ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం చంద్రబాబు తెరమీదికి తీసుకువచ్చారు. దీని ప్రకారం.. కీలక ప్రాజెక్టుల్లో ప్రజల భాగ స్వామ్యం మరింత పెరగనుంది. నిజానికి ఇప్పటి వరకు పీపీపీ(పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్షిప్) ఉండేది. అంటే.. ప్రభుత్వం-ప్రైవేటు సంస్థలు కలిసి చేపట్టే ప్రాజెక్టులు. ఇది కొన్ని దశాబ్దాలుగా అమలు అవుతున్నదే. దీనికింద అనేక ప్రాజెక్టులు కూడా వచ్చాయి.
అయితే.. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నది పీపీపీపీ (పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్షిప్ విత్ పీపుల్) అంటే.. ఇక, నుంచి ప్రజలను కూడా ఆయా ప్రాజక్టుల్లో భాగస్వాములను చేస్తారు. గ్రామం నుంచి నగరంవరకు కూడా.. పెద్ద ఎత్తు చేపట్టే ప్రాజెక్టుల్లో ప్రజల భాగస్వామ్యం పెంచనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నిర్ణయం ప్రకారం.. రెండు కీలక ప్రాజెక్టుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీపీ ప్రాజెక్టులు చేపట్టనున్నారు.
వీటిలో నీటి పారుదల, రహదారులు ఉన్నాయి. ఇవి రెండు కూడా గ్రామీణ ప్రాంతాలకు కీలకంగా మారా యి. దీని ప్రకారం రోడ్లను ప్రైవేటు కంపెనీలతో వేయిస్తారు. ప్రజల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తారు. ఇప్పటి వరకూ జాతీయ రహదారుల్లో మాత్రమే ఈ విధానం ఉంది. ఇప్పుడు రాష్ట్ర రహదారులకూ తీసుకు వస్తారు. దీనిని ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే సక్సెస్ అవుతుంది. అయితే.. సర్కారు ప్రజలు అర్థం చేసుకుంటారనే భావిస్తోంది.
ప్రస్తుతం గుంతలు పడి.. ప్రయాణానికి అనుకూలంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రహదారులను బాగు చేసిన 10-20 రూపాయలను టోల్ రూపంలో వసూలు చేస్తే ఇబ్బంది లేదని భావిస్తోంది. ఇక, గోదావరి నీటిని బనకచర్ల(కర్నూలు) వరకూ తీసుకెళ్లేందుకూ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇందుకు రూ. 70వేల కోట్లు ఖర్చవుతాయి. ఈ విషయంలోనూ ప్రజల నుంచి భాగస్వామ్యం కింద కొంత సొమ్ము వసూలు చేస్తారు. ఫలితంగా రైతులు ఇప్పటి వరకు కడుతున్న నీటి తీరువా మరింత పెరుగుతుంది. అయితే.. రైతులు అర్థం చేసుకుంటారని సర్కారు భావిస్తోంది. అలా అయితే.. ఈ రెండు ప్రాజెక్టులు సక్సెస్ అవుతుందని అంటున్నారు పరిశీలకులు.
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…
అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు…
పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…