సామాజిక వర్గాల బలం లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాకో విధంగా సామాజిక వర్గాలు ప్రభావం చూపిస్తున్నాయి. ఇలానే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి అండగా ఉండే సామాజికవర్గాల్లో కాళింగ వర్గం ఒకటి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో వీరంతా టీడీపీవైపే నిలబడ్డారు. దీంతో శ్రీకాకుళం సహా విజయనగరంలోని కొన్ని ప్రభావిత నియోజకవర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది.
అయితే.. ఇంత జరిగినా.. తమకు ప్రాధాన్యం దక్కడం లేదని కాళింగ సామాజిక వర్గంనాయకులు ఆవేదన, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ, దక్కకపోగా ఇతర కీలక పదవులు కూడా వారిని వరించలేదు. దీంతో వారంతా ఇప్పుడుచంద్రబాబుపై పట్టరాని ఆగ్రహంతో నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు కాళింగులు ఒక్కటయ్యారు.
కేసులు పెట్టించుకున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో కూటమి సర్కారుకు ఉత్తరాంధ్రలో మంచి మెజారిటీ వచ్చింది. అయితే.. ఇలా పనిచేసిన కళింగులు అధికారంలోకి వచ్చాక అవకాశాలు రాకపోవడంతో ఆ సామాజికవర్గంలో అసంతృప్తి రేగుతోంది. ముఖ్యంగా టీడీపీలో యువజన విభాగం నుంచి పనిచేస్తూ వచ్చిన రవికుమార్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
ఆమదాలవలస నియోజకవర్గంలో ఈ ఏడాదివిజయం దక్కించుకున్నారు. దీంతో ఆయన మంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు.కానీ, దక్కలేదు. పోనీ.. తన వారికి నామినేటెడ్ అయినా ఇప్పించుకుందామని భావించారు. అది కూడా దక్కలేదు. దీంతో నియోజకవర్గంలో కూన ప్రభావం తగ్గుతోందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో విప్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అది కూడా దక్కలేదు. ఈ పరిణామం కూన వర్గాన్నే కాకుండా.. కాళింగ సామాజిక వర్గంలోనూ ఆగ్రహం తెప్పించడంగమనార్హం. మరి ఇప్పటికైనా చంద్రబాబు వీరిని సంతృప్తి పరుస్తారేమో చూడాలి.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…