Political News

ఎగ్జిట్‌పోల్‌: మ‌హారాష్ట్ర‌లో క‌మ‌ల వికాసం?

తాజాగా ముగిసిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు త‌ల‌కో ర‌కంగా వ‌చ్చాయి. అయితే.. మెజారిటీ సంస్థ‌లు బీజేపీకి ప‌ట్టంక‌ట్టాయి. బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి(భారీ కూట‌మి) కూట‌మికి ప‌ట్టం క‌ట్ట‌డం విశేషం. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మ‌హారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడ‌త‌లో బుధ‌వారం(న‌వంబ‌రు 20) పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌శాంతంగానే ఈ ప్ర‌క్రియ సాగిపోయింది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్.. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. మ‌రికొన్ని చోట్ల సాయంత్రం 6 వ‌ర‌కు కూడా కొన‌సాగింది.

పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన అర‌గంట త‌ర్వాత‌.. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో ఎవ‌రికి విజ‌య అవ‌కాశాలు ఉన్నాయ‌నే విష‌యంపై ప‌లు సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ స‌ర్వే వెల్ల‌డించారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ+శివ‌సేన‌(ఏక్‌నాథ్ షిండే)+ఎన్సీపీ(అజిత్ ప‌వార్‌) కూట‌మి మ‌హాయుతిగా రంగంలోకిదిగాయి. ఇక‌, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కాంగ్రెస్‌+శివ‌సేన‌(ఉద్ద‌వ్ ఠాక్రే)+ఎన్సీపీ(శ‌ర‌ద్ ప‌వార్‌) కూట‌మి మ‌హా వికాస్ అఘాడీగా బ‌రిలో నిలిచాయి. వీటితో పాటు బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న ఎంఎన్‌సీ, ఎంఐఎం వంటివి కూడా ప్ర‌భావం చూపుతున్న‌ట్టు ఎగ్జిట్ పోల్స్ స‌ర్వే వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

ఎస్ ఏఎస్ గ్రూప్‌: ఈ సంస్థ అంచ‌నాల ప్ర‌కారం మ‌హా వికాస్ అఘాడీ విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. ఈ కూట‌మి పార్టీలు మొత్తం 288 స్థానాల్లో 147-155 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కే అవ‌కాశం ఉంది. ఇక, బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి 127-135 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. మెజారిటీ మేజిక్ ఫిగ‌ర్ ప్ర‌కారం.. 288 స్థానాల్లో 145 స్థానాలు ద‌క్కించుకున్న కూట‌మి పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టనుంది. కాబ‌ట్టి ఈ స‌ర్వే ప్ర‌కారం.. మ‌హావికాస్ అఘాడీ అధికారంలోకి వ‌చ్చే ఛాన్స్ క‌నిపిస్తోంది.

పీపుల్స్ ప‌ల్స్ సర్వే: ఈ స‌ర్వే ప్ర‌కారం బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమికి 182(175 -195) సీట్లు, మ‌హావికాస్ అఘాడీ కూటమికి 97(85 -112) సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక‌, ఈ స‌ర్వే ప్ర‌కారం ఇతరులుకు 9 (7 -12) సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక‌, చాణ‌క్య స‌హా సీఎన్ ఎన్, న్యూస్ 18 వంటివి కూడా బీజేపీ కూట‌మికే మెజారిటీ అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా బీజేపీకి ఎక్కువ‌గా అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని స‌ర్వేలు చాటి చెప్పాయి.

This post was last modified on November 21, 2024 12:11 am

Share

Recent Posts

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

16 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

20 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

59 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

4 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

5 hours ago