Political News

ఎగ్జిట్‌పోల్‌: మ‌హారాష్ట్ర‌లో క‌మ‌ల వికాసం?

తాజాగా ముగిసిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు త‌ల‌కో ర‌కంగా వ‌చ్చాయి. అయితే.. మెజారిటీ సంస్థ‌లు బీజేపీకి ప‌ట్టంక‌ట్టాయి. బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి(భారీ కూట‌మి) కూట‌మికి ప‌ట్టం క‌ట్ట‌డం విశేషం. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మ‌హారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడ‌త‌లో బుధ‌వారం(న‌వంబ‌రు 20) పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌శాంతంగానే ఈ ప్ర‌క్రియ సాగిపోయింది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్.. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. మ‌రికొన్ని చోట్ల సాయంత్రం 6 వ‌ర‌కు కూడా కొన‌సాగింది.

పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన అర‌గంట త‌ర్వాత‌.. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో ఎవ‌రికి విజ‌య అవ‌కాశాలు ఉన్నాయ‌నే విష‌యంపై ప‌లు సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ స‌ర్వే వెల్ల‌డించారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ+శివ‌సేన‌(ఏక్‌నాథ్ షిండే)+ఎన్సీపీ(అజిత్ ప‌వార్‌) కూట‌మి మ‌హాయుతిగా రంగంలోకిదిగాయి. ఇక‌, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కాంగ్రెస్‌+శివ‌సేన‌(ఉద్ద‌వ్ ఠాక్రే)+ఎన్సీపీ(శ‌ర‌ద్ ప‌వార్‌) కూట‌మి మ‌హా వికాస్ అఘాడీగా బ‌రిలో నిలిచాయి. వీటితో పాటు బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న ఎంఎన్‌సీ, ఎంఐఎం వంటివి కూడా ప్ర‌భావం చూపుతున్న‌ట్టు ఎగ్జిట్ పోల్స్ స‌ర్వే వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

ఎస్ ఏఎస్ గ్రూప్‌: ఈ సంస్థ అంచ‌నాల ప్ర‌కారం మ‌హా వికాస్ అఘాడీ విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. ఈ కూట‌మి పార్టీలు మొత్తం 288 స్థానాల్లో 147-155 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కే అవ‌కాశం ఉంది. ఇక, బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి 127-135 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. మెజారిటీ మేజిక్ ఫిగ‌ర్ ప్ర‌కారం.. 288 స్థానాల్లో 145 స్థానాలు ద‌క్కించుకున్న కూట‌మి పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టనుంది. కాబ‌ట్టి ఈ స‌ర్వే ప్ర‌కారం.. మ‌హావికాస్ అఘాడీ అధికారంలోకి వ‌చ్చే ఛాన్స్ క‌నిపిస్తోంది.

పీపుల్స్ ప‌ల్స్ సర్వే: ఈ స‌ర్వే ప్ర‌కారం బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమికి 182(175 -195) సీట్లు, మ‌హావికాస్ అఘాడీ కూటమికి 97(85 -112) సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక‌, ఈ స‌ర్వే ప్ర‌కారం ఇతరులుకు 9 (7 -12) సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక‌, చాణ‌క్య స‌హా సీఎన్ ఎన్, న్యూస్ 18 వంటివి కూడా బీజేపీ కూట‌మికే మెజారిటీ అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా బీజేపీకి ఎక్కువ‌గా అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని స‌ర్వేలు చాటి చెప్పాయి.

This post was last modified on November 21, 2024 12:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

15 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

52 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago