ఏపీ ప్రతిపక్షం వైసీపీకి.. ఇప్పుడు అంతా తానై వ్యవహరిస్తున్నారు మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ. ఈ ఏడాది మండలికి ఎన్నికైన ఆయనకు వైసీపీ అధినేత జగన్ మండలిలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు అప్పగించారు. దీంతో మండలిలో సర్వం ఆయనే అన్నట్టుగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శాసన సభకు హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం తాడేపల్లి కార్యాలయానికే పరిమితం అవుతున్నారు.
దీంతో కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో వైసీపీ వాయిస్ వినిపించడం లేదు. అయితే.. దీనికి దీటుగా మండలిని వైసీపీ ప్రధాన వేదికగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడే ప్రభుత్వాన్ని నిలదీసే దగ్గర నుంచి ప్రశ్నలు సంధించే వరకు కూడా సభ్యులు దూకుడుగా ఉంటున్నారు. వీరికి నేతృత్వం వహిస్తున్న బొత్స సత్యనారాయణ దూకుడుగా ఉంటున్నా.. మధ్య మధ్య తడబడుతున్నారనే చర్చ సాగుతోంది. దీంతో బొత్సను మంత్రులు లైట్ తీసుకుంటున్నారు.
కానీ, తన శక్తి కొద్దీ బొత్స వ్యాఖ్యలు చేయడంతోపాటు.. పలు అంశాలపై బలమైన వాదన వినిపిస్తున్నారు. అయితే.. లోపం ఎక్కడ వస్తోందంటే.. సరైన గణాంకాలతో.. సరైన వాదనా పటిమతో ఆయన కూటమి మంత్రులను కట్టడి చేయలేక పోతున్నారు. వాస్తవానికి మండలిలో వైసీపీకి బలం ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం పలు బిల్లులకు ఇక్కడ ఆమోదం లభించడం కష్టమనే భావించింది. అయితే.. బొత్స వ్యవహార శైలికారణంగా బలమైన పోటీ ఇవ్వలేక పోతున్నారన్న చర్చ ఉంది.
ఇటీవల 6 బిల్లులను ఏకపక్షంగా మండలిలో కూటమి ఆమోదించుకుంది. కనీసం.. వీటిని వ్యతిరేకించేందుకు కూడా బొత్స ప్రయత్నించలేదు. ఏ చిన్న వివాదం జరిగినా.. మేం వాకౌట్ చేస్తున్నాం.. అని మాత్రం చెబుతున్నారు. మండలి నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో కూటమి సభ్యులకు సర్కారుకు కూడా బొత్స మేలు చేస్తున్నారని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఆయనకు ఇదొక అద్భుతమైన అవకాశమని.. మంత్రిగా గతంలో చేసినా.. ఇప్పుడు మండలిలో విపక్ష నాయకుడిగా ఆయనకు మెరుగైన బాధ్యతలు వచ్చాయని చెబుతున్నారు.
This post was last modified on November 22, 2024 11:21 am
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…