మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)ల మహా వికాస్ అఘాడీ ఘోర పరాజయం సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, ఛాపర్లు కాంగ్రెస్ పార్టీని ఘోర పరాజయం నుంచి కాపాడలేకపోయాయని కేటీఆర్ ఎద్ధేవా చేశారు. ఇకనైనా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలనపై ఫోకస్ చేయాలని, ప్రజలకిచ్చిన 6 హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షంగా ఎదగడంలో మాత్రం విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ సమర్థత వల్ల గెలవడం లేదని, కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ మనుగడ సాగిస్తోందని చురకలంటించారు. ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత ఇప్పటికైనా గుర్తించాలని, దేశ భవిష్యతు ప్రాంతీయ పార్టీలేనని కేటీఆర్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ లు ప్రాంతీయ పార్టీల కష్టాన్ని నిస్సిగ్గుగా సొమ్ము చేసుకుంటున్నాయని కేటీఆర్ దుయ్యబట్టారు.
కాగా, లగచర్ల ఫార్మా బాధిత రైతుల అంశంపై కేటీఆర్ మాట్లాడారు. రైతులను జైల్లో పెట్టిన రేవంత్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెబుతామని అన్నారు. జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో చర్లపల్లి జైలులో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. జైల్లో నరేందర్ రెడ్డి ధైర్యంగా ఉన్నారని, తన కోసం కొట్లాడొద్దని, అన్యాయంగా జైలుపాలైన కొడంగల్ రైతుల పక్షాన కొట్లాడాలని ఆయన కోరారని కేటీఆర్ అన్నారు. రాజకీయ కక్షతో పెట్టిన అక్రమ కేసులో నరేందర్ రెడ్డి, రైతులు జైలు పాలయ్యారని విమర్శించారు.
సొంత నియోజకవర్గం కొడంగల్ కు రేవంత్ రెడ్డి రారాజు కాదని, ఆయనలాంటి నియంతలు ఎందరో పోయారని గుర్తు చేశారు. కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లి దాకా శిశుపాలుడిలాగా రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులను ప్రజలు లెక్క గడుతున్నారని, ఆయన పాపం పండే రోజు దగ్గరలో ఉందని అన్నారు.
ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు…
అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…
నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆసక్తిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి…
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో నెంబర్ వన్ స్థానం ఎంజాయ్ చేసిన హీరోయిన్ పూజా హగ్దేకు సక్సెస్…
ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…