ఏపీలో 30 వేల మంది మహిళల మిస్సింగ్ వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. ఏపీలో 30 వేలకు పైగా మహిళలు మిస్సయితే వైసీపీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని, కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదని పవన్ విమర్శలు గుప్పించారు. అయితే, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తామని మాటిచ్చామని, అన్న మాట ప్రకారమే మార్పు తెచ్చామని పవన్ చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లాలో 18 మంది మహిళలు, అమ్మాయిల మిస్సింగ్ కేసులను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు పరిష్కరించారని పవన్ చెప్పారు. విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసుల పనితీరు పట్ల గర్వంగా ఉందన్నారు. హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో సమర్థవంతంగా పనిచేస్తున్న హోం శాఖకు, టాస్క్ ఫోర్స్ పోలీసులను పవన్ అభినందించారు. సమాజంతోపాటు సోషల్ మీడియాలోనూ మహిళల రక్షణ కోసం పోలీసు డిపార్ట్ మెంట్ కు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని తమ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని పవన్ చెప్పారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యర పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. గ్రామాలు, పట్టణాలు మరింత సురక్షితంగా ఉండేందుకు రాష్ట్ర పౌరులు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.
వైసీపీ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని తనకు కేంద్ర నిఘా వర్గాలు సమాచారమిచ్చాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, 2019-24 మధ్య ఏపీలో మహిళల మిస్సింగ్ కేసులు 44685 మంది కాగా, వాటిలో 44022 మహిళలను వెతికి పట్టుకున్నారని లోక్ సభలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
ఈ క్రమంలోనే పవన్ చేసిన 30 వేల మంది మిస్సింగ్ కామెంట్లు అవాస్తవమని పవన్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు కౌంటర్ గా పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా 30వేల మంది మహిళల మిస్సింగ్ కేసులపై ఈ విధంగా స్పందించారు. మరి, పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on November 19, 2024 5:32 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…