Political News

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయని, వాటిని డెవలప్ చేస్తే రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెడుతున్నామని దుర్గేష్ వెల్లడించారు. నూతన టూరిజం పాలసీతో పర్యాటక రంగంలో ఏపీని దేశంలో అగ్రగామిగా నిలబెడతామని చెప్పారు.

పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించారని, దీంతో, ఆ రంగాన్ని మరింత డెవలప్ చేయొచ్చని చెప్పారు. పర్యాటక రంగానికి ఇండస్ట్రీ హోదా కల్పించిన రాష్ట్రంగా ఏపీ పేరు చరిత్రలో నిలిచిపోతుందని దుర్గేష్ తెలిపారు. ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా అందమైన ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఒక పర్యాటక ప్రాంతంలో పర్యాటకుడు 5 రోజులు ఉండేలా టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తామన్నారు. టూరిజం హోటళ్లలో ఉన్న రూమ్ ల సంఖ్యను 3500 నుండి 10,000 కు పెంచబోతున్నామని, పీపీపీ విధానంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురానున్నామని చెప్పారు.

విశాఖపట్నం, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో 7 యాంకర్ హబ్ లు ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. అమరావతి – నాగార్జున కొండ, విశాఖపట్నం- తొట్లకొండ ప్రాంతాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శైవక్షేత్రాలు తదితర ఆలయాలను కలిపేలా 10 సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కోస్టల్ టూరిజం సర్క్యూట్ లో భాగంగా వైజాగ్, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో 5 బీచ్ సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రివర్ టూరిజం సర్క్యూట్, 2 క్రూయిజ్ టూరిజం సర్క్యూట్ లను డెవలప్ చేస్తామన్నారు. శ్రీకాకుళం- విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి- గుంటూరు, కర్నూలు- నెల్లూరులలో ఎకో టూరిజం సర్క్యూట్ లు రాబోతున్నాయని చెప్పారు. ఇంకా సభ్యులు ఏమైన సలహాలు, సూచనలు ఇస్తే వాటిని పరిశీలిస్తామని అన్నారు.

దుర్గేష్ ప్రకటన విన్న తర్వాత స్పీకర్ చైర్ లో ఉన్న రఘురామ సంతోషం వ్యక్తం చేశారు. దుర్గేష్ వివరిస్తుంటే అందమైన ఆంధ్రప్రదేశ్ కళ్ల ముందు కదలాడిందని చెప్పారు. ఇంత అద్భుతంగా చెప్పాక ఎవరి సూచనలు అవసరం లేదని రఘురామ అన్నారు. దుర్గేష్ వివరిస్తుంటే అందమైన ఆంధ్రప్రదేశ్ ను ఊహించుకుంటున్నానని, అంత అద్భుతంగా ఉంది ఆయన ఆలోచన, ప్రజెంటేషన్ అని కితాబిచ్చారు. మంత్రి దుర్గేష్ ఆలోచనకు చంద్రబాబు వంటి గొప్ప నాయకుడి సపోర్ట్ ఉందని అన్నారు. అంతే కాకుండా, కేంద్ర టూరిజం శాఖా మంత్రి తనకు మంచి మిత్రుడని, ఆయన దగ్గరకు ఇద్దరం కలిసి వెళ్లి నూతన పాలసీపై చర్చిద్దామన్నారు.

This post was last modified on November 22, 2024 6:43 pm

Share

Recent Posts

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

3 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

11 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

12 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

13 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

14 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

17 hours ago