Political News

రేవంత్ రెడ్డి ప్రచారం పని చేయలేదు

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఇస్తూ, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం దేశవ్యాప్తంగా ఎన్డీఏ శక్తిని చాటిచెప్పిందని వ్యాఖ్యానించారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మహారాష్ట్రలో రాహుల్ గాంధీ విద్వేష ప్రచారం చేసినా, ప్రజలు వారి అబద్ధాలను నమ్మలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం, మహారాష్ట్రకు పంపిన నిధులు కూడా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీ భారీ మెజారిటీ సాధించిందని, గత ఎన్నికల సమయంలో ఉద్ధవ్ ఠాక్రే చేసిన రాజకీయ కుట్రకు ప్రజలు సమాధానం చెప్పారని అభిప్రాయపడ్డారు.

ఇక ఫలితాలు రాకముందే కాంగ్రెస్ నాయకులు గెలుపు సంబరాలకు సిద్ధమయ్యారని, చివరికి వారంతా ఆందోళనలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి కాంగ్రెస్ చేసిన ఆరోపణలు తప్పుడు ప్రచారమేనని, ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మబట్టలేదని కిషన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకుల విష ప్రచారం ప్రజలను ప్రభావితం చేయలేకపోయిందని తెలిపారు.

తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దింపేందుకు ఇచ్చిన గ్యారంటీలు ప్రజలను మోసం చేశాయని, ఆ దుష్ప్రభావం మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌కు ఎదురయ్యిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో బీజేపీ గెలుపు దేశవ్యాప్తంగా పార్టీ ప్రాధాన్యతను మరింత పెంచుతుందని తెలిపారు. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ లాంటి నాయకుల రాజకీయ కుతంత్రాలను ప్రజలు భరించలేక, తగిన శాస్తి చేశారని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే తన రాజకీయ లాభాల కోసం ఎన్డీఏతో చేసిన వెన్నుపోటు వెనుక దాగి ఉన్న కుట్రను మహారాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని కరెక్ట్ తీర్పు ఇచ్చారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Satya

Recent Posts

సమంత ‘గోల్డు’ గిట్టుబాటు అవుతోంది

నిన్న విడుదలైన మా ఇంటి బంగారంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెయిన్ సెంటర్స్ థియేటర్లు దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు…

3 minutes ago

శ్రీముఖి భలే ఛాన్స్ పట్టేసింది

నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…

1 hour ago

పబ్లిసిటీ ఇంకాస్త పెరగాలి బాల

నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అతి తక్కువ నోటీస్ తెచ్చుకున్నది మలయాళం డబ్బింగ్ బాలన్ ది బాయ్. అన్నపూర్ణ సంస్థ…

3 hours ago

వైసీపీ స్ట్రాట‌జీ: కాపులతో క‌లివిడా.. విడివిడా?

కాపుల విష‌యంలో ఏం చేయాల‌న్న అంశంపై వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోందా? వారితో క‌లిసి ముందుకు సాగాలా? లేక‌.. వారిని…

4 hours ago

అమెరికా-ఇరాన్‌… మిగిల్చిందేంటి?

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 28. ప్ర‌పంచం క‌ళ్లు తెరుస్తున్న స‌మ‌యం. ఊహాతీతంగా.. అన్ని మీడియాల్లోనూ.. అ ప్పటికే.. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్…

9 hours ago

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

13 hours ago