ఏపీ సీఎం చంద్రబాబు త్వరలోనే పల్లెబాటకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. ప్రజల్లోకి వెళ్తున్నానని.. అది కూడా గ్రామీణ ప్రాంతాలను చేరుకుంటానని అక్కడి ప్రజలతో మమేకమవుతానని చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి వంటి విషయాలను వివరిస్తానని చంద్రబాబు సభకు వివరించారు. అయితే.. ఎన్నికలు పూర్తయి.. కేవలం ఆరు మాసాలు కూడా కాకుండానే చంద్రబాబు పల్లెబాట పట్టడంపై చర్చ సాగుతోంది.
అయితే.. చంద్రబాబు నిర్ణయం వెనుక.. రెండు వ్యూహాలు ఉండి ఉంటాయని పరిశీలకులు అంచనా వేస్తు న్నారు. 1) ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించడం ద్వారా.. అసంతృప్తిని పారదోలాలన్నది ప్రధాన వ్యూహం. సూపర్ సిక్స్ హామీల విషయంలో ప్రజల్లో అసంతృప్తి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. మహిళలకు 18 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చంద్రబాబు చెప్పారు.కానీ, ఇది ప్రారంభం కాలేదు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు. ఇది కూడా ప్రారంభం కాలేదు.
అదేసమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రూ.20 వేల చొప్పు ఇన్పుట్ సబ్జిడీ ఇస్తామని కూడా చెప్పా రు. ఇది కూడా ఇంకా మొదలు పెట్టలేదు. ఈ నేపథ్యంలో అసంతృప్తి నెలకొంది. దీనిని కొంత వరకు తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నది ఈ పర్యటనకు కారణమని చెబుతున్నారు. 2) పల్లె బాట చేపట్టడం ద్వారా.. స్థానిక సంస్థల్లో పార్టీని బలోపేతం చేయాలన్న సంకల్పం కూడా కనిపిస్తోందని అంటున్నారు.
వచ్చే ఏడాది చివరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉన్నాయి. ఆ సమయానికి పార్టీని పుంజుకునేలా చేయాలన్న వ్యూహంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పల్లె బాట ద్వారా.. స్థానికంగా బలోపేతం కావాలన్న వ్యూహం ఉంది. ఇక, తమ్ముళ్ల దూకుడుకు కూడా ఆయన కళ్లెం వేసేందుకు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కూడా ఈ పల్లెబాట కార్యక్రమాలు ప్రయోజనకరంగా ఉంటాయన్నది తమ్ముళ్లు చెబుతున్న మాట.
This post was last modified on November 21, 2024 10:53 am
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…