వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానీపై కేసు నమోదైంది. ఇప్పటి వరకు టీడీపీ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. చెలరేగిపోయిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కొడాలి నానీ. గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం దక్కించుకున్న ఆయన తాజా ఎన్నికల్లో పరాజయం పాలయ్యా రు.
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ.. నిప్పులు చెరిగిన కొడాలి నాని.. బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. నోరు విప్పితే ఎంత మాట పడితే అంత మాట అనేయడం.. వెనుకా ముందు కూడా ఆలోచించకుండా.. ఆడు-ఈడు అంటూ నోరు చేసుకోవడం కొడాలికే చెల్లింది. అప్పట్లోనే ఆయనపై సామాజిక వాదులు కూడా అసహ్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి వైసీపీ ఓటమికి ఇలాంటి వారు కూడా కారకులు అయ్యారు.
అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దూషణలు, బూతులకు దిగి మహిళలను, రాజకీయ నాయకులను కించపరిచేలా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడాలి నానీపై.. విశాఖలో పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని అంజన ప్రియ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. విశాఖ పోలీసులు కేసు పెట్టారు. దీనికి సంబంధించి త్వరలోనే 41ఏ కింద నోటీసులు ఇవ్వనున్నట్టు సీఐ తెలిపారు.
ఏంటీ కేసు..
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లపై బండ బూతులతో విరుచుకుపడ్డారని, సోషల్ మీడియాలోనూ ఇలాంటి కామెంట్లే చేశారని.. అంజన ప్రియ పోలీసులకు తెలిపారు. దీనికి సంబంధించి వీడియో ఆధారాలను ఆమె అందించారు. దీంతో కొడాలిపై కేసు నమోదు చేశారు. కాగా, కూటమి ప్రభుత్వ హయాంలో కొడాలిపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…