గౌతం అదానీ. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా విస్తృతంగా వినిపిస్తున్న పేరు ఇది. ప్రపంచ కుబేరుల్లో తొలి ముగ్గురిలో అదానీ కూడా ఉండడం గమనార్హం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదానీ వ్యాపార సామ్రాజ్యాల పంట పండుతోందన్న వాదన కూడా ఉంది. అయితే.. తరచుగా అదానీపై ప్రపంచ దేశాల్లో అనే విమర్శలు వస్తున్నాయి. గత రెండేళ్ల కిందట.. అదానీ వ్యాపార సామ్రాజ్యంపై అమెరికా సంస్థ హెండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది.
ఇది భారత పార్లమెంటును ఇప్పటికీ కుదిపేస్తున్న అంశమే. ఇక, ఇప్పుడు తాజాగా అదానిపై ఏకంగా కేసే నమోదైంది. అది కూడా అమెరికాలో కావడం.. మరింత సంచలనంగా మారింది. అమెరికాలో భారీ ఎత్తున కాంట్రాక్టుపనులు దక్కించుకునేందుకు అక్కడి భారత సంతతి అధికారులకు అదానీ కోట్ల రూపాయల లంచం ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఆయనప మోసపూరిత కుట్ర కింద అభియోగాలు నమోదయ్యాయి. అంతేకాదు.. అదానీపై అరెస్టు వారెంటు కూడా జారీ అయిందని సమాచారం.
ఎంత ?
తన కంపెనీ ప్రమోషన్లో భాగంగా అత్యంత రహస్య ప్రాంతంలో భారత సంతతి అధికారులకు అదానీ 2250 కోట్ల రూపాయల వరకు ముడుపులు చెల్లించారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ బీఐ) పేర్కొంది. ఇది అత్యంత తీవ్రమైన కేసుగా నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంపై అదానీ గ్రూప్ ఇప్పటి వరకు స్పందించలేదు.
పతనం!
అదానీపై అరెస్టు వారెంటు జారీ అయిందని.. ఆయనపై లంచాల కేసు నమోదైందని తెలియడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అఅదానీ గ్రూపునకు చెందిన 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు ఢమాల్ అంటూ.. దిగజారిపోయాయి. దాదాపు అన్ని కంపెనీల షేర్లు పతనమయ్యాయి. సుమారు 20 శాతం మేర షేర్లు క్షీణించడం అదానీ గ్రూప్ను కలవరపాటుకు గురి చేస్తోంది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్తో పాటు అన్ని కంపెనీల షేర్లు పతనావస్థకు చేరుకున్నాయి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…