Political News

పోసాని తెలివిగా గుడ్ బై చెప్పేశారు

వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై పోసాని అసభ్యకర పదజాలంతో దూషణలకు దిగిన వైనంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పోసానిపై రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోసాని రాజకీయాలకు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై తాను రాజకీయాలకు సంబంధించి ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలు చేయబోనని పోసాని షాకింగ్ ప్రకటన చేశారు. ఇకపై తాను ఏ పార్టీని పొగ‌డ‌నుని, ఏ పార్టీని విమ‌ర్శించనని పోసాని తెలిపారు. అయితే, ఈ నిర్ణయం తనకు తానుగా తీసుకున్నానని, త‌న‌ను ఎవ‌రూ ఏమీ అన‌లేద‌ని పోసాని క్లారిటీనిచ్చారు. తాను, గతంలో కూడా మంచి రాజకీయ నాయకులను విమర్శించలేదని పోసాని చెప్పారు. ప్రధాని మోదీ, ఇందిరా గాంధీ, నవీన్ పట్నాయక్ వంటి నేతలను తాను ఒక్క మాట అనలేదని చెప్పారు. అన్ని పార్టీల‌కు స‌పోర్టు చేశాన‌ని, విమ‌ర్శ‌లు చేశాన‌ని తెలిపారు.

నాయకుల గుణగణాలను బట్టి వారిపై విమర్శలు చేశానని, ఇకపై చేయబోనని అన్నారు. అంద‌రి కంటే ఎక్కువ‌గా చంద్ర‌బాబునే ఎక్కువగా పొగిడానని, ఆయన చేసిన మంచి ప‌నుల‌ను ఓ లిస్ట్ కూడా రాసుకున్నాన‌ని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు పొర‌పాట్లు చేసిన‌ప్పుడు విమ‌ర్శించానని అంగీకరించారు. ఇప్పటి నుంచి త‌న తుది శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని చెప్పారు.

అయితే, హఠాత్తుగా రాజకీయాలకు పోసాని గుడ్ బై చెప్పడానికి వైసీపీనే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పోసానిపై కేసులు పెడుతున్న క్రమంలో ఆయనకు వైసీపీ నేతలు ఆశించిన స్థాయిలో మద్దతు తెలపలేదని, అందుకే పోసాని రాజకీయాలకు, రాజకీయ విమర్శలకు గుడ్ బై చెప్పారని కొందరు నెటిజన్లు అంటున్నారు.

Satya

Recent Posts

గేమ్ చేంజర్ ఎందుకు ఆడలేదు?

తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెలుగులో ఎలాంటి ఫాలోయింగ్ ఉండేదో అందరికీ తెలిసిందే. ఆయన ఇక్కడి టాప్ స్టార్లతో నేరుగా…

2 hours ago

అతడి కోసం ఎగ‌బ‌డి టికెట్లు కొంటే…

ఈ ఏడాది ఐపీఎల్ సంద‌ర్భంగా వైభ‌వ్ సూర్య‌వంశీ పేరు ఎలా మార్మోగిందో తెలిసిందే. మ‌హా మ‌హా బ్యాట‌ర్ల‌ను వెన‌క్కి నెట్టి…

3 hours ago

చివరి ఓవర్ ఆడుతున్న పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆడుతున్న క్రికెట్ చివరి ఓవర్ కు వచ్చేసింది. బుక్ మై షోలో నిన్నటిదాకా…

3 hours ago

భాగ్యరాజ్.. గుంటూరు అల్లుడేనండి..!

తమిళ సినీ పరిశ్రమలో "స్క్రీన్‌ప్లే కింగ్"గా పేరొందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ మృతితో సినీ ప్రపంచం విషాదంలో…

3 hours ago

నానాజీ వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారు?

వైసీపీ నేత‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదేస‌మ‌యంలో కొన్ని కీలక వ్యాఖ్య‌లు కూడా…

3 hours ago

మళ్లీ తమిళ దర్శకుడితో తెలుగు హీరో?

తెలుగులో కేవలం నటనకు పరిమితం కాకుండా.. రైటింగ్, మేకింగ్‌లోనూ భాగం అవుతూ తన సినిమాలను సక్సెస్ చేసుకునే హీరోల్లో నవీన్…

4 hours ago