సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను కేసులు వెంటాడుతున్నాయి. ఒక దాని నుంచి బయట పడేందుకే ఆయన ఆపసోపాలు పడుతున్నారు. అయితే.. ఒకదాని తర్వాత ఒకటిగా కేసులు ఆయనను వెంటా డుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని చెలరేగిన ఫలితంగా వర్మకు ఇప్పుడు సెగ బాగానే తగులుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత రామలింగయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నడుస్తోంది.
41 ఏ కింద నోటీసులు కూడా అందుకున్న వర్మ.. విచారణకు డుమ్మా కొట్టారు. మరోవైపు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే.. అక్కడ ఆయనకు ఎదురు దెబ్బ తగలడంతోపాటు విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అంతేకాదు.. బెయిల్ కావాలంటే ప్రత్యేకంగా పిటిషన్ వేసుకోవాలని సూచించారు. దీంతో రెండు రోజుల కిందట వర్మ ముందస్తు బెయిల్ కోరుతూ.. పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
దీనిపై విచారణ ఇంకా ప్రారంభం కాకముందే.. ఇప్పుడు మరో జిల్లాలో కేసు నమోదైంది. సామాజిక మాధ్యమాల్లో… అసభ్యకర పోస్టింగ్లపై… రాంగోపాల్ వర్మకు అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసుల నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. అయితే.. ఈ కేసు విషయంపై విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల గడువు కావాలని కోరుతూ వర్మ తన న్యాయవాదిని పంపించారు.
బిజీ షెడ్యూల్ కారణంగా రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారని న్యాయవాది బుల్లి బాబు తెలిపారు. దీనిపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం. మొత్తంగా వర్మ పరిస్థితి ఇప్పుడు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మారుతుండడం గమనార్హం. ఇలా మొత్తం 13 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు కూడా వరుసగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
This post was last modified on November 22, 2024 9:40 am
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…