ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది? అంటే.. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు కాబట్టి చర్చలు జరుగుతాయి… ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు జవాబిస్తారు.. అనే ఆన్సరే వస్తుంది. అయితే.. ఇది పైకి కనిపిస్తున్న విషయం మాత్రం. కానీ,సభ్యులు, స్పీకర్ చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అంతకు మించి ఏదో జరుగుతోందని అర్ధమవుతోంది. మంత్రులు ఎలా ఉన్నప్పటికీ.. సభ్యులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. మంత్రులు ఎవరూ సభలో ఉండడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరికొందరు సభ్యులు.. తాజాగా అధికారులు తమ మాట వినిపించుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో సభలో ఏం చేయాలో కూడా తమకు తెలియడం లేదని వాపోతున్నారు. ఒకరంటే అనుకోవచ్చు.. కానీ పదుల సంఖ్యలో సభలో అధికారులపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతం ఆశ్చర్యపోయేలా ఓ వ్యవహారం తెరమీదికి వచ్చింది. అధికారులు సరైన స్పూర్తితో పనిచేయడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను, అడగాల్సిన ప్రశ్నలకు కొందరు అధికారులు మండలికి బదిలీ చేశారు. దీనిని స్పీకర్ తప్పుబట్టారు. అసెంబ్లీకి కేటాయించిన అంశాలను మండలికి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటని ఆయన నిలదీశారు. ఇక, అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడికి సంబంధించిన సబ్జెక్టు విషయంలో అడగాల్సిన ప్రశ్నలను ఏకకాలంలో మండలిలోనూ ఎలా ప్రవేశ పెడతారని ఆయన నిప్పులు చెరిగారు. అంటే.. ఒక ప్రశ్నకు సభలో సమాధానం ఇస్తున్న సమయంలోనే మండలిలో అదే ప్రశ్నను సంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక మంత్రికి సంబంధించిన సబ్జెక్టు విషయంలో ఏక కాలంలో రెండు చోట్లా ప్రశ్నలు వచ్చేలా అధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ అయ్యన్న ప్రశ్నించారు. అధికారులు సభలో ఎందుకు ఉండ డం లేదో సమాధానం చెప్పాలన్నారు. అలాగే.. ప్రశ్నలను ఏ సభకు సంబంధించి ఆ సభలోనే ఎందుకు పెట్టడం లేదో చెప్పాలని నిలదీశారు. గత రెండు రోజులుగా అసెంబ్లీ వ్యవహారాల అధికారుల లోపాలను సభ్యులు బయట పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన వ్యవహారం మరింత వివాదం అయింది.
This post was last modified on November 20, 2024 5:24 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…