Political News

డబ్బులు లేవుగానీ ఆలోచనలు వున్నాయి

వైసీపీ హయాంలో ఏపీలో కొత్త రోడ్లు వేయడం సంగతి పక్కన పెడితే రోడ్లపై ఉన్న గుంతలను సైతం పూడ్చ లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకుగాను నిధులు కూడా మంజూరు చేయడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోడ్ల నిర్వహణపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన చేశారు.

రహదారుల నిర్వహణపై వినూత్న ఆలోచనలకు తెర తీశామని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ అప్పగిస్తే ఎలా ఉంటుంది అని యోచిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు రోడ్ల నిర్వహణ అప్పగించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.

గ్రామం నుంచి మండల కేంద్రానికి ఎక్కడ టోల్ చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. మిగిలిన చోట్ల మాత్రమే టోల్ ఉంటుందని చెప్పారు. అది కూడా బస్సులు, కార్లు, లారీలకు మాత్రమే యూజర్ చార్జీలు వసూలు చేస్తామని, ఆటోలు, ట్రాక్టర్లు, బైకులకు టోల్ చార్జీలు ఉండవని చంద్రబాబు క్లారిటీనిచ్చారు.

అయితే, దీనిపై ఎమ్మెల్యేలు కూడా తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని…ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే పనులు ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని చెప్పారు. అలా కాదు గుంతల రోడ్లపైనే తిరుగుదాం అంటే తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంతల రోడ్లపై తిరిగినా పర్వాలేదు…అని కొందరు అంటారని, ఈ విధానంపై విమర్శలు వస్తాయని చెప్పారు. డబ్బులు లేకపోయినా మాకు తెలీదు..అన్నీ నువ్వే చేయాలి…అంటారని.., అయితే, తన దగ్గర మంత్రదండం లేదని, తెలివితేటలున్నాయని, వినూత్న ఆలోచనలతో ముందుకు పోదామని చెప్పారు.

ఐదేళ్లలో రాష్ట్రంలోని పలు రహదారులపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయని, వాటి మరమ్మతులకు 850 కోట్ల రూపాయలను అల్రెడీ కేటాయించామని చెప్పారు. ఆ పనులు ఓ పక్కన జరుగుతూనే ఉన్నాయని అన్నారు. 2025 జనవరి నాటికి ఏపీలో పండగల సందర్భంగా ప్రజలు ఇక్కడికి వచ్చే సమయానికి మెరుగైన రహదారులు కనిపించాలని ఉద్దేశంతో పనులు శరవేగంగా పూర్తి చేయదలుచుకున్నామని అన్నారు. అయితే మన దగ్గర డబ్బులు లేవని, ఆలోచనలు మాత్రమే ఉన్నాయని, ఒక ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్ని మారుస్తుందని చంద్రబాబు చెప్పారు.

This post was last modified on November 19, 2024 10:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

28 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago