ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది? అంటే.. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు కాబట్టి చర్చలు జరుగుతాయి… ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు జవాబిస్తారు.. అనే ఆన్సరే వస్తుంది. అయితే.. ఇది పైకి కనిపిస్తున్న విషయం మాత్రం. కానీ,సభ్యులు, స్పీకర్ చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అంతకు మించి ఏదో జరుగుతోందని అర్ధమవుతోంది. మంత్రులు ఎలా ఉన్నప్పటికీ.. సభ్యులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. మంత్రులు ఎవరూ సభలో ఉండడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరికొందరు సభ్యులు.. తాజాగా అధికారులు తమ మాట వినిపించుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో సభలో ఏం చేయాలో కూడా తమకు తెలియడం లేదని వాపోతున్నారు. ఒకరంటే అనుకోవచ్చు.. కానీ పదుల సంఖ్యలో సభలో అధికారులపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతం ఆశ్చర్యపోయేలా ఓ వ్యవహారం తెరమీదికి వచ్చింది. అధికారులు సరైన స్పూర్తితో పనిచేయడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను, అడగాల్సిన ప్రశ్నలకు కొందరు అధికారులు మండలికి బదిలీ చేశారు. దీనిని స్పీకర్ తప్పుబట్టారు. అసెంబ్లీకి కేటాయించిన అంశాలను మండలికి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటని ఆయన నిలదీశారు. ఇక, అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడికి సంబంధించిన సబ్జెక్టు విషయంలో అడగాల్సిన ప్రశ్నలను ఏకకాలంలో మండలిలోనూ ఎలా ప్రవేశ పెడతారని ఆయన నిప్పులు చెరిగారు. అంటే.. ఒక ప్రశ్నకు సభలో సమాధానం ఇస్తున్న సమయంలోనే మండలిలో అదే ప్రశ్నను సంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక మంత్రికి సంబంధించిన సబ్జెక్టు విషయంలో ఏక కాలంలో రెండు చోట్లా ప్రశ్నలు వచ్చేలా అధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ అయ్యన్న ప్రశ్నించారు. అధికారులు సభలో ఎందుకు ఉండ డం లేదో సమాధానం చెప్పాలన్నారు. అలాగే.. ప్రశ్నలను ఏ సభకు సంబంధించి ఆ సభలోనే ఎందుకు పెట్టడం లేదో చెప్పాలని నిలదీశారు. గత రెండు రోజులుగా అసెంబ్లీ వ్యవహారాల అధికారుల లోపాలను సభ్యులు బయట పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన వ్యవహారం మరింత వివాదం అయింది.
రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…
మన హీరోల పాత రీ రిలీజులు తెలుగు రాష్ట్రాల్లో ఆడటం పెద్ద విషయం కాదు. చాలాసార్లు చూశాం. పోకిరి, ఖుషి…
నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ ఏడాది…
గత ఏడాది పెద్ది నుంచి చికిరి చికిరి వీడియో సాంగ్ విడుదల చేశాక సోషల్ మీడియా ఊగిపోయింది. మిలియన్లలో వ్యూస్,…
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…