Political News

బాబు విజ‌న్‌: ఏపీకి 1.87 ల‌క్ష‌ల‌ కోట్ల పెట్టుబ‌డి!

ఏపీలో గ‌తంలో ఎన్న‌డూ క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో పెట్టుబ‌డుల వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తోంది. తాజాగా నేష‌న‌ల్ ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌(ఎన్టీపీసీ) ఏకంగా 1.87 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డిని పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి వ‌చ్చిన వ‌స్తున్న పెట్టుబ‌డుల్లో ఇదే అతి పెద్ద‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌బుత్వం ఆర్సెలార్ మిట్ట‌ల్ సంస్థ విశాఖ‌లో 65 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌కు అంగీక‌రించింది.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే అతి పెద్ద పెట్టుబ‌డిగా ప్ర‌భుత్వం భావించింది. కానీ, ఇంత‌లోనే గురువారం సాయంత్రం చంద్ర‌బాబును క‌లిసిన ఎన్టీపీసీ ప్ర‌తినిధులు.. 1,87,000 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. త‌ద్వారా రాష్ట్రానికి 20 వేల కోట్ల పైచిలుకు ఆదాయం స‌మ‌కూర‌నుంది. అదేవిధంగా ల‌క్ష మంది యువ‌త‌కు ఉద్యోగాలు, 5 ల‌క్ష‌ల మందికి పైగా ఉపాధి క‌ల‌గ‌నుంది.

ఏం చేస్తారు?

ఎన్టీపీసీ పెడుతున్న ఈ భారీ పెట్టుబ‌డితో రాష్ట్రంలో పున‌రుత్వాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌ను అభివృద్ధి చేయ‌నున్నారు. ఇత‌ర సంస్థ‌ల‌తో క‌లిసి.. ఈ ప్రాజెక్టుల‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేయ‌నుంది. వీటిలో ఎన్‌జీఈఎల్‌, ఎన్ ఆర్ ఈడీసీఏపీలు స‌హ భాగ‌స్వాములుగా ఉండ‌నున్నాయి. త‌ద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఈ సంస్థ‌ల‌ను పెట్ట‌నున్నారు. దీంతో ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎన్టీపీసీ పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి ఇదేన‌ని పారిశ్రామిక వేత్త‌లు, విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. చంద్ర‌బాబు విజ‌న్‌కు ఇది తార్కాణ‌మ‌ని మంత్రి గొట్టి పాటి ర‌వి ప్ర‌శంసించారు.

This post was last modified on November 22, 2024 9:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

29 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago