మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఇస్తూ, కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఇవాళ హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం దేశవ్యాప్తంగా ఎన్డీఏ శక్తిని చాటిచెప్పిందని వ్యాఖ్యానించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మహారాష్ట్రలో రాహుల్ గాంధీ విద్వేష ప్రచారం చేసినా, ప్రజలు వారి అబద్ధాలను నమ్మలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం, మహారాష్ట్రకు పంపిన నిధులు కూడా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్కు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీ భారీ మెజారిటీ సాధించిందని, గత ఎన్నికల సమయంలో ఉద్ధవ్ ఠాక్రే చేసిన రాజకీయ కుట్రకు ప్రజలు సమాధానం చెప్పారని అభిప్రాయపడ్డారు.
ఇక ఫలితాలు రాకముందే కాంగ్రెస్ నాయకులు గెలుపు సంబరాలకు సిద్ధమయ్యారని, చివరికి వారంతా ఆందోళనలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి కాంగ్రెస్ చేసిన ఆరోపణలు తప్పుడు ప్రచారమేనని, ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మబట్టలేదని కిషన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకుల విష ప్రచారం ప్రజలను ప్రభావితం చేయలేకపోయిందని తెలిపారు.
తెలంగాణలో కేసీఆర్ను గద్దె దింపేందుకు ఇచ్చిన గ్యారంటీలు ప్రజలను మోసం చేశాయని, ఆ దుష్ప్రభావం మహారాష్ట్రలోనూ కాంగ్రెస్కు ఎదురయ్యిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో బీజేపీ గెలుపు దేశవ్యాప్తంగా పార్టీ ప్రాధాన్యతను మరింత పెంచుతుందని తెలిపారు. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ లాంటి నాయకుల రాజకీయ కుతంత్రాలను ప్రజలు భరించలేక, తగిన శాస్తి చేశారని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే తన రాజకీయ లాభాల కోసం ఎన్డీఏతో చేసిన వెన్నుపోటు వెనుక దాగి ఉన్న కుట్రను మహారాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని కరెక్ట్ తీర్పు ఇచ్చారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్న రీతిలో జరుగుతున్న మాటల యుద్ధం తారస్థాయికి…
ఏదో చిన్న ఉద్యోగమో.. పనో చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చే మనకే వంట గదిలోకి వెళ్లేందుకు సమయం ఉండదు. సమయం ఉన్నా..…
ఈ నెలలో రాబోతున్న చిత్రాల్లో ‘చెన్నై లవ్ స్టోరీ’ చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ‘బేబీ’తో ఎవ్వరూ ఊహించని విజయాన్నందుకున్న సాయి…
సెలబ్రెటీల నంబర్ దొరికితే అభిమానులు ఫోన్ చేసి ఎలా విసిగించేస్తారో అంచనా వేయొచ్చు. గతంలో నందమూరి బాలకృష్ణకు ఒక ఫ్యాన్…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉంటున్నారు. 2024లో కూడా మరోసారి మీరు తప్పు చేసి ఉంటే..…
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. తెలంగాణ హైకోర్టు ఈ రోజు భగీరథ్ కు…