Political News

మిస్సింగ్ కేసుల రచ్చ పై పవన్ స్పందన

ఏపీలో 30 వేల మంది మహిళల మిస్సింగ్ వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. ఏపీలో 30 వేలకు పైగా మహిళలు మిస్సయితే వైసీపీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని, కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదని పవన్ విమర్శలు గుప్పించారు. అయితే, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తామని మాటిచ్చామని, అన్న మాట ప్రకారమే మార్పు తెచ్చామని పవన్ చెప్పారు.

ఎన్టీఆర్ జిల్లాలో 18 మంది మహిళలు, అమ్మాయిల మిస్సింగ్ కేసులను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు పరిష్కరించారని పవన్ చెప్పారు. విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసుల పనితీరు పట్ల గర్వంగా ఉందన్నారు. హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో సమర్థవంతంగా పనిచేస్తున్న హోం శాఖకు, టాస్క్ ఫోర్స్ పోలీసులను పవన్ అభినందించారు. సమాజంతోపాటు సోషల్ మీడియాలోనూ మహిళల రక్షణ కోసం పోలీసు డిపార్ట్ మెంట్ కు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని తమ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని పవన్ చెప్పారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యర పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. గ్రామాలు, పట్టణాలు మరింత సురక్షితంగా ఉండేందుకు రాష్ట్ర పౌరులు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.

వైసీపీ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని తనకు కేంద్ర నిఘా వర్గాలు సమాచారమిచ్చాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, 2019-24 మధ్య ఏపీలో మహిళల మిస్సింగ్ కేసులు 44685 మంది కాగా, వాటిలో 44022 మహిళలను వెతికి పట్టుకున్నారని లోక్ సభలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

ఈ క్రమంలోనే పవన్ చేసిన 30 వేల మంది మిస్సింగ్ కామెంట్లు అవాస్తవమని పవన్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు కౌంటర్ గా పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా 30వేల మంది మహిళల మిస్సింగ్ కేసులపై ఈ విధంగా స్పందించారు. మరి, పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on November 19, 2024 5:32 pm

Share

Recent Posts

అఖిల్ కొడుకుతో సిసింద్రీ-2

‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు…

1 minute ago

మోడీకి క‌ళ్లు చెదిరేలా స్వాగ‌త ఏర్పాట్లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మ‌రో వారంలో ఏపీకి రానున్నారు. ఆగ‌స్టు 1వ తేదీన ఆయ‌న విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురానికి…

8 minutes ago

రాళ్లను మెట్లుగా మార్చి.. అదే మోదీ ప్రత్యేకత..!

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అర్థరాత్రి సెల్ఫీ…

2 hours ago

స్టీవెన్ శంకర్ ప్రేమ బాగానే కనెక్టయ్యింది

తాజాగా విడుదలైన చెన్నై లవ్ స్టోరీకి ఆశించిన ఓపెనింగ్ దక్కింది. టాక్ పరంగా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఒకసారి…

2 hours ago

తండ్రి ఫ్లాప్ కొడుక్కు కలిసి వస్తుందా

బాక్సాఫీస్ వద్ద జన నాయకుడు ఫలితం ఏమిటో రెండో రోజులకే క్లారిటీ వచ్చేసింది. తమిళనాడులో వసూళ్లు బాగున్నాయి కానీ అవి…

3 hours ago

సీఎం సినిమా తడబడుతుంది

అసలే తెలుగు నుంచి తమిళంలోకి రీమేక్ అయిన సినిమా. పైగా విడుదల చాలా ఆలస్యం అయింది. మధ్యలో సినిమా ఆన్…

4 hours ago