ఏపీలో గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో పెట్టుబడుల వరద ప్రవహిస్తోంది. తాజాగా నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఏకంగా 1.87 లక్షల కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు ఏపీకి వచ్చిన వస్తున్న పెట్టుబడుల్లో ఇదే అతి పెద్దది. ఇప్పటి వరకు చంద్రబాబు కూటమి ప్రబుత్వం ఆర్సెలార్ మిట్టల్ సంస్థ విశాఖలో 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు అంగీకరించింది.
దీంతో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద పెట్టుబడిగా ప్రభుత్వం భావించింది. కానీ, ఇంతలోనే గురువారం సాయంత్రం చంద్రబాబును కలిసిన ఎన్టీపీసీ ప్రతినిధులు.. 1,87,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. తద్వారా రాష్ట్రానికి 20 వేల కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరనుంది. అదేవిధంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు, 5 లక్షల మందికి పైగా ఉపాధి కలగనుంది.
ఏం చేస్తారు?
ఎన్టీపీసీ పెడుతున్న ఈ భారీ పెట్టుబడితో రాష్ట్రంలో పునరుత్వాదక ఇంధన వనరులను అభివృద్ధి చేయనున్నారు. ఇతర సంస్థలతో కలిసి.. ఈ ప్రాజెక్టులను ఎన్టీపీసీ ఏర్పాటు చేయనుంది. వీటిలో ఎన్జీఈఎల్, ఎన్ ఆర్ ఈడీసీఏపీలు సహ భాగస్వాములుగా ఉండనున్నాయి. తద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఈ సంస్థలను పెట్టనున్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్టీపీసీ పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి ఇదేనని పారిశ్రామిక వేత్తలు, విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు విజన్కు ఇది తార్కాణమని మంత్రి గొట్టి పాటి రవి ప్రశంసించారు.
This post was last modified on November 22, 2024 9:42 am
మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…
ఏదైనా పెళ్లో.. మరో ఫంక్షనో.. భార్యా భర్తలు ఇరువురు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. సహజంగా దంపతుల్లో ఉత్సాహం ఉంటుంది. భర్త ముందుగానే…
యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…
నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…