తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్న పార్టీ మార్పుల కేసులో హైకోర్టు సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్పై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసి, కొత్త మార్గదర్శకాలను నిర్దేశించింది. హైకోర్టు తీర్పులో స్పీకర్కు నిర్ణయం తీసుకునే విషయంలో కాలపరిమితి విధించలేమని స్పష్టం చేసింది.
అయితే, 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ మార్పులపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ అంశం తీర్పుతో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు తాత్కాలిక ఊరట లభించినట్లే. అంతేకాదు, తగిన సమయంలోనే స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని కోర్టు హితవు పలికింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ చర్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కెపి వివేకానంద్లు అనర్హత పిటీషన్లను దాఖలు చేశారు.
వీటితోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా దానం నాగేందర్పై పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై హైకోర్టు ముందుగా సింగిల్ బెంచ్ విచారణ జరిపి, నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. అయితే అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేయడంతో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ తీర్పును పరిశీలించింది. తుది విచారణ అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసి, స్పీకర్కు పూర్వకాలు విధించాలని నిర్దేశించింది.
అలాగే, ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ బాధ్యతాయుత నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటి హైకోర్టు తీర్పు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. తుది నిర్ణయం స్పీకర్ చేతుల్లో ఉన్నందున, ఈ అంశం రాబోయే రోజుల్లో మరింత ఉత్కంఠకు గురి చేసే అవకాశం ఉంది. మరి నాయకుల తీరు ఏ విధంగా ఉంటుందో చూడాలి.
This post was last modified on November 22, 2024 11:58 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…