ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది? అంటే.. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు కాబట్టి చర్చలు జరుగుతాయి… ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు జవాబిస్తారు.. అనే ఆన్సరే వస్తుంది. అయితే.. ఇది పైకి కనిపిస్తున్న విషయం మాత్రం. కానీ,సభ్యులు, స్పీకర్ చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అంతకు మించి ఏదో జరుగుతోందని అర్ధమవుతోంది. మంత్రులు ఎలా ఉన్నప్పటికీ.. సభ్యులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. మంత్రులు ఎవరూ సభలో ఉండడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరికొందరు సభ్యులు.. తాజాగా అధికారులు తమ మాట వినిపించుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో సభలో ఏం చేయాలో కూడా తమకు తెలియడం లేదని వాపోతున్నారు. ఒకరంటే అనుకోవచ్చు.. కానీ పదుల సంఖ్యలో సభలో అధికారులపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతం ఆశ్చర్యపోయేలా ఓ వ్యవహారం తెరమీదికి వచ్చింది. అధికారులు సరైన స్పూర్తితో పనిచేయడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను, అడగాల్సిన ప్రశ్నలకు కొందరు అధికారులు మండలికి బదిలీ చేశారు. దీనిని స్పీకర్ తప్పుబట్టారు. అసెంబ్లీకి కేటాయించిన అంశాలను మండలికి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటని ఆయన నిలదీశారు. ఇక, అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడికి సంబంధించిన సబ్జెక్టు విషయంలో అడగాల్సిన ప్రశ్నలను ఏకకాలంలో మండలిలోనూ ఎలా ప్రవేశ పెడతారని ఆయన నిప్పులు చెరిగారు. అంటే.. ఒక ప్రశ్నకు సభలో సమాధానం ఇస్తున్న సమయంలోనే మండలిలో అదే ప్రశ్నను సంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక మంత్రికి సంబంధించిన సబ్జెక్టు విషయంలో ఏక కాలంలో రెండు చోట్లా ప్రశ్నలు వచ్చేలా అధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ అయ్యన్న ప్రశ్నించారు. అధికారులు సభలో ఎందుకు ఉండ డం లేదో సమాధానం చెప్పాలన్నారు. అలాగే.. ప్రశ్నలను ఏ సభకు సంబంధించి ఆ సభలోనే ఎందుకు పెట్టడం లేదో చెప్పాలని నిలదీశారు. గత రెండు రోజులుగా అసెంబ్లీ వ్యవహారాల అధికారుల లోపాలను సభ్యులు బయట పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన వ్యవహారం మరింత వివాదం అయింది.
This post was last modified on November 20, 2024 5:24 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…