ఏపీ ప్రతిపక్షం వైసీపీకి.. ఇప్పుడు అంతా తానై వ్యవహరిస్తున్నారు మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ. ఈ ఏడాది మండలికి ఎన్నికైన ఆయనకు వైసీపీ అధినేత జగన్ మండలిలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు అప్పగించారు. దీంతో మండలిలో సర్వం ఆయనే అన్నట్టుగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శాసన సభకు హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం తాడేపల్లి కార్యాలయానికే పరిమితం అవుతున్నారు.
దీంతో కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో వైసీపీ వాయిస్ వినిపించడం లేదు. అయితే.. దీనికి దీటుగా మండలిని వైసీపీ ప్రధాన వేదికగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడే ప్రభుత్వాన్ని నిలదీసే దగ్గర నుంచి ప్రశ్నలు సంధించే వరకు కూడా సభ్యులు దూకుడుగా ఉంటున్నారు. వీరికి నేతృత్వం వహిస్తున్న బొత్స సత్యనారాయణ దూకుడుగా ఉంటున్నా.. మధ్య మధ్య తడబడుతున్నారనే చర్చ సాగుతోంది. దీంతో బొత్సను మంత్రులు లైట్ తీసుకుంటున్నారు.
కానీ, తన శక్తి కొద్దీ బొత్స వ్యాఖ్యలు చేయడంతోపాటు.. పలు అంశాలపై బలమైన వాదన వినిపిస్తున్నారు. అయితే.. లోపం ఎక్కడ వస్తోందంటే.. సరైన గణాంకాలతో.. సరైన వాదనా పటిమతో ఆయన కూటమి మంత్రులను కట్టడి చేయలేక పోతున్నారు. వాస్తవానికి మండలిలో వైసీపీకి బలం ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం పలు బిల్లులకు ఇక్కడ ఆమోదం లభించడం కష్టమనే భావించింది. అయితే.. బొత్స వ్యవహార శైలికారణంగా బలమైన పోటీ ఇవ్వలేక పోతున్నారన్న చర్చ ఉంది.
ఇటీవల 6 బిల్లులను ఏకపక్షంగా మండలిలో కూటమి ఆమోదించుకుంది. కనీసం.. వీటిని వ్యతిరేకించేందుకు కూడా బొత్స ప్రయత్నించలేదు. ఏ చిన్న వివాదం జరిగినా.. మేం వాకౌట్ చేస్తున్నాం.. అని మాత్రం చెబుతున్నారు. మండలి నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో కూటమి సభ్యులకు సర్కారుకు కూడా బొత్స మేలు చేస్తున్నారని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఆయనకు ఇదొక అద్భుతమైన అవకాశమని.. మంత్రిగా గతంలో చేసినా.. ఇప్పుడు మండలిలో విపక్ష నాయకుడిగా ఆయనకు మెరుగైన బాధ్యతలు వచ్చాయని చెబుతున్నారు.
This post was last modified on November 22, 2024 11:21 am
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…
ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా అందుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛను ప్రభుత్వానికి మంచి మార్కులే వేస్తోంది.…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం రాత్రి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తంగా భావిస్తున్న…
హరిహర వీరమల్లు షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయడంతో ఇప్పుడు అభిమానుల చూపు ఓజి వైపు వెళ్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు…