సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను కేసులు వెంటాడుతున్నాయి. ఒక దాని నుంచి బయట పడేందుకే ఆయన ఆపసోపాలు పడుతున్నారు. అయితే.. ఒకదాని తర్వాత ఒకటిగా కేసులు ఆయనను వెంటా డుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని చెలరేగిన ఫలితంగా వర్మకు ఇప్పుడు సెగ బాగానే తగులుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత రామలింగయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నడుస్తోంది.
41 ఏ కింద నోటీసులు కూడా అందుకున్న వర్మ.. విచారణకు డుమ్మా కొట్టారు. మరోవైపు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే.. అక్కడ ఆయనకు ఎదురు దెబ్బ తగలడంతోపాటు విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అంతేకాదు.. బెయిల్ కావాలంటే ప్రత్యేకంగా పిటిషన్ వేసుకోవాలని సూచించారు. దీంతో రెండు రోజుల కిందట వర్మ ముందస్తు బెయిల్ కోరుతూ.. పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
దీనిపై విచారణ ఇంకా ప్రారంభం కాకముందే.. ఇప్పుడు మరో జిల్లాలో కేసు నమోదైంది. సామాజిక మాధ్యమాల్లో… అసభ్యకర పోస్టింగ్లపై… రాంగోపాల్ వర్మకు అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసుల నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. అయితే.. ఈ కేసు విషయంపై విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల గడువు కావాలని కోరుతూ వర్మ తన న్యాయవాదిని పంపించారు.
బిజీ షెడ్యూల్ కారణంగా రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారని న్యాయవాది బుల్లి బాబు తెలిపారు. దీనిపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం. మొత్తంగా వర్మ పరిస్థితి ఇప్పుడు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మారుతుండడం గమనార్హం. ఇలా మొత్తం 13 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు కూడా వరుసగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
This post was last modified on November 22, 2024 9:40 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…