ఏపీలో 30 వేల మంది మహిళల మిస్సింగ్ వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. ఏపీలో 30 వేలకు పైగా మహిళలు మిస్సయితే వైసీపీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని, కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదని పవన్ విమర్శలు గుప్పించారు. అయితే, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తామని మాటిచ్చామని, అన్న మాట ప్రకారమే మార్పు తెచ్చామని పవన్ చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లాలో 18 మంది మహిళలు, అమ్మాయిల మిస్సింగ్ కేసులను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు పరిష్కరించారని పవన్ చెప్పారు. విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసుల పనితీరు పట్ల గర్వంగా ఉందన్నారు. హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో సమర్థవంతంగా పనిచేస్తున్న హోం శాఖకు, టాస్క్ ఫోర్స్ పోలీసులను పవన్ అభినందించారు. సమాజంతోపాటు సోషల్ మీడియాలోనూ మహిళల రక్షణ కోసం పోలీసు డిపార్ట్ మెంట్ కు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని తమ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని పవన్ చెప్పారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యర పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. గ్రామాలు, పట్టణాలు మరింత సురక్షితంగా ఉండేందుకు రాష్ట్ర పౌరులు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.
వైసీపీ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని తనకు కేంద్ర నిఘా వర్గాలు సమాచారమిచ్చాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, 2019-24 మధ్య ఏపీలో మహిళల మిస్సింగ్ కేసులు 44685 మంది కాగా, వాటిలో 44022 మహిళలను వెతికి పట్టుకున్నారని లోక్ సభలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
ఈ క్రమంలోనే పవన్ చేసిన 30 వేల మంది మిస్సింగ్ కామెంట్లు అవాస్తవమని పవన్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు కౌంటర్ గా పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా 30వేల మంది మహిళల మిస్సింగ్ కేసులపై ఈ విధంగా స్పందించారు. మరి, పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on November 19, 2024 5:32 pm
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…