ఏపీలో గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో పెట్టుబడుల వరద ప్రవహిస్తోంది. తాజాగా నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఏకంగా 1.87 లక్షల కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు ఏపీకి వచ్చిన వస్తున్న పెట్టుబడుల్లో ఇదే అతి పెద్దది. ఇప్పటి వరకు చంద్రబాబు కూటమి ప్రబుత్వం ఆర్సెలార్ మిట్టల్ సంస్థ విశాఖలో 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు అంగీకరించింది.
దీంతో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద పెట్టుబడిగా ప్రభుత్వం భావించింది. కానీ, ఇంతలోనే గురువారం సాయంత్రం చంద్రబాబును కలిసిన ఎన్టీపీసీ ప్రతినిధులు.. 1,87,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. తద్వారా రాష్ట్రానికి 20 వేల కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరనుంది. అదేవిధంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు, 5 లక్షల మందికి పైగా ఉపాధి కలగనుంది.
ఏం చేస్తారు?
ఎన్టీపీసీ పెడుతున్న ఈ భారీ పెట్టుబడితో రాష్ట్రంలో పునరుత్వాదక ఇంధన వనరులను అభివృద్ధి చేయనున్నారు. ఇతర సంస్థలతో కలిసి.. ఈ ప్రాజెక్టులను ఎన్టీపీసీ ఏర్పాటు చేయనుంది. వీటిలో ఎన్జీఈఎల్, ఎన్ ఆర్ ఈడీసీఏపీలు సహ భాగస్వాములుగా ఉండనున్నాయి. తద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఈ సంస్థలను పెట్టనున్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్టీపీసీ పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి ఇదేనని పారిశ్రామిక వేత్తలు, విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు విజన్కు ఇది తార్కాణమని మంత్రి గొట్టి పాటి రవి ప్రశంసించారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…