మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం జగన్ తో అదానీకి లింకులు అంశంపై మాట్లాడిన తర్వాత జగన్ గురించి ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు షర్మిల సెటైరికల్ గా రియాక్ట్ అయ్యారు. తాను ఏదో ఒక ప్రజా సమస్యపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానని, దానికోసం చాలా స్టడీ చేసి వస్తానని, అయితే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత టాపిక్ కు సంబంధం లేని ఏదో ఒక ప్రశ్న తనను అడుగుతారని షర్మిల అనడంతో ప్రెస్ మీట్ లో నవ్వులు పూశాయి.
సబ్జెక్ట్ వదిలేసి తాను జగన్ గారి గురించి చేసిన కామెంట్ల గురించి మాత్రమే హైలైట్ చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయం అంటూ షర్మిల అన్న మాటలు విని మీడియా ప్రతినిధులంతా నవ్వారు. సాక్షి టీవీ మమ్మల్ని ఎలాగూ కవర్ చేయదు…మిగతా ఛానెళ్లు నేను జగన్ గురించి మాట్లాడిన మాటలు మాత్రమే కవర్ చేస్తే మేము ఎట్లా సర్వైవ్ అవ్వాలి అంటూ షర్మిల కాస్త అన్న మాటలు మీడియా ప్రతినిధులకు నవ్వు తెప్పించాయి. జగన్ మోహన్ రెడ్డిగారికి అదానీ లంచం ఇస్తే నాకేం రాదు..అంటే నాకు రావాలి అని అనడం లేదు…నాకు సంబంధం లేదు అని చెబుతున్నా…అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యల ప్రెస్ మీట్ లో నవ్వులు పూయించాయి.
అయితే, మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తానని, అదే సమయంలో ప్రజా సమస్యలను హైలైట్ చేయాల్సిన బాధ్యత మీడియాకు ఉందని షర్మిల కాస్త సీరియస్ గా కామెంట్లు చేశారు. ఇట్లాంటివి కూడా కాస్త కవర్ చేయాలి కదా..అని షర్మిల అన్నారు. ప్రజా సమస్యలపై కవర్ చేయండి దయచేసి…కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ కాదు….కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ…అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టింది… దేశాన్ని రక్షించగలిగిన పార్టీ కాంగ్రెస్ అని షర్మిల అన్నారు. మీడియాపై షర్మిల సెటైర్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…