Political News

మిస్సింగ్ కేసుల రచ్చ పై పవన్ స్పందన

ఏపీలో 30 వేల మంది మహిళల మిస్సింగ్ వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. ఏపీలో 30 వేలకు పైగా మహిళలు మిస్సయితే వైసీపీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని, కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదని పవన్ విమర్శలు గుప్పించారు. అయితే, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తామని మాటిచ్చామని, అన్న మాట ప్రకారమే మార్పు తెచ్చామని పవన్ చెప్పారు.

ఎన్టీఆర్ జిల్లాలో 18 మంది మహిళలు, అమ్మాయిల మిస్సింగ్ కేసులను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు పరిష్కరించారని పవన్ చెప్పారు. విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసుల పనితీరు పట్ల గర్వంగా ఉందన్నారు. హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో సమర్థవంతంగా పనిచేస్తున్న హోం శాఖకు, టాస్క్ ఫోర్స్ పోలీసులను పవన్ అభినందించారు. సమాజంతోపాటు సోషల్ మీడియాలోనూ మహిళల రక్షణ కోసం పోలీసు డిపార్ట్ మెంట్ కు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని తమ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని పవన్ చెప్పారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యర పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. గ్రామాలు, పట్టణాలు మరింత సురక్షితంగా ఉండేందుకు రాష్ట్ర పౌరులు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.

వైసీపీ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని తనకు కేంద్ర నిఘా వర్గాలు సమాచారమిచ్చాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, 2019-24 మధ్య ఏపీలో మహిళల మిస్సింగ్ కేసులు 44685 మంది కాగా, వాటిలో 44022 మహిళలను వెతికి పట్టుకున్నారని లోక్ సభలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

ఈ క్రమంలోనే పవన్ చేసిన 30 వేల మంది మిస్సింగ్ కామెంట్లు అవాస్తవమని పవన్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు కౌంటర్ గా పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా 30వేల మంది మహిళల మిస్సింగ్ కేసులపై ఈ విధంగా స్పందించారు. మరి, పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on November 19, 2024 5:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

29 minutes ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

4 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

5 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

7 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

7 hours ago