ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ హైదరాబాద్ లోని ఎన్బీకే బిల్డింగ్ నుంచి జరిగిందని గతంలో షర్మిల ఆరోపించిన వీడియో ఇపుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కామెంట్లపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తొలిసారి స్పందించారు. వైఎస్ షర్మిలపై తప్పుడు ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసని బాలయ్య అన్నారు.
ఈ తప్పుడు ప్రచారాన్ని వారే పట్టించుకోనప్పుడు నేనెందుకు పట్టించుకోవాలని ప్రశ్నించారు. ఇక, వైసీపీ వాళ్లు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారని, ఈ రోజు కూడా వాళ్లు అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందని సెటైర్లు వేశారు. ఈ రోజు బీఏసీ ఛైర్మన్ ఎన్నిక కోసం వైసీపీ సభ్యులు వస్తారని, వాళ్ల స్వార్థం కోసం వస్తారని, అయినా వృథా ప్రయాస అని చెప్పారు. బాలయ్య వెంట ఆయన చిన్నల్లుడు, టీడీపీ ఎంపీ భరత్ ఉన్నారు.
కాగా, బాలకృష్ణకు చెందిన ఎన్డీకే బిల్డింగ్ నుంచి ట్రోలింగ్ జరిగిందని, దాని వెనుక బాలకృష్ణ ఉన్నారని ప్రచారం జరుగుతోందని షర్మిల గతంలో చెప్పిన వీడియోను జగన్ రెండు రోజుల క్రితం మీడియా ముందు ప్రస్తావించారు. ఆ వీడియోను జగన్ వాడి సానుభూతి పొందాలని చూస్తున్నారని, ఆ విషయం చెప్పిన తర్వాత ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్ ఏం చేశారని షర్మిల నిలదీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు ఆ వ్యాఖ్యలపై బాలయ్య బాబు స్పందించారు.
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…