత్రి, సమాచార శాఖతో పాటు మరికొందరి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారట. ప్రభుత్వానికి డ్యామేజి కలిగేలా కొందరు మంత్రులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగిందట.
ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రిపై, రాయలసీమకు చెందిన మరో మంత్రిపై జగన్ కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొత్త మంత్రులిద్దరినీ మినహాయించి మిగతా మంత్రుల పనితీరుపై క్షేత్రస్ధాయి సమీక్షలు జరిపేందుకు జగన్ రెడీ అయ్యారట. మిగిలి ఉన్న ఏడాదికాలంలో మంత్రుల పనితీరు మెరుగుపరుచుకునేందుకు జగన్ ఈ అవకాశం ఇచ్చారట.
తన ప్రభుత్వానికి మంత్రుల పనితీరే గీటురాయి అన్న భావనలో ఉన్న జగన్…ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక, ఏడాది తర్వాత ఖాళీ అయ్యే బెర్తుల కోసం కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కర్చీఫ్ లు వేసి రిజర్వ్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ క్రమంలోనే ఇటు సీఎం జగన్ ను, అటు సీఎంవో అధికారులను ఇంప్రెస్ చేసే పనిలో వారంతా బిజీబిజీగా ఉన్నారట.
This post was last modified on October 6, 2020 12:29 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…