Political News

రేవంత్ రెడ్డి ప్రచారం పని చేయలేదు

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఇస్తూ, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం దేశవ్యాప్తంగా ఎన్డీఏ శక్తిని చాటిచెప్పిందని వ్యాఖ్యానించారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మహారాష్ట్రలో రాహుల్ గాంధీ విద్వేష ప్రచారం చేసినా, ప్రజలు వారి అబద్ధాలను నమ్మలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం, మహారాష్ట్రకు పంపిన నిధులు కూడా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీ భారీ మెజారిటీ సాధించిందని, గత ఎన్నికల సమయంలో ఉద్ధవ్ ఠాక్రే చేసిన రాజకీయ కుట్రకు ప్రజలు సమాధానం చెప్పారని అభిప్రాయపడ్డారు.

ఇక ఫలితాలు రాకముందే కాంగ్రెస్ నాయకులు గెలుపు సంబరాలకు సిద్ధమయ్యారని, చివరికి వారంతా ఆందోళనలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి కాంగ్రెస్ చేసిన ఆరోపణలు తప్పుడు ప్రచారమేనని, ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మబట్టలేదని కిషన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకుల విష ప్రచారం ప్రజలను ప్రభావితం చేయలేకపోయిందని తెలిపారు.

తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దింపేందుకు ఇచ్చిన గ్యారంటీలు ప్రజలను మోసం చేశాయని, ఆ దుష్ప్రభావం మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌కు ఎదురయ్యిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో బీజేపీ గెలుపు దేశవ్యాప్తంగా పార్టీ ప్రాధాన్యతను మరింత పెంచుతుందని తెలిపారు. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ లాంటి నాయకుల రాజకీయ కుతంత్రాలను ప్రజలు భరించలేక, తగిన శాస్తి చేశారని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే తన రాజకీయ లాభాల కోసం ఎన్డీఏతో చేసిన వెన్నుపోటు వెనుక దాగి ఉన్న కుట్రను మహారాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని కరెక్ట్ తీర్పు ఇచ్చారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

This post was last modified on November 24, 2024 7:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…

1 hour ago

కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…

1 hour ago

కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికింది

ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…

2 hours ago

తారక్ & రజని రెండుసార్లు తలపడతారా

ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…

2 hours ago

రెండు రాష్ట్రాల‌కూ ఊర‌ట‌.. విభ‌జ‌న చ‌ట్టంపై కేంద్రం క‌స‌రత్తు!

2014లో ఉమ్మ‌డి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆ త‌ర్వాత‌.. కేంద్రంలో ప్ర‌భుత్వం మార‌డంతో..…

2 hours ago

ఫ్యాన్స్ మనోభావాలతో అప్డేట్స్ ఆట

స్టార్ హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారు. నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాలకు సంబంధించిన అప్డేట్ అంటే చాలు వాళ్లకు  ప్రాణం…

2 hours ago