తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్న పార్టీ మార్పుల కేసులో హైకోర్టు సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్పై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసి, కొత్త మార్గదర్శకాలను నిర్దేశించింది. హైకోర్టు తీర్పులో స్పీకర్కు నిర్ణయం తీసుకునే విషయంలో కాలపరిమితి విధించలేమని స్పష్టం చేసింది.
అయితే, 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ మార్పులపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ అంశం తీర్పుతో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు తాత్కాలిక ఊరట లభించినట్లే. అంతేకాదు, తగిన సమయంలోనే స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని కోర్టు హితవు పలికింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ చర్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కెపి వివేకానంద్లు అనర్హత పిటీషన్లను దాఖలు చేశారు.
వీటితోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా దానం నాగేందర్పై పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై హైకోర్టు ముందుగా సింగిల్ బెంచ్ విచారణ జరిపి, నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. అయితే అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేయడంతో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ తీర్పును పరిశీలించింది. తుది విచారణ అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసి, స్పీకర్కు పూర్వకాలు విధించాలని నిర్దేశించింది.
అలాగే, ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ బాధ్యతాయుత నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటి హైకోర్టు తీర్పు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. తుది నిర్ణయం స్పీకర్ చేతుల్లో ఉన్నందున, ఈ అంశం రాబోయే రోజుల్లో మరింత ఉత్కంఠకు గురి చేసే అవకాశం ఉంది. మరి నాయకుల తీరు ఏ విధంగా ఉంటుందో చూడాలి.
This post was last modified on November 22, 2024 11:58 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…