సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను కేసులు వెంటాడుతున్నాయి. ఒక దాని నుంచి బయట పడేందుకే ఆయన ఆపసోపాలు పడుతున్నారు. అయితే.. ఒకదాని తర్వాత ఒకటిగా కేసులు ఆయనను వెంటా డుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని చెలరేగిన ఫలితంగా వర్మకు ఇప్పుడు సెగ బాగానే తగులుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత రామలింగయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నడుస్తోంది.
41 ఏ కింద నోటీసులు కూడా అందుకున్న వర్మ.. విచారణకు డుమ్మా కొట్టారు. మరోవైపు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే.. అక్కడ ఆయనకు ఎదురు దెబ్బ తగలడంతోపాటు విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అంతేకాదు.. బెయిల్ కావాలంటే ప్రత్యేకంగా పిటిషన్ వేసుకోవాలని సూచించారు. దీంతో రెండు రోజుల కిందట వర్మ ముందస్తు బెయిల్ కోరుతూ.. పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
దీనిపై విచారణ ఇంకా ప్రారంభం కాకముందే.. ఇప్పుడు మరో జిల్లాలో కేసు నమోదైంది. సామాజిక మాధ్యమాల్లో… అసభ్యకర పోస్టింగ్లపై… రాంగోపాల్ వర్మకు అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసుల నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. అయితే.. ఈ కేసు విషయంపై విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల గడువు కావాలని కోరుతూ వర్మ తన న్యాయవాదిని పంపించారు.
బిజీ షెడ్యూల్ కారణంగా రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారని న్యాయవాది బుల్లి బాబు తెలిపారు. దీనిపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం. మొత్తంగా వర్మ పరిస్థితి ఇప్పుడు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మారుతుండడం గమనార్హం. ఇలా మొత్తం 13 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు కూడా వరుసగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
This post was last modified on November 22, 2024 9:40 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…