2024 సార్వత్రిక ఎన్నికలలో 11 స్థానాలకే వైసీపీ పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా వైసీపీ కోల్పోయింది. అయితే 11 మంది సభ్యులున్నప్పటికీ తమను ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ అధినేత జగన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ, నిబంధనల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రజా పద్ధుల కమిటీ (పీఏసీ) చైర్మన్ ఎంపిక వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ రోజు పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ కావడంతో ఉత్కంఠ ఏర్పడింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కించుకునే సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పదవికి వైసీపీ సభ్యుడు నామినేషన్ వేస్తారా లేదా అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయాలని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది.
పెద్దిరెడ్డి నామినేషన్ వేసిన తర్వాత ఆయనను నామినేట్ చేస్తారా లేక ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున ఎవరో ఒక సభ్యుడిని ఎన్నుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష హోదాతో పాటు సరిపడా సంఖ్యాబలం ఉండడంతో సంప్రదాయం ప్రకారం టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ను పీఏసీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. కానీ, ఈసారి వైసీపీకి అటువంటి పరిస్థితి లేకపోవడంతో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ ఏర్పడింది. ఏది ఏమైనా పీఏసీ ఛైర్మన్ ఎన్నిక..జగన్ కు విషమ పరీక్షగా మారిందని చెప్పవచ్చు.
This post was last modified on November 21, 2024 2:19 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…