సామాజిక వర్గాల బలం లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాకో విధంగా సామాజిక వర్గాలు ప్రభావం చూపిస్తున్నాయి. ఇలానే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి అండగా ఉండే సామాజికవర్గాల్లో కాళింగ వర్గం ఒకటి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో వీరంతా టీడీపీవైపే నిలబడ్డారు. దీంతో శ్రీకాకుళం సహా విజయనగరంలోని కొన్ని ప్రభావిత నియోజకవర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది.
అయితే.. ఇంత జరిగినా.. తమకు ప్రాధాన్యం దక్కడం లేదని కాళింగ సామాజిక వర్గంనాయకులు ఆవేదన, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ, దక్కకపోగా ఇతర కీలక పదవులు కూడా వారిని వరించలేదు. దీంతో వారంతా ఇప్పుడుచంద్రబాబుపై పట్టరాని ఆగ్రహంతో నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు కాళింగులు ఒక్కటయ్యారు.
కేసులు పెట్టించుకున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో కూటమి సర్కారుకు ఉత్తరాంధ్రలో మంచి మెజారిటీ వచ్చింది. అయితే.. ఇలా పనిచేసిన కళింగులు అధికారంలోకి వచ్చాక అవకాశాలు రాకపోవడంతో ఆ సామాజికవర్గంలో అసంతృప్తి రేగుతోంది. ముఖ్యంగా టీడీపీలో యువజన విభాగం నుంచి పనిచేస్తూ వచ్చిన రవికుమార్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
ఆమదాలవలస నియోజకవర్గంలో ఈ ఏడాదివిజయం దక్కించుకున్నారు. దీంతో ఆయన మంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు.కానీ, దక్కలేదు. పోనీ.. తన వారికి నామినేటెడ్ అయినా ఇప్పించుకుందామని భావించారు. అది కూడా దక్కలేదు. దీంతో నియోజకవర్గంలో కూన ప్రభావం తగ్గుతోందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో విప్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అది కూడా దక్కలేదు. ఈ పరిణామం కూన వర్గాన్నే కాకుండా.. కాళింగ సామాజిక వర్గంలోనూ ఆగ్రహం తెప్పించడంగమనార్హం. మరి ఇప్పటికైనా చంద్రబాబు వీరిని సంతృప్తి పరుస్తారేమో చూడాలి.
This post was last modified on November 20, 2024 11:44 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…