ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది? అంటే.. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు కాబట్టి చర్చలు జరుగుతాయి… ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు జవాబిస్తారు.. అనే ఆన్సరే వస్తుంది. అయితే.. ఇది పైకి కనిపిస్తున్న విషయం మాత్రం. కానీ,సభ్యులు, స్పీకర్ చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అంతకు మించి ఏదో జరుగుతోందని అర్ధమవుతోంది. మంత్రులు ఎలా ఉన్నప్పటికీ.. సభ్యులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. మంత్రులు ఎవరూ సభలో ఉండడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరికొందరు సభ్యులు.. తాజాగా అధికారులు తమ మాట వినిపించుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో సభలో ఏం చేయాలో కూడా తమకు తెలియడం లేదని వాపోతున్నారు. ఒకరంటే అనుకోవచ్చు.. కానీ పదుల సంఖ్యలో సభలో అధికారులపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతం ఆశ్చర్యపోయేలా ఓ వ్యవహారం తెరమీదికి వచ్చింది. అధికారులు సరైన స్పూర్తితో పనిచేయడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను, అడగాల్సిన ప్రశ్నలకు కొందరు అధికారులు మండలికి బదిలీ చేశారు. దీనిని స్పీకర్ తప్పుబట్టారు. అసెంబ్లీకి కేటాయించిన అంశాలను మండలికి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటని ఆయన నిలదీశారు. ఇక, అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడికి సంబంధించిన సబ్జెక్టు విషయంలో అడగాల్సిన ప్రశ్నలను ఏకకాలంలో మండలిలోనూ ఎలా ప్రవేశ పెడతారని ఆయన నిప్పులు చెరిగారు. అంటే.. ఒక ప్రశ్నకు సభలో సమాధానం ఇస్తున్న సమయంలోనే మండలిలో అదే ప్రశ్నను సంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక మంత్రికి సంబంధించిన సబ్జెక్టు విషయంలో ఏక కాలంలో రెండు చోట్లా ప్రశ్నలు వచ్చేలా అధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ అయ్యన్న ప్రశ్నించారు. అధికారులు సభలో ఎందుకు ఉండ డం లేదో సమాధానం చెప్పాలన్నారు. అలాగే.. ప్రశ్నలను ఏ సభకు సంబంధించి ఆ సభలోనే ఎందుకు పెట్టడం లేదో చెప్పాలని నిలదీశారు. గత రెండు రోజులుగా అసెంబ్లీ వ్యవహారాల అధికారుల లోపాలను సభ్యులు బయట పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన వ్యవహారం మరింత వివాదం అయింది.
This post was last modified on November 20, 2024 5:24 pm
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…