గౌతం అదానీ. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా విస్తృతంగా వినిపిస్తున్న పేరు ఇది. ప్రపంచ కుబేరుల్లో తొలి ముగ్గురిలో అదానీ కూడా ఉండడం గమనార్హం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదానీ వ్యాపార సామ్రాజ్యాల పంట పండుతోందన్న వాదన కూడా ఉంది. అయితే.. తరచుగా అదానీపై ప్రపంచ దేశాల్లో అనే విమర్శలు వస్తున్నాయి. గత రెండేళ్ల కిందట.. అదానీ వ్యాపార సామ్రాజ్యంపై అమెరికా సంస్థ హెండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది.
ఇది భారత పార్లమెంటును ఇప్పటికీ కుదిపేస్తున్న అంశమే. ఇక, ఇప్పుడు తాజాగా అదానిపై ఏకంగా కేసే నమోదైంది. అది కూడా అమెరికాలో కావడం.. మరింత సంచలనంగా మారింది. అమెరికాలో భారీ ఎత్తున కాంట్రాక్టుపనులు దక్కించుకునేందుకు అక్కడి భారత సంతతి అధికారులకు అదానీ కోట్ల రూపాయల లంచం ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఆయనప మోసపూరిత కుట్ర కింద అభియోగాలు నమోదయ్యాయి. అంతేకాదు.. అదానీపై అరెస్టు వారెంటు కూడా జారీ అయిందని సమాచారం.
ఎంత ?
తన కంపెనీ ప్రమోషన్లో భాగంగా అత్యంత రహస్య ప్రాంతంలో భారత సంతతి అధికారులకు అదానీ 2250 కోట్ల రూపాయల వరకు ముడుపులు చెల్లించారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ బీఐ) పేర్కొంది. ఇది అత్యంత తీవ్రమైన కేసుగా నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంపై అదానీ గ్రూప్ ఇప్పటి వరకు స్పందించలేదు.
పతనం!
అదానీపై అరెస్టు వారెంటు జారీ అయిందని.. ఆయనపై లంచాల కేసు నమోదైందని తెలియడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అఅదానీ గ్రూపునకు చెందిన 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు ఢమాల్ అంటూ.. దిగజారిపోయాయి. దాదాపు అన్ని కంపెనీల షేర్లు పతనమయ్యాయి. సుమారు 20 శాతం మేర షేర్లు క్షీణించడం అదానీ గ్రూప్ను కలవరపాటుకు గురి చేస్తోంది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్తో పాటు అన్ని కంపెనీల షేర్లు పతనావస్థకు చేరుకున్నాయి.
This post was last modified on November 21, 2024 2:27 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…