వైసీపీ హయాంలో ఏపీలో కొత్త రోడ్లు వేయడం సంగతి పక్కన పెడితే రోడ్లపై ఉన్న గుంతలను సైతం పూడ్చ లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకుగాను నిధులు కూడా మంజూరు చేయడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోడ్ల నిర్వహణపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన చేశారు.
రహదారుల నిర్వహణపై వినూత్న ఆలోచనలకు తెర తీశామని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ అప్పగిస్తే ఎలా ఉంటుంది అని యోచిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు రోడ్ల నిర్వహణ అప్పగించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
గ్రామం నుంచి మండల కేంద్రానికి ఎక్కడ టోల్ చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. మిగిలిన చోట్ల మాత్రమే టోల్ ఉంటుందని చెప్పారు. అది కూడా బస్సులు, కార్లు, లారీలకు మాత్రమే యూజర్ చార్జీలు వసూలు చేస్తామని, ఆటోలు, ట్రాక్టర్లు, బైకులకు టోల్ చార్జీలు ఉండవని చంద్రబాబు క్లారిటీనిచ్చారు.
అయితే, దీనిపై ఎమ్మెల్యేలు కూడా తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని…ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే పనులు ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని చెప్పారు. అలా కాదు గుంతల రోడ్లపైనే తిరుగుదాం అంటే తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంతల రోడ్లపై తిరిగినా పర్వాలేదు…అని కొందరు అంటారని, ఈ విధానంపై విమర్శలు వస్తాయని చెప్పారు. డబ్బులు లేకపోయినా మాకు తెలీదు..అన్నీ నువ్వే చేయాలి…అంటారని.., అయితే, తన దగ్గర మంత్రదండం లేదని, తెలివితేటలున్నాయని, వినూత్న ఆలోచనలతో ముందుకు పోదామని చెప్పారు.
ఐదేళ్లలో రాష్ట్రంలోని పలు రహదారులపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయని, వాటి మరమ్మతులకు 850 కోట్ల రూపాయలను అల్రెడీ కేటాయించామని చెప్పారు. ఆ పనులు ఓ పక్కన జరుగుతూనే ఉన్నాయని అన్నారు. 2025 జనవరి నాటికి ఏపీలో పండగల సందర్భంగా ప్రజలు ఇక్కడికి వచ్చే సమయానికి మెరుగైన రహదారులు కనిపించాలని ఉద్దేశంతో పనులు శరవేగంగా పూర్తి చేయదలుచుకున్నామని అన్నారు. అయితే మన దగ్గర డబ్బులు లేవని, ఆలోచనలు మాత్రమే ఉన్నాయని, ఒక ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్ని మారుస్తుందని చంద్రబాబు చెప్పారు.
This post was last modified on November 19, 2024 10:30 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…