వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానీపై కేసు నమోదైంది. ఇప్పటి వరకు టీడీపీ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. చెలరేగిపోయిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కొడాలి నానీ. గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం దక్కించుకున్న ఆయన తాజా ఎన్నికల్లో పరాజయం పాలయ్యా రు.
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ.. నిప్పులు చెరిగిన కొడాలి నాని.. బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. నోరు విప్పితే ఎంత మాట పడితే అంత మాట అనేయడం.. వెనుకా ముందు కూడా ఆలోచించకుండా.. ఆడు-ఈడు అంటూ నోరు చేసుకోవడం కొడాలికే చెల్లింది. అప్పట్లోనే ఆయనపై సామాజిక వాదులు కూడా అసహ్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి వైసీపీ ఓటమికి ఇలాంటి వారు కూడా కారకులు అయ్యారు.
అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దూషణలు, బూతులకు దిగి మహిళలను, రాజకీయ నాయకులను కించపరిచేలా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడాలి నానీపై.. విశాఖలో పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని అంజన ప్రియ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. విశాఖ పోలీసులు కేసు పెట్టారు. దీనికి సంబంధించి త్వరలోనే 41ఏ కింద నోటీసులు ఇవ్వనున్నట్టు సీఐ తెలిపారు.
ఏంటీ కేసు..
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లపై బండ బూతులతో విరుచుకుపడ్డారని, సోషల్ మీడియాలోనూ ఇలాంటి కామెంట్లే చేశారని.. అంజన ప్రియ పోలీసులకు తెలిపారు. దీనికి సంబంధించి వీడియో ఆధారాలను ఆమె అందించారు. దీంతో కొడాలిపై కేసు నమోదు చేశారు. కాగా, కూటమి ప్రభుత్వ హయాంలో కొడాలిపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.
This post was last modified on November 18, 2024 4:31 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…