Political News

ఒట్టు..ప్రభాస్ ఎవరో తెలీదు: షర్మిల

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులకు షర్మిల గతంలో ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా అబ్యూజింగ్ పై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ప్రభాస్ వ్యవహారంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు’ అంటూ షర్మిల షాకింగ్ కామెంట్లు చేశారు.

తనపై బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఒక వీడియోను జగన్ చూపించారని, అలా జరిగిందని తెలిసి ఉంటే ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్ గాడిదలు కాశారా అని షర్మిల నిలదీశారు. ఆ విషయంపై ఎంక్వైరీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రభాస్ కు తనతో సంబంధం ఉందని వచ్చిన ప్రచారాన్ని మీ సోషల్ మీడియా ప్రచారం చేయదా? అని ప్రశ్నించారు. జగన్ ఈ ప్రాపగాండా చేయించారనే ప్రచారం కూడా జరిగిందని, తన వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.

జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారని, నాన్న పేరు సీబీఐ చార్జి షీట్ లో పెడతారని దుయ్యబట్టారు. చెల్లిపై దుష్ప్రచారం చేయిస్తారని మండిపడ్డారు. మోదీకి జగన్ దత్త పుత్రుడని, ఆయన మీద ఎంక్వైరీ వేస్తారా? అని ప్రశ్నించారు. గౌతమ్ అదానీ టీం దేశంలో కొంత మంది సీఎంలకు లంచాలు ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయని, అందులో జగన్ కూడా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయని గుర్తు చేశారు. జగన్ పేరు చెప్పకున్నా ఆగస్టు 2021 లో ముడుపులు ముట్టాయని ఆరోపణలు వస్తున్నాయని, పవర్ సప్లై విషయంలో జగన్ ను గౌతం అదానీ కలిసి డీల్ మాట్లాడుకున్నారని ఆరోపించారు.

జగన్ తన తప్పులను ఎత్తి చూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నారని షర్మిల అన్నారు. అయితే, తాను జగన్ పై విమర్శలు చేయకుండా ఉండలేనని, కాంగ్రెస్ పార్టీ చీఫ్ హోదాలో ఇటువంటి విషయాలపై తాను మాట్లాడుకుంటే ఎలా? అని అన్నారు. మోదీ.. అదానీల బంధం గట్టిదని, పదేళ్లలో అదానీ అందనంత ఎత్తుకు ఎదిగాడని ఆరోపించారు.

This post was last modified on November 22, 2024 2:29 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

36 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

2 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

2 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

3 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

5 hours ago