ప్రజాయుద్ధ నౌక.. ప్రముఖ గాయకుడు గద్దర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇచ్చింది. గద్దర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెలను నామినేటెడ్ పోస్టులో నియమించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్గా వెన్నెలను నియమిస్తూ.. సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, వర్కు షాపులు, అభివృద్ది, సంక్షేమ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి వేదిక ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తారు. దీనికి వెన్నెల సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా గద్దర్ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. 2023లో జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ అసెంబ్లీ టికెట్ను వెన్నెలకు కేటాయించింది. అయితే.. ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత.. కూడా ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నించారు.
కానీ, పార్టీలోనే సంఖ్యాబలం ఉండడంతో అవకాశం లభించలేదు. ఇక, ఇప్పుడు వెన్నెలకు మరో రూపంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదవిని ఇవ్వడం గమనార్హం. ప్రజా గాయకుడిగా.. గుర్తింపు పొందిన గద్దర్ కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి కూడా యాక్టివిస్టుగా పనిచేసిన గద్దర్.. అనేక ఉద్యమాలలో పాలు పంచుకున్నా రు. పలు సందర్భాల్లో జైలుకు కూడా వెళ్లారు. అయితే.. ఎక్కడా దారి తప్పకుండా తాను ఎంచుకున్న ప్రజాబాటలోనే గద్దర్ ప్రయాణం ముందుకు సాగింది.
ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్నగద్దర్.. ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత.. రాజకీయంగా అడుగులు వేయాలని భావించినా.. ఇతర కారణాలతో ఆయన ఆదిశగా ప్రయాణం చేయలేక పోయారు. కేఏ పాల్ పార్టీ తరఫున ఉప పోరులో పోటీచేయాలని ప్రయత్నించారు. కానీ, మరికొన్ని కారణాలతో దీనిని కూడా విరమించుకున్నారు. గద్దర్ మరణం అనంతరం ఆయన కుమార్తె వెన్నెల రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఉన్నారు.
This post was last modified on November 18, 2024 4:33 pm
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…