టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులకు షర్మిల గతంలో ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా అబ్యూజింగ్ పై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ప్రభాస్ వ్యవహారంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు’ అంటూ షర్మిల షాకింగ్ కామెంట్లు చేశారు.
తనపై బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఒక వీడియోను జగన్ చూపించారని, అలా జరిగిందని తెలిసి ఉంటే ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్ గాడిదలు కాశారా అని షర్మిల నిలదీశారు. ఆ విషయంపై ఎంక్వైరీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రభాస్ కు తనతో సంబంధం ఉందని వచ్చిన ప్రచారాన్ని మీ సోషల్ మీడియా ప్రచారం చేయదా? అని ప్రశ్నించారు. జగన్ ఈ ప్రాపగాండా చేయించారనే ప్రచారం కూడా జరిగిందని, తన వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారని, నాన్న పేరు సీబీఐ చార్జి షీట్ లో పెడతారని దుయ్యబట్టారు. చెల్లిపై దుష్ప్రచారం చేయిస్తారని మండిపడ్డారు. మోదీకి జగన్ దత్త పుత్రుడని, ఆయన మీద ఎంక్వైరీ వేస్తారా? అని ప్రశ్నించారు. గౌతమ్ అదానీ టీం దేశంలో కొంత మంది సీఎంలకు లంచాలు ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయని, అందులో జగన్ కూడా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయని గుర్తు చేశారు. జగన్ పేరు చెప్పకున్నా ఆగస్టు 2021 లో ముడుపులు ముట్టాయని ఆరోపణలు వస్తున్నాయని, పవర్ సప్లై విషయంలో జగన్ ను గౌతం అదానీ కలిసి డీల్ మాట్లాడుకున్నారని ఆరోపించారు.
జగన్ తన తప్పులను ఎత్తి చూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నారని షర్మిల అన్నారు. అయితే, తాను జగన్ పై విమర్శలు చేయకుండా ఉండలేనని, కాంగ్రెస్ పార్టీ చీఫ్ హోదాలో ఇటువంటి విషయాలపై తాను మాట్లాడుకుంటే ఎలా? అని అన్నారు. మోదీ.. అదానీల బంధం గట్టిదని, పదేళ్లలో అదానీ అందనంత ఎత్తుకు ఎదిగాడని ఆరోపించారు.
This post was last modified on November 22, 2024 2:29 pm
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…