Political News

బాబు విజ‌న్‌: ఏపీకి 1.87 ల‌క్ష‌ల‌ కోట్ల పెట్టుబ‌డి!

ఏపీలో గ‌తంలో ఎన్న‌డూ క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో పెట్టుబ‌డుల వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తోంది. తాజాగా నేష‌న‌ల్ ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌(ఎన్టీపీసీ) ఏకంగా 1.87 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డిని పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి వ‌చ్చిన వ‌స్తున్న పెట్టుబ‌డుల్లో ఇదే అతి పెద్ద‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌బుత్వం ఆర్సెలార్ మిట్ట‌ల్ సంస్థ విశాఖ‌లో 65 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌కు అంగీక‌రించింది.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే అతి పెద్ద పెట్టుబ‌డిగా ప్ర‌భుత్వం భావించింది. కానీ, ఇంత‌లోనే గురువారం సాయంత్రం చంద్ర‌బాబును క‌లిసిన ఎన్టీపీసీ ప్ర‌తినిధులు.. 1,87,000 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. త‌ద్వారా రాష్ట్రానికి 20 వేల కోట్ల పైచిలుకు ఆదాయం స‌మ‌కూర‌నుంది. అదేవిధంగా ల‌క్ష మంది యువ‌త‌కు ఉద్యోగాలు, 5 ల‌క్ష‌ల మందికి పైగా ఉపాధి క‌ల‌గ‌నుంది.

ఏం చేస్తారు?

ఎన్టీపీసీ పెడుతున్న ఈ భారీ పెట్టుబ‌డితో రాష్ట్రంలో పున‌రుత్వాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌ను అభివృద్ధి చేయ‌నున్నారు. ఇత‌ర సంస్థ‌ల‌తో క‌లిసి.. ఈ ప్రాజెక్టుల‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేయ‌నుంది. వీటిలో ఎన్‌జీఈఎల్‌, ఎన్ ఆర్ ఈడీసీఏపీలు స‌హ భాగ‌స్వాములుగా ఉండ‌నున్నాయి. త‌ద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఈ సంస్థ‌ల‌ను పెట్ట‌నున్నారు. దీంతో ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎన్టీపీసీ పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి ఇదేన‌ని పారిశ్రామిక వేత్త‌లు, విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. చంద్ర‌బాబు విజ‌న్‌కు ఇది తార్కాణ‌మ‌ని మంత్రి గొట్టి పాటి ర‌వి ప్ర‌శంసించారు.

This post was last modified on November 22, 2024 9:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

5 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

51 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago