ఏపీలో గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో పెట్టుబడుల వరద ప్రవహిస్తోంది. తాజాగా నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఏకంగా 1.87 లక్షల కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు ఏపీకి వచ్చిన వస్తున్న పెట్టుబడుల్లో ఇదే అతి పెద్దది. ఇప్పటి వరకు చంద్రబాబు కూటమి ప్రబుత్వం ఆర్సెలార్ మిట్టల్ సంస్థ విశాఖలో 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు అంగీకరించింది.
దీంతో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద పెట్టుబడిగా ప్రభుత్వం భావించింది. కానీ, ఇంతలోనే గురువారం సాయంత్రం చంద్రబాబును కలిసిన ఎన్టీపీసీ ప్రతినిధులు.. 1,87,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. తద్వారా రాష్ట్రానికి 20 వేల కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరనుంది. అదేవిధంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు, 5 లక్షల మందికి పైగా ఉపాధి కలగనుంది.
ఏం చేస్తారు?
ఎన్టీపీసీ పెడుతున్న ఈ భారీ పెట్టుబడితో రాష్ట్రంలో పునరుత్వాదక ఇంధన వనరులను అభివృద్ధి చేయనున్నారు. ఇతర సంస్థలతో కలిసి.. ఈ ప్రాజెక్టులను ఎన్టీపీసీ ఏర్పాటు చేయనుంది. వీటిలో ఎన్జీఈఎల్, ఎన్ ఆర్ ఈడీసీఏపీలు సహ భాగస్వాములుగా ఉండనున్నాయి. తద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఈ సంస్థలను పెట్టనున్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్టీపీసీ పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి ఇదేనని పారిశ్రామిక వేత్తలు, విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు విజన్కు ఇది తార్కాణమని మంత్రి గొట్టి పాటి రవి ప్రశంసించారు.
This post was last modified on November 22, 2024 9:42 am
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…
లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…
శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…
తమిళనాట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ విజయదుందుభి మోగించారు. ఏకపక్షంగా 110 స్థానాల్లో ఆయన విజయం దక్కించుకునే దిశగా…
నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…