గౌతం అదానీ. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా విస్తృతంగా వినిపిస్తున్న పేరు ఇది. ప్రపంచ కుబేరుల్లో తొలి ముగ్గురిలో అదానీ కూడా ఉండడం గమనార్హం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదానీ వ్యాపార సామ్రాజ్యాల పంట పండుతోందన్న వాదన కూడా ఉంది. అయితే.. తరచుగా అదానీపై ప్రపంచ దేశాల్లో అనే విమర్శలు వస్తున్నాయి. గత రెండేళ్ల కిందట.. అదానీ వ్యాపార సామ్రాజ్యంపై అమెరికా సంస్థ హెండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది.
ఇది భారత పార్లమెంటును ఇప్పటికీ కుదిపేస్తున్న అంశమే. ఇక, ఇప్పుడు తాజాగా అదానిపై ఏకంగా కేసే నమోదైంది. అది కూడా అమెరికాలో కావడం.. మరింత సంచలనంగా మారింది. అమెరికాలో భారీ ఎత్తున కాంట్రాక్టుపనులు దక్కించుకునేందుకు అక్కడి భారత సంతతి అధికారులకు అదానీ కోట్ల రూపాయల లంచం ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఆయనప మోసపూరిత కుట్ర కింద అభియోగాలు నమోదయ్యాయి. అంతేకాదు.. అదానీపై అరెస్టు వారెంటు కూడా జారీ అయిందని సమాచారం.
ఎంత ?
తన కంపెనీ ప్రమోషన్లో భాగంగా అత్యంత రహస్య ప్రాంతంలో భారత సంతతి అధికారులకు అదానీ 2250 కోట్ల రూపాయల వరకు ముడుపులు చెల్లించారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ బీఐ) పేర్కొంది. ఇది అత్యంత తీవ్రమైన కేసుగా నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంపై అదానీ గ్రూప్ ఇప్పటి వరకు స్పందించలేదు.
పతనం!
అదానీపై అరెస్టు వారెంటు జారీ అయిందని.. ఆయనపై లంచాల కేసు నమోదైందని తెలియడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అఅదానీ గ్రూపునకు చెందిన 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు ఢమాల్ అంటూ.. దిగజారిపోయాయి. దాదాపు అన్ని కంపెనీల షేర్లు పతనమయ్యాయి. సుమారు 20 శాతం మేర షేర్లు క్షీణించడం అదానీ గ్రూప్ను కలవరపాటుకు గురి చేస్తోంది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్తో పాటు అన్ని కంపెనీల షేర్లు పతనావస్థకు చేరుకున్నాయి.
This post was last modified on November 21, 2024 2:27 pm
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…