సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను కేసులు వెంటాడుతున్నాయి. ఒక దాని నుంచి బయట పడేందుకే ఆయన ఆపసోపాలు పడుతున్నారు. అయితే.. ఒకదాని తర్వాత ఒకటిగా కేసులు ఆయనను వెంటా డుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని చెలరేగిన ఫలితంగా వర్మకు ఇప్పుడు సెగ బాగానే తగులుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత రామలింగయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నడుస్తోంది.
41 ఏ కింద నోటీసులు కూడా అందుకున్న వర్మ.. విచారణకు డుమ్మా కొట్టారు. మరోవైపు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే.. అక్కడ ఆయనకు ఎదురు దెబ్బ తగలడంతోపాటు విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అంతేకాదు.. బెయిల్ కావాలంటే ప్రత్యేకంగా పిటిషన్ వేసుకోవాలని సూచించారు. దీంతో రెండు రోజుల కిందట వర్మ ముందస్తు బెయిల్ కోరుతూ.. పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
దీనిపై విచారణ ఇంకా ప్రారంభం కాకముందే.. ఇప్పుడు మరో జిల్లాలో కేసు నమోదైంది. సామాజిక మాధ్యమాల్లో… అసభ్యకర పోస్టింగ్లపై… రాంగోపాల్ వర్మకు అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసుల నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. అయితే.. ఈ కేసు విషయంపై విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల గడువు కావాలని కోరుతూ వర్మ తన న్యాయవాదిని పంపించారు.
బిజీ షెడ్యూల్ కారణంగా రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారని న్యాయవాది బుల్లి బాబు తెలిపారు. దీనిపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం. మొత్తంగా వర్మ పరిస్థితి ఇప్పుడు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మారుతుండడం గమనార్హం. ఇలా మొత్తం 13 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు కూడా వరుసగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
This post was last modified on November 22, 2024 9:40 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…