Political News

శాస‌న మండ‌లిలో ‘రుషికొండ ప్యాల‌స్’ ర‌చ్చ‌

ఏపీ శాస‌న మండ‌లి బ‌డ్జెట్‌ స‌మావేశాల్లో మంగ‌ళ‌వారం ప‌లు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే.. ప్ర‌ధానంగా వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌పై నిర్మించిన ప్యాలెస్ వివాదం ర‌చ్చ‌గా మారింది. ఇటు ప్ర‌భుత్వం ప‌క్షాన ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్‌.. మరో మంత్రి అచ్చెన్నాయుడు ప్యాలెస్ నిర్మాణం విష‌యంపై నిప్పులు చెరిగారు. ఇదేస‌మ‌యంలో అటువైపు వైసీపీ స‌భ్యులు ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చ‌ను నిర‌సిస్తూ.. స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు.

మండ‌లిలో స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఒక‌రు.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణాన్ని ఏం చేయ‌బోతున్నార‌న్న ప్ర‌శ్న‌కు ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. “రుషికొండ ప్యాలెస్ విష‌యంలో వైసీపీ అంద‌రినీ మోసం చేసింది. ఇక్క‌డ రిసార్టులు క‌డుతున్నామ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి.. ఏడు బ్లాకులుగా విభ‌జించి ప్ర‌జాధ‌నంతోప్యాలెస్‌ను నిర్మించింది. అద్భుత‌మైన ప్ర‌పంచ స్థాయి రిసార్టు క‌డుతున్నామ‌ని చెప్పి ముఖ్య‌మంత్రి కోసం ప్యాలెస్ నిర్మించ‌డం ప్ర‌జాధ‌నం దుర్వినియోగం కాదా?” అని దుర్గేష్ నిల‌దీశారు.

దీనిని ఇప్పుడు ఏం చేయాల‌న్న దానిపై అంద‌రితోనూ చ‌ర్చిస్తున్న‌ట్టు మంత్రి కందుల తెలిపారు. ప్యాలెస్ నిర్మించిన వైసీపీ స్థానికంగా ఉన్న‌.. రిసార్టుల‌ను ఆదాయానికి దూరం చేసింద‌న్నారు. హ‌రిత రిసార్ట్ ఒక‌ప్పుడు మంచి ఆదాయంలో ఉండేద‌ని.. కానీ వైసీపీ హ‌యాంలో అప్పులు చేయాల్సిన ప‌రిస్థితికి దిగ‌జార్చార‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మ‌రో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని.. ప్ర‌జ‌ల‌ను మోస‌గించిన వారిపై కేసులు పెట్టాల‌ని అన్నారు.

రుషి కొండ నిర్మాణాల‌ను చూస్తే.. నోరు వెళ్ల‌బెట్టాల్సిందేన‌ని అచ్చెన్న వ్యాఖ్యానించారు. ఒక‌వైపు అప్పులు చేస్తూ..రాష్ట్రాన్ని దివాలా తీయించిన అప్ప‌టి ముఖ్య‌మంత్రి.. రుషికొండ‌ను ధ్వంసం చేశార‌ని, క‌నీసంఅక్క‌డ ఏం జ‌రుగుతోందో చూసేందుకు కూడా ఎవ‌రినీ అనుమ‌తించ‌లేద‌న్నారు. వైసీపీ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా రుషి కొండ‌పై ఏం జ‌రుగుతోందో చూసేందుకు అనుమ‌తి ఇచ్చి ఉండ‌ర‌ని వ్యాఖ్యానించారు. క‌ళ్ల ముందే ఇంత దోపిడీ జ‌రిగితే చూస్తూ ఊరుకోవాలా? అని నిల‌దీశారు.

This post was last modified on November 19, 2024 1:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

1 hour ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

2 hours ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

4 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

4 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

5 hours ago

డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…

5 hours ago