“హత్యలు చేసేవారిని వెనుకేసుకు వస్తాడు. వారికి టికెట్ ఇస్తాడు. వారు అసలు అమాయకులు అని కూడా అంటాడు. ఇక, సోషల్ మీడియాలో తల్లిని, చెల్లిని బండ బూతులు తిట్టిన వారిని కూడా వెనుకేసుకు వస్తాడు.. ఆయన మనస్తత్వం ఏంటో నాకైతే అర్థంకాలేదు అధ్యక్షా!” అని వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ విషయంలో ఎవరు హద్దు మీరినా ఏం చేయాలో అది చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మహిళలకు పలు రాష్ట్రాల్లో కల్పిస్తున్న భద్రతను, అక్కడి చట్టాలను కూడా అధ్యయనం చేస్తున్నామని.. మహిళలకు భరోసా ఇచ్చేలా ఇక్కడ కూడా మార్పులు తెస్తున్నామన్నారు. “వర్రా రవీంద్రారెడ్డి. అధ్యక్షా .. అతను సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు పలకడానికి కూడా నాకు నోరు రావడం లేదు. నా నోటితో ఆ మాటలు చెప్పలేను . అలాంటి వ్యక్తిని ఈ పెద్ద మనిషి(జగన్) వెనుకేసుకు వస్తాడు” అన్నారు.
“సొంత తల్లిని, చెల్లిని బండ బూతులు తిట్టిన వర్రాను వెనుకేసుకువస్తున్నాడంటే.. ఈయన మనస్తత్వం ఏంటో అర్ధం చేసుకోవాలి. పైగా.. టీడీపీ వాళ్లే నకిలీ ఖాతాలు తెరిచి వర్రా పేరుతో పోస్టులు పెడుతున్నా రంటూ మాపై నిందలు వేస్తున్నాడు. పవిత్రమైన సభలో ఆ పోస్టుల గురించి కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అవినాష్రెడ్డిపై కూడా కేసు పెట్టాలని షర్మిల చెబుతున్నారు. కానీ, ఆ మహానుభావుడు మాత్రం వర్రా అమాయకుడని అంటున్నాడు” అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
పక్కాగా లా అండ్ ఆర్డర్
రాష్ట్రంలో శాంతి భద్రతలను పక్కాగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్ర బాబు చెప్పారు. ఎవరికి వారు ఇష్టానుసారంగా ఓ ఖాతా తెరిచేసి నకిలీ పేర్లతో మహిళలపై విమర్శలు చేస్తే.. తాట తీసేలా వ్యవహరిస్తామన్నారు. లా అండ్ ఆర్డర్ రుచి చూస్తారని హెచ్చరించారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో వైసీపీ వారే ఉన్నారని, వారే. అసభ్యంగా పోస్టులు పెట్టి మహిళలను, మంత్రులను కూడా వేధింపులకు గురి చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
This post was last modified on November 22, 2024 9:45 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…