సామాజిక వర్గాల బలం లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాకో విధంగా సామాజిక వర్గాలు ప్రభావం చూపిస్తున్నాయి. ఇలానే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి అండగా ఉండే సామాజికవర్గాల్లో కాళింగ వర్గం ఒకటి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో వీరంతా టీడీపీవైపే నిలబడ్డారు. దీంతో శ్రీకాకుళం సహా విజయనగరంలోని కొన్ని ప్రభావిత నియోజకవర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది.
అయితే.. ఇంత జరిగినా.. తమకు ప్రాధాన్యం దక్కడం లేదని కాళింగ సామాజిక వర్గంనాయకులు ఆవేదన, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ, దక్కకపోగా ఇతర కీలక పదవులు కూడా వారిని వరించలేదు. దీంతో వారంతా ఇప్పుడుచంద్రబాబుపై పట్టరాని ఆగ్రహంతో నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు కాళింగులు ఒక్కటయ్యారు.
కేసులు పెట్టించుకున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో కూటమి సర్కారుకు ఉత్తరాంధ్రలో మంచి మెజారిటీ వచ్చింది. అయితే.. ఇలా పనిచేసిన కళింగులు అధికారంలోకి వచ్చాక అవకాశాలు రాకపోవడంతో ఆ సామాజికవర్గంలో అసంతృప్తి రేగుతోంది. ముఖ్యంగా టీడీపీలో యువజన విభాగం నుంచి పనిచేస్తూ వచ్చిన రవికుమార్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
ఆమదాలవలస నియోజకవర్గంలో ఈ ఏడాదివిజయం దక్కించుకున్నారు. దీంతో ఆయన మంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు.కానీ, దక్కలేదు. పోనీ.. తన వారికి నామినేటెడ్ అయినా ఇప్పించుకుందామని భావించారు. అది కూడా దక్కలేదు. దీంతో నియోజకవర్గంలో కూన ప్రభావం తగ్గుతోందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో విప్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అది కూడా దక్కలేదు. ఈ పరిణామం కూన వర్గాన్నే కాకుండా.. కాళింగ సామాజిక వర్గంలోనూ ఆగ్రహం తెప్పించడంగమనార్హం. మరి ఇప్పటికైనా చంద్రబాబు వీరిని సంతృప్తి పరుస్తారేమో చూడాలి.
This post was last modified on November 20, 2024 11:44 am
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…