ఏపీ సీఎం చంద్రబాబు త్వరలోనే పల్లెబాటకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. ప్రజల్లోకి వెళ్తున్నానని.. అది కూడా గ్రామీణ ప్రాంతాలను చేరుకుంటానని అక్కడి ప్రజలతో మమేకమవుతానని చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి వంటి విషయాలను వివరిస్తానని చంద్రబాబు సభకు వివరించారు. అయితే.. ఎన్నికలు పూర్తయి.. కేవలం ఆరు మాసాలు కూడా కాకుండానే చంద్రబాబు పల్లెబాట పట్టడంపై చర్చ సాగుతోంది.
అయితే.. చంద్రబాబు నిర్ణయం వెనుక.. రెండు వ్యూహాలు ఉండి ఉంటాయని పరిశీలకులు అంచనా వేస్తు న్నారు. 1) ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించడం ద్వారా.. అసంతృప్తిని పారదోలాలన్నది ప్రధాన వ్యూహం. సూపర్ సిక్స్ హామీల విషయంలో ప్రజల్లో అసంతృప్తి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. మహిళలకు 18 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చంద్రబాబు చెప్పారు.కానీ, ఇది ప్రారంభం కాలేదు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు. ఇది కూడా ప్రారంభం కాలేదు.
అదేసమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రూ.20 వేల చొప్పు ఇన్పుట్ సబ్జిడీ ఇస్తామని కూడా చెప్పా రు. ఇది కూడా ఇంకా మొదలు పెట్టలేదు. ఈ నేపథ్యంలో అసంతృప్తి నెలకొంది. దీనిని కొంత వరకు తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నది ఈ పర్యటనకు కారణమని చెబుతున్నారు. 2) పల్లె బాట చేపట్టడం ద్వారా.. స్థానిక సంస్థల్లో పార్టీని బలోపేతం చేయాలన్న సంకల్పం కూడా కనిపిస్తోందని అంటున్నారు.
వచ్చే ఏడాది చివరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉన్నాయి. ఆ సమయానికి పార్టీని పుంజుకునేలా చేయాలన్న వ్యూహంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పల్లె బాట ద్వారా.. స్థానికంగా బలోపేతం కావాలన్న వ్యూహం ఉంది. ఇక, తమ్ముళ్ల దూకుడుకు కూడా ఆయన కళ్లెం వేసేందుకు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కూడా ఈ పల్లెబాట కార్యక్రమాలు ప్రయోజనకరంగా ఉంటాయన్నది తమ్ముళ్లు చెబుతున్న మాట.
This post was last modified on November 21, 2024 10:53 am
వరల్డ్ మ్యూజిక్ ఐకాన్ మైకేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'మైకేల్' ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఆంటోనీ ఫుక్వా…
ఆ మధ్య డెకాయిట్ టీజర్ లాంచ్ జరిగినప్పుడు పోటీ గురించి ప్రస్తావిస్తూ అడివి శేష్ ఒక మాట అనడం అభిమానులకు…
సమ్మర్ లక్ష్యంగా పెట్టుకున్న పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేక అభిమానులు తెగ వర్రీ అవుతున్నారు. పెద్ది,…
నేటి రోజుల్లో రూపాయి చేయిజారి కింద పడితేనే వెనక్కి ఇచ్చేవాళ్లు అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటిది ఏకంగా రూ.45 లక్షల విలువైన…
ఇవాళ అనౌన్స్ చేసిన దురంధర్ 2 టీజర్ కోసం అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. ఎప్పుడెప్పుడు పన్నెండు దాటుతుందా…
ఫిబ్రవరి 14 కపుల్ ఫ్రెండ్లీ విడుదల కానుంది. సక్సెస్ పరంగా హీరో సంతోష్ శోభన్ కు ఇది చాలా కీలకం.…