వైసీపీ హయాంలో ఏపీలో కొత్త రోడ్లు వేయడం సంగతి పక్కన పెడితే రోడ్లపై ఉన్న గుంతలను సైతం పూడ్చ లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకుగాను నిధులు కూడా మంజూరు చేయడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోడ్ల నిర్వహణపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన చేశారు.
రహదారుల నిర్వహణపై వినూత్న ఆలోచనలకు తెర తీశామని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ అప్పగిస్తే ఎలా ఉంటుంది అని యోచిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు రోడ్ల నిర్వహణ అప్పగించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
గ్రామం నుంచి మండల కేంద్రానికి ఎక్కడ టోల్ చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. మిగిలిన చోట్ల మాత్రమే టోల్ ఉంటుందని చెప్పారు. అది కూడా బస్సులు, కార్లు, లారీలకు మాత్రమే యూజర్ చార్జీలు వసూలు చేస్తామని, ఆటోలు, ట్రాక్టర్లు, బైకులకు టోల్ చార్జీలు ఉండవని చంద్రబాబు క్లారిటీనిచ్చారు.
అయితే, దీనిపై ఎమ్మెల్యేలు కూడా తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని…ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే పనులు ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని చెప్పారు. అలా కాదు గుంతల రోడ్లపైనే తిరుగుదాం అంటే తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంతల రోడ్లపై తిరిగినా పర్వాలేదు…అని కొందరు అంటారని, ఈ విధానంపై విమర్శలు వస్తాయని చెప్పారు. డబ్బులు లేకపోయినా మాకు తెలీదు..అన్నీ నువ్వే చేయాలి…అంటారని.., అయితే, తన దగ్గర మంత్రదండం లేదని, తెలివితేటలున్నాయని, వినూత్న ఆలోచనలతో ముందుకు పోదామని చెప్పారు.
ఐదేళ్లలో రాష్ట్రంలోని పలు రహదారులపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయని, వాటి మరమ్మతులకు 850 కోట్ల రూపాయలను అల్రెడీ కేటాయించామని చెప్పారు. ఆ పనులు ఓ పక్కన జరుగుతూనే ఉన్నాయని అన్నారు. 2025 జనవరి నాటికి ఏపీలో పండగల సందర్భంగా ప్రజలు ఇక్కడికి వచ్చే సమయానికి మెరుగైన రహదారులు కనిపించాలని ఉద్దేశంతో పనులు శరవేగంగా పూర్తి చేయదలుచుకున్నామని అన్నారు. అయితే మన దగ్గర డబ్బులు లేవని, ఆలోచనలు మాత్రమే ఉన్నాయని, ఒక ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్ని మారుస్తుందని చంద్రబాబు చెప్పారు.
This post was last modified on November 19, 2024 10:30 pm
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…