Political News

పీఏసీ ఛైర్మన్ ఎన్నిక..జగన్ కు విషమ పరీక్ష

2024 సార్వత్రిక ఎన్నికలలో 11 స్థానాలకే వైసీపీ పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా వైసీపీ కోల్పోయింది. అయితే 11 మంది సభ్యులున్నప్పటికీ తమను ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ అధినేత జగన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ, నిబంధనల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రజా పద్ధుల కమిటీ (పీఏసీ) చైర్మన్ ఎంపిక వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ రోజు పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ కావడంతో ఉత్కంఠ ఏర్పడింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కించుకునే సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పదవికి వైసీపీ సభ్యుడు నామినేషన్ వేస్తారా లేదా అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయాలని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది.

పెద్దిరెడ్డి నామినేషన్ వేసిన తర్వాత ఆయనను నామినేట్ చేస్తారా లేక ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున ఎవరో ఒక సభ్యుడిని ఎన్నుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష హోదాతో పాటు సరిపడా సంఖ్యాబలం ఉండడంతో సంప్రదాయం ప్రకారం టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ను పీఏసీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. కానీ, ఈసారి వైసీపీకి అటువంటి పరిస్థితి లేకపోవడంతో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ ఏర్పడింది. ఏది ఏమైనా పీఏసీ ఛైర్మన్ ఎన్నిక..జగన్ కు విషమ పరీక్షగా మారిందని చెప్పవచ్చు.

This post was last modified on November 21, 2024 2:19 pm

Share

Recent Posts

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

2 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

3 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

4 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

4 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

8 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

15 hours ago