ఏపీలో వలంటీర్ల వ్యవస్థకు సంబంధించి గత ఆరు మాసాలుగా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. జగన్ హయాంలో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను తాము కూడా కొనసాగిస్తామని.. వేతనాలు కూడా రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వ్యవస్థకు సంబంధించి సర్కారు అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఇంతలోనే అసలు ఈ వ్యవస్థలేదంటూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించారు.
తాజాగా ఇదే అంశం శాసన మండలిలోనూ చర్చకు వచ్చింది. వలంటీర్ వ్యవస్థ ఉందా? లేదా? అంటూ.. వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు. వలంటీ ర్ వ్యవస్థ ఇప్పుడు మనుగడ లేదన్నారు. దీనికి కారణం జగన్ వారిని మోసం చేయడమేనని తెలిపారు. 2023 ఆగస్టు(ఎన్నికలకు 10 నెలల ముందు)లో వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ.. జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చి ఉండాల్సిందని.. కానీ, ఇవ్వలేదని, కాబట్టి వలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదని పేర్కొన్నారు.
లేని వ్యవస్థలో ఉన్నారో లేదో కూడా తెలియని వలంటీర్లకు వేతనాలు ఎలా చెల్లించాలని ఆయన ప్రశ్నిం చారు. ప్రస్తుతం వలంటీర్లు లేరని తెలిపారు. వారికి ఇవ్వాల్సిన వేతనాలను మే నెల వరకు చెల్లించామని డోలా చెప్పారు. అయితే, ఎన్నికల సమయంలో వారిని కొనసాగిస్తాంటూ చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే వారు అప్పట్లో వ్యవస్థలో ఉన్నారని అందరూ భావించారని, కానీ, జగన్ చేసిన మోసంతో వారువ్య వస్థకు దూరమయ్యారని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ ప్రస్తుతానికి లేదన్నారు. వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రతి రూపాయి ఇచ్చే సిందన్నారు. లేని వ్యవస్థపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. కొత్తగా వలంటీర్లను తీసుకునే విషయం తన పరిధిలో లేదని, ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని మంత్రి డోలా మండలిలో వివరించా రు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులకు మంత్రి కి మధ్య వాగ్వాదం నడిచింది. 2023లో జీవో ఇవ్వనప్పుడు.. ఈ ఏడాది మే వరకు వేతనాలు ఎందుకు చెల్లించారని.. అంటే వ్యవస్థలో వారు ఉన్నట్టే కదా? అని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు.
This post was last modified on November 21, 2024 11:19 am
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…