Political News

శాస‌న మండ‌లిలో ‘రుషికొండ ప్యాల‌స్’ ర‌చ్చ‌

ఏపీ శాస‌న మండ‌లి బ‌డ్జెట్‌ స‌మావేశాల్లో మంగ‌ళ‌వారం ప‌లు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే.. ప్ర‌ధానంగా వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌పై నిర్మించిన ప్యాలెస్ వివాదం ర‌చ్చ‌గా మారింది. ఇటు ప్ర‌భుత్వం ప‌క్షాన ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్‌.. మరో మంత్రి అచ్చెన్నాయుడు ప్యాలెస్ నిర్మాణం విష‌యంపై నిప్పులు చెరిగారు. ఇదేస‌మ‌యంలో అటువైపు వైసీపీ స‌భ్యులు ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చ‌ను నిర‌సిస్తూ.. స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు.

మండ‌లిలో స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఒక‌రు.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణాన్ని ఏం చేయ‌బోతున్నార‌న్న ప్ర‌శ్న‌కు ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. “రుషికొండ ప్యాలెస్ విష‌యంలో వైసీపీ అంద‌రినీ మోసం చేసింది. ఇక్క‌డ రిసార్టులు క‌డుతున్నామ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి.. ఏడు బ్లాకులుగా విభ‌జించి ప్ర‌జాధ‌నంతోప్యాలెస్‌ను నిర్మించింది. అద్భుత‌మైన ప్ర‌పంచ స్థాయి రిసార్టు క‌డుతున్నామ‌ని చెప్పి ముఖ్య‌మంత్రి కోసం ప్యాలెస్ నిర్మించ‌డం ప్ర‌జాధ‌నం దుర్వినియోగం కాదా?” అని దుర్గేష్ నిల‌దీశారు.

దీనిని ఇప్పుడు ఏం చేయాల‌న్న దానిపై అంద‌రితోనూ చ‌ర్చిస్తున్న‌ట్టు మంత్రి కందుల తెలిపారు. ప్యాలెస్ నిర్మించిన వైసీపీ స్థానికంగా ఉన్న‌.. రిసార్టుల‌ను ఆదాయానికి దూరం చేసింద‌న్నారు. హ‌రిత రిసార్ట్ ఒక‌ప్పుడు మంచి ఆదాయంలో ఉండేద‌ని.. కానీ వైసీపీ హ‌యాంలో అప్పులు చేయాల్సిన ప‌రిస్థితికి దిగ‌జార్చార‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మ‌రో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని.. ప్ర‌జ‌ల‌ను మోస‌గించిన వారిపై కేసులు పెట్టాల‌ని అన్నారు.

రుషి కొండ నిర్మాణాల‌ను చూస్తే.. నోరు వెళ్ల‌బెట్టాల్సిందేన‌ని అచ్చెన్న వ్యాఖ్యానించారు. ఒక‌వైపు అప్పులు చేస్తూ..రాష్ట్రాన్ని దివాలా తీయించిన అప్ప‌టి ముఖ్య‌మంత్రి.. రుషికొండ‌ను ధ్వంసం చేశార‌ని, క‌నీసంఅక్క‌డ ఏం జ‌రుగుతోందో చూసేందుకు కూడా ఎవ‌రినీ అనుమ‌తించ‌లేద‌న్నారు. వైసీపీ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా రుషి కొండ‌పై ఏం జ‌రుగుతోందో చూసేందుకు అనుమ‌తి ఇచ్చి ఉండ‌ర‌ని వ్యాఖ్యానించారు. క‌ళ్ల ముందే ఇంత దోపిడీ జ‌రిగితే చూస్తూ ఊరుకోవాలా? అని నిల‌దీశారు.

This post was last modified on November 19, 2024 1:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

25 minutes ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

1 hour ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

1 hour ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

2 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

2 hours ago

మే 1 కోసం కొత్త సినిమాల కొట్లాట

ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…

4 hours ago