Political News

పోసాని తెలివిగా గుడ్ బై చెప్పేశారు

వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై పోసాని అసభ్యకర పదజాలంతో దూషణలకు దిగిన వైనంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పోసానిపై రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోసాని రాజకీయాలకు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై తాను రాజకీయాలకు సంబంధించి ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలు చేయబోనని పోసాని షాకింగ్ ప్రకటన చేశారు. ఇకపై తాను ఏ పార్టీని పొగ‌డ‌నుని, ఏ పార్టీని విమ‌ర్శించనని పోసాని తెలిపారు. అయితే, ఈ నిర్ణయం తనకు తానుగా తీసుకున్నానని, త‌న‌ను ఎవ‌రూ ఏమీ అన‌లేద‌ని పోసాని క్లారిటీనిచ్చారు. తాను, గతంలో కూడా మంచి రాజకీయ నాయకులను విమర్శించలేదని పోసాని చెప్పారు. ప్రధాని మోదీ, ఇందిరా గాంధీ, నవీన్ పట్నాయక్ వంటి నేతలను తాను ఒక్క మాట అనలేదని చెప్పారు. అన్ని పార్టీల‌కు స‌పోర్టు చేశాన‌ని, విమ‌ర్శ‌లు చేశాన‌ని తెలిపారు.

నాయకుల గుణగణాలను బట్టి వారిపై విమర్శలు చేశానని, ఇకపై చేయబోనని అన్నారు. అంద‌రి కంటే ఎక్కువ‌గా చంద్ర‌బాబునే ఎక్కువగా పొగిడానని, ఆయన చేసిన మంచి ప‌నుల‌ను ఓ లిస్ట్ కూడా రాసుకున్నాన‌ని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు పొర‌పాట్లు చేసిన‌ప్పుడు విమ‌ర్శించానని అంగీకరించారు. ఇప్పటి నుంచి త‌న తుది శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని చెప్పారు.

అయితే, హఠాత్తుగా రాజకీయాలకు పోసాని గుడ్ బై చెప్పడానికి వైసీపీనే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పోసానిపై కేసులు పెడుతున్న క్రమంలో ఆయనకు వైసీపీ నేతలు ఆశించిన స్థాయిలో మద్దతు తెలపలేదని, అందుకే పోసాని రాజకీయాలకు, రాజకీయ విమర్శలకు గుడ్ బై చెప్పారని కొందరు నెటిజన్లు అంటున్నారు.

This post was last modified on November 21, 2024 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

12 minutes ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

3 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

4 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

4 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

6 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

7 hours ago