ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ హైదరాబాద్ లోని ఎన్బీకే బిల్డింగ్ నుంచి జరిగిందని గతంలో షర్మిల ఆరోపించిన వీడియో ఇపుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కామెంట్లపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తొలిసారి స్పందించారు. వైఎస్ షర్మిలపై తప్పుడు ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసని బాలయ్య అన్నారు.
ఈ తప్పుడు ప్రచారాన్ని వారే పట్టించుకోనప్పుడు నేనెందుకు పట్టించుకోవాలని ప్రశ్నించారు. ఇక, వైసీపీ వాళ్లు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారని, ఈ రోజు కూడా వాళ్లు అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందని సెటైర్లు వేశారు. ఈ రోజు బీఏసీ ఛైర్మన్ ఎన్నిక కోసం వైసీపీ సభ్యులు వస్తారని, వాళ్ల స్వార్థం కోసం వస్తారని, అయినా వృథా ప్రయాస అని చెప్పారు. బాలయ్య వెంట ఆయన చిన్నల్లుడు, టీడీపీ ఎంపీ భరత్ ఉన్నారు.
కాగా, బాలకృష్ణకు చెందిన ఎన్డీకే బిల్డింగ్ నుంచి ట్రోలింగ్ జరిగిందని, దాని వెనుక బాలకృష్ణ ఉన్నారని ప్రచారం జరుగుతోందని షర్మిల గతంలో చెప్పిన వీడియోను జగన్ రెండు రోజుల క్రితం మీడియా ముందు ప్రస్తావించారు. ఆ వీడియోను జగన్ వాడి సానుభూతి పొందాలని చూస్తున్నారని, ఆ విషయం చెప్పిన తర్వాత ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్ ఏం చేశారని షర్మిల నిలదీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు ఆ వ్యాఖ్యలపై బాలయ్య బాబు స్పందించారు.
This post was last modified on November 23, 2024 9:57 am
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…