2024 సార్వత్రిక ఎన్నికలలో 11 స్థానాలకే వైసీపీ పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా వైసీపీ కోల్పోయింది. అయితే 11 మంది సభ్యులున్నప్పటికీ తమను ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ అధినేత జగన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ, నిబంధనల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రజా పద్ధుల కమిటీ (పీఏసీ) చైర్మన్ ఎంపిక వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ రోజు పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ కావడంతో ఉత్కంఠ ఏర్పడింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కించుకునే సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పదవికి వైసీపీ సభ్యుడు నామినేషన్ వేస్తారా లేదా అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయాలని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది.
పెద్దిరెడ్డి నామినేషన్ వేసిన తర్వాత ఆయనను నామినేట్ చేస్తారా లేక ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున ఎవరో ఒక సభ్యుడిని ఎన్నుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష హోదాతో పాటు సరిపడా సంఖ్యాబలం ఉండడంతో సంప్రదాయం ప్రకారం టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ను పీఏసీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. కానీ, ఈసారి వైసీపీకి అటువంటి పరిస్థితి లేకపోవడంతో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ ఏర్పడింది. ఏది ఏమైనా పీఏసీ ఛైర్మన్ ఎన్నిక..జగన్ కు విషమ పరీక్షగా మారిందని చెప్పవచ్చు.
This post was last modified on November 21, 2024 2:19 pm
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…