మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం జగన్ తో అదానీకి లింకులు అంశంపై మాట్లాడిన తర్వాత జగన్ గురించి ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు షర్మిల సెటైరికల్ గా రియాక్ట్ అయ్యారు. తాను ఏదో ఒక ప్రజా సమస్యపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానని, దానికోసం చాలా స్టడీ చేసి వస్తానని, అయితే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత టాపిక్ కు సంబంధం లేని ఏదో ఒక ప్రశ్న తనను అడుగుతారని షర్మిల అనడంతో ప్రెస్ మీట్ లో నవ్వులు పూశాయి.
సబ్జెక్ట్ వదిలేసి తాను జగన్ గారి గురించి చేసిన కామెంట్ల గురించి మాత్రమే హైలైట్ చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయం అంటూ షర్మిల అన్న మాటలు విని మీడియా ప్రతినిధులంతా నవ్వారు. సాక్షి టీవీ మమ్మల్ని ఎలాగూ కవర్ చేయదు…మిగతా ఛానెళ్లు నేను జగన్ గురించి మాట్లాడిన మాటలు మాత్రమే కవర్ చేస్తే మేము ఎట్లా సర్వైవ్ అవ్వాలి అంటూ షర్మిల కాస్త అన్న మాటలు మీడియా ప్రతినిధులకు నవ్వు తెప్పించాయి. జగన్ మోహన్ రెడ్డిగారికి అదానీ లంచం ఇస్తే నాకేం రాదు..అంటే నాకు రావాలి అని అనడం లేదు…నాకు సంబంధం లేదు అని చెబుతున్నా…అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యల ప్రెస్ మీట్ లో నవ్వులు పూయించాయి.
అయితే, మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తానని, అదే సమయంలో ప్రజా సమస్యలను హైలైట్ చేయాల్సిన బాధ్యత మీడియాకు ఉందని షర్మిల కాస్త సీరియస్ గా కామెంట్లు చేశారు. ఇట్లాంటివి కూడా కాస్త కవర్ చేయాలి కదా..అని షర్మిల అన్నారు. ప్రజా సమస్యలపై కవర్ చేయండి దయచేసి…కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ కాదు….కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ…అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టింది… దేశాన్ని రక్షించగలిగిన పార్టీ కాంగ్రెస్ అని షర్మిల అన్నారు. మీడియాపై షర్మిల సెటైర్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…