సామాజిక వర్గాల బలం లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాకో విధంగా సామాజిక వర్గాలు ప్రభావం చూపిస్తున్నాయి. ఇలానే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి అండగా ఉండే సామాజికవర్గాల్లో కాళింగ వర్గం ఒకటి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో వీరంతా టీడీపీవైపే నిలబడ్డారు. దీంతో శ్రీకాకుళం సహా విజయనగరంలోని కొన్ని ప్రభావిత నియోజకవర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది.
అయితే.. ఇంత జరిగినా.. తమకు ప్రాధాన్యం దక్కడం లేదని కాళింగ సామాజిక వర్గంనాయకులు ఆవేదన, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ, దక్కకపోగా ఇతర కీలక పదవులు కూడా వారిని వరించలేదు. దీంతో వారంతా ఇప్పుడుచంద్రబాబుపై పట్టరాని ఆగ్రహంతో నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు కాళింగులు ఒక్కటయ్యారు.
కేసులు పెట్టించుకున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో కూటమి సర్కారుకు ఉత్తరాంధ్రలో మంచి మెజారిటీ వచ్చింది. అయితే.. ఇలా పనిచేసిన కళింగులు అధికారంలోకి వచ్చాక అవకాశాలు రాకపోవడంతో ఆ సామాజికవర్గంలో అసంతృప్తి రేగుతోంది. ముఖ్యంగా టీడీపీలో యువజన విభాగం నుంచి పనిచేస్తూ వచ్చిన రవికుమార్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
ఆమదాలవలస నియోజకవర్గంలో ఈ ఏడాదివిజయం దక్కించుకున్నారు. దీంతో ఆయన మంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు.కానీ, దక్కలేదు. పోనీ.. తన వారికి నామినేటెడ్ అయినా ఇప్పించుకుందామని భావించారు. అది కూడా దక్కలేదు. దీంతో నియోజకవర్గంలో కూన ప్రభావం తగ్గుతోందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో విప్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అది కూడా దక్కలేదు. ఈ పరిణామం కూన వర్గాన్నే కాకుండా.. కాళింగ సామాజిక వర్గంలోనూ ఆగ్రహం తెప్పించడంగమనార్హం. మరి ఇప్పటికైనా చంద్రబాబు వీరిని సంతృప్తి పరుస్తారేమో చూడాలి.
This post was last modified on November 20, 2024 11:44 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…