ఏపీలో గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో పెట్టుబడుల వరద ప్రవహిస్తోంది. తాజాగా నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఏకంగా 1.87 లక్షల కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు ఏపీకి వచ్చిన వస్తున్న పెట్టుబడుల్లో ఇదే అతి పెద్దది. ఇప్పటి వరకు చంద్రబాబు కూటమి ప్రబుత్వం ఆర్సెలార్ మిట్టల్ సంస్థ విశాఖలో 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు అంగీకరించింది.
దీంతో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద పెట్టుబడిగా ప్రభుత్వం భావించింది. కానీ, ఇంతలోనే గురువారం సాయంత్రం చంద్రబాబును కలిసిన ఎన్టీపీసీ ప్రతినిధులు.. 1,87,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. తద్వారా రాష్ట్రానికి 20 వేల కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరనుంది. అదేవిధంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు, 5 లక్షల మందికి పైగా ఉపాధి కలగనుంది.
ఏం చేస్తారు?
ఎన్టీపీసీ పెడుతున్న ఈ భారీ పెట్టుబడితో రాష్ట్రంలో పునరుత్వాదక ఇంధన వనరులను అభివృద్ధి చేయనున్నారు. ఇతర సంస్థలతో కలిసి.. ఈ ప్రాజెక్టులను ఎన్టీపీసీ ఏర్పాటు చేయనుంది. వీటిలో ఎన్జీఈఎల్, ఎన్ ఆర్ ఈడీసీఏపీలు సహ భాగస్వాములుగా ఉండనున్నాయి. తద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఈ సంస్థలను పెట్టనున్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్టీపీసీ పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి ఇదేనని పారిశ్రామిక వేత్తలు, విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు విజన్కు ఇది తార్కాణమని మంత్రి గొట్టి పాటి రవి ప్రశంసించారు.
This post was last modified on November 22, 2024 9:42 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…