ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీపై అమెరికాలో నమోదైన కేసుకు ఏపీతో లింకులున్నాయన్న ప్రచారం నేపథ్యంలో గత ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడడం తన విధి అని షర్మిల అన్నారు. అయితే, వాస్తవానికి తాను జగన్ గారి గురించి ఇలా మాట్లాడకుండా ఉంటే, ఆయన అవినీతిని ఎత్తి చూపకుంటే తన ఆస్తి తనకు ఇస్తానని జగన్ అంటున్నారని విమర్శించారు.
రాజకీయంగా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడకుంటే తన ఆస్తి తనకు ఇస్తానని గతంలో జగన్ అన్నారని షర్మిల గుర్తు చేశారు. ఇలా మాట్లాడకపోతేనే తనకు లాభం అని, కానీ తాను కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిని కాబట్టి ఇలాంటివి మాట్లాడడం తన విధి, బాధ్యత అని షర్మిల అన్నారు. కాబట్టే పనిగట్టుకొని మాట్లాడాల్సి వస్తోంది అని చెప్పారు. గత ప్రభుత్వంలో అవినీతి బయటపడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున తాను మాట్లాడుతున్నానని, ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి తప్పులను కూడా తాను ఎత్తి చూపుతూనే ఉన్నానని అన్నారు.
ఇక, అదానీ కంపెనీలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, ఆయన కొలీగ్ గా తాను ఈ విజ్నప్తి చేస్తున్నానని షర్మిల అన్నారు. ఏపీని బ్లాంక్ చెక్ లా అదానీకి జగన్ రాసిచ్చారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. లంచాల కోసం ఏపీని సొంత జాగీరులా జగన్ వాడుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ ఒప్పందాల పేరుతో అదానీ నుంచి జగన్ 1750 కోట్లు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.
అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు…
పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…
నాలుగు నెలల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు నిండుగా కళకళలాడుతూ కనిపించాయి. కారణం పెద్ది. ఒక పెద్ద స్టార్ హీరో…