సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను కేసులు వెంటాడుతున్నాయి. ఒక దాని నుంచి బయట పడేందుకే ఆయన ఆపసోపాలు పడుతున్నారు. అయితే.. ఒకదాని తర్వాత ఒకటిగా కేసులు ఆయనను వెంటా డుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని చెలరేగిన ఫలితంగా వర్మకు ఇప్పుడు సెగ బాగానే తగులుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత రామలింగయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నడుస్తోంది.
41 ఏ కింద నోటీసులు కూడా అందుకున్న వర్మ.. విచారణకు డుమ్మా కొట్టారు. మరోవైపు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే.. అక్కడ ఆయనకు ఎదురు దెబ్బ తగలడంతోపాటు విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అంతేకాదు.. బెయిల్ కావాలంటే ప్రత్యేకంగా పిటిషన్ వేసుకోవాలని సూచించారు. దీంతో రెండు రోజుల కిందట వర్మ ముందస్తు బెయిల్ కోరుతూ.. పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
దీనిపై విచారణ ఇంకా ప్రారంభం కాకముందే.. ఇప్పుడు మరో జిల్లాలో కేసు నమోదైంది. సామాజిక మాధ్యమాల్లో… అసభ్యకర పోస్టింగ్లపై… రాంగోపాల్ వర్మకు అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసుల నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. అయితే.. ఈ కేసు విషయంపై విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల గడువు కావాలని కోరుతూ వర్మ తన న్యాయవాదిని పంపించారు.
బిజీ షెడ్యూల్ కారణంగా రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారని న్యాయవాది బుల్లి బాబు తెలిపారు. దీనిపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం. మొత్తంగా వర్మ పరిస్థితి ఇప్పుడు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మారుతుండడం గమనార్హం. ఇలా మొత్తం 13 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు కూడా వరుసగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
This post was last modified on November 22, 2024 9:40 am
భారత్, పాకిస్థాన్ మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. గత ఏడాది పహల్గాం దాడితో అవి మరింత క్షీణించాయి.…
నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే ఎవరో కర్ణాటక అవతల సినీ ప్రేక్షకులకు తెలియదు. దర్శకుడిగా, నటుడిగా అప్పటికే కొన్ని…
వైసీపీ అధినేత జగన్ రెండు రోజులపాటు పరామర్శ యాత్ర సిద్ధమవుతున్నారు. బుధవారం గుంటూరులో, శుక్రవారం ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు,…
తెలుగు టీవీ చరిత్రలోనే ట్రెండ్ సెట్టింగ్ షోల్లో ఆట ఒకటి. అప్పటికే వేరే ఛానెళ్లలో కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాములు ఉన్నప్పటికీ.…
బాలీవుడ్ హీరోయిన్లలో ప్రేమకథలు, బ్రేకప్లు లేని వాళ్లు అరుదుగా కనిపిస్తారు. అక్కడ పెద్దగా దాపరికాలు కూడా ఏమీ ఉండవు. ఎక్కువగా…
వైసీపీ నేతలపైనా.. ఆ పార్టీ అధినేత జగన్పైనా సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు.. అధికారం కోల్పోయినప్పుడు కూడా…