2024 సార్వత్రిక ఎన్నికలలో 11 స్థానాలకే వైసీపీ పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా వైసీపీ కోల్పోయింది. అయితే 11 మంది సభ్యులున్నప్పటికీ తమను ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ అధినేత జగన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ, నిబంధనల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రజా పద్ధుల కమిటీ (పీఏసీ) చైర్మన్ ఎంపిక వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ రోజు పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ కావడంతో ఉత్కంఠ ఏర్పడింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కించుకునే సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పదవికి వైసీపీ సభ్యుడు నామినేషన్ వేస్తారా లేదా అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయాలని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది.
పెద్దిరెడ్డి నామినేషన్ వేసిన తర్వాత ఆయనను నామినేట్ చేస్తారా లేక ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున ఎవరో ఒక సభ్యుడిని ఎన్నుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష హోదాతో పాటు సరిపడా సంఖ్యాబలం ఉండడంతో సంప్రదాయం ప్రకారం టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ను పీఏసీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. కానీ, ఈసారి వైసీపీకి అటువంటి పరిస్థితి లేకపోవడంతో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ ఏర్పడింది. ఏది ఏమైనా పీఏసీ ఛైర్మన్ ఎన్నిక..జగన్ కు విషమ పరీక్షగా మారిందని చెప్పవచ్చు.
This post was last modified on November 21, 2024 2:19 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…