తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్న పార్టీ మార్పుల కేసులో హైకోర్టు సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్పై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసి, కొత్త మార్గదర్శకాలను నిర్దేశించింది. హైకోర్టు తీర్పులో స్పీకర్కు నిర్ణయం తీసుకునే విషయంలో కాలపరిమితి విధించలేమని స్పష్టం చేసింది.
అయితే, 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ మార్పులపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ అంశం తీర్పుతో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు తాత్కాలిక ఊరట లభించినట్లే. అంతేకాదు, తగిన సమయంలోనే స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని కోర్టు హితవు పలికింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ చర్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కెపి వివేకానంద్లు అనర్హత పిటీషన్లను దాఖలు చేశారు.
వీటితోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా దానం నాగేందర్పై పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై హైకోర్టు ముందుగా సింగిల్ బెంచ్ విచారణ జరిపి, నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. అయితే అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేయడంతో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ తీర్పును పరిశీలించింది. తుది విచారణ అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసి, స్పీకర్కు పూర్వకాలు విధించాలని నిర్దేశించింది.
అలాగే, ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ బాధ్యతాయుత నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటి హైకోర్టు తీర్పు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. తుది నిర్ణయం స్పీకర్ చేతుల్లో ఉన్నందున, ఈ అంశం రాబోయే రోజుల్లో మరింత ఉత్కంఠకు గురి చేసే అవకాశం ఉంది. మరి నాయకుల తీరు ఏ విధంగా ఉంటుందో చూడాలి.
This post was last modified on November 22, 2024 11:58 am
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…