టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులకు షర్మిల గతంలో ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా అబ్యూజింగ్ పై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ప్రభాస్ వ్యవహారంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు’ అంటూ షర్మిల షాకింగ్ కామెంట్లు చేశారు.
తనపై బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఒక వీడియోను జగన్ చూపించారని, అలా జరిగిందని తెలిసి ఉంటే ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్ గాడిదలు కాశారా అని షర్మిల నిలదీశారు. ఆ విషయంపై ఎంక్వైరీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రభాస్ కు తనతో సంబంధం ఉందని వచ్చిన ప్రచారాన్ని మీ సోషల్ మీడియా ప్రచారం చేయదా? అని ప్రశ్నించారు. జగన్ ఈ ప్రాపగాండా చేయించారనే ప్రచారం కూడా జరిగిందని, తన వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారని, నాన్న పేరు సీబీఐ చార్జి షీట్ లో పెడతారని దుయ్యబట్టారు. చెల్లిపై దుష్ప్రచారం చేయిస్తారని మండిపడ్డారు. మోదీకి జగన్ దత్త పుత్రుడని, ఆయన మీద ఎంక్వైరీ వేస్తారా? అని ప్రశ్నించారు. గౌతమ్ అదానీ టీం దేశంలో కొంత మంది సీఎంలకు లంచాలు ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయని, అందులో జగన్ కూడా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయని గుర్తు చేశారు. జగన్ పేరు చెప్పకున్నా ఆగస్టు 2021 లో ముడుపులు ముట్టాయని ఆరోపణలు వస్తున్నాయని, పవర్ సప్లై విషయంలో జగన్ ను గౌతం అదానీ కలిసి డీల్ మాట్లాడుకున్నారని ఆరోపించారు.
జగన్ తన తప్పులను ఎత్తి చూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నారని షర్మిల అన్నారు. అయితే, తాను జగన్ పై విమర్శలు చేయకుండా ఉండలేనని, కాంగ్రెస్ పార్టీ చీఫ్ హోదాలో ఇటువంటి విషయాలపై తాను మాట్లాడుకుంటే ఎలా? అని అన్నారు. మోదీ.. అదానీల బంధం గట్టిదని, పదేళ్లలో అదానీ అందనంత ఎత్తుకు ఎదిగాడని ఆరోపించారు.
This post was last modified on November 22, 2024 2:29 pm
భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి యుద్ధంగా మారితే, ఐక్యరాజ్య సమితి…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది.…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో హీరో ఇమేజ్, మార్కెట్, క్యాస్టింగ్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది సింగిల్ కే.…
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…