వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానీపై కేసు నమోదైంది. ఇప్పటి వరకు టీడీపీ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. చెలరేగిపోయిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కొడాలి నానీ. గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం దక్కించుకున్న ఆయన తాజా ఎన్నికల్లో పరాజయం పాలయ్యా రు.
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ.. నిప్పులు చెరిగిన కొడాలి నాని.. బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. నోరు విప్పితే ఎంత మాట పడితే అంత మాట అనేయడం.. వెనుకా ముందు కూడా ఆలోచించకుండా.. ఆడు-ఈడు అంటూ నోరు చేసుకోవడం కొడాలికే చెల్లింది. అప్పట్లోనే ఆయనపై సామాజిక వాదులు కూడా అసహ్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి వైసీపీ ఓటమికి ఇలాంటి వారు కూడా కారకులు అయ్యారు.
అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దూషణలు, బూతులకు దిగి మహిళలను, రాజకీయ నాయకులను కించపరిచేలా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడాలి నానీపై.. విశాఖలో పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని అంజన ప్రియ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. విశాఖ పోలీసులు కేసు పెట్టారు. దీనికి సంబంధించి త్వరలోనే 41ఏ కింద నోటీసులు ఇవ్వనున్నట్టు సీఐ తెలిపారు.
ఏంటీ కేసు..
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లపై బండ బూతులతో విరుచుకుపడ్డారని, సోషల్ మీడియాలోనూ ఇలాంటి కామెంట్లే చేశారని.. అంజన ప్రియ పోలీసులకు తెలిపారు. దీనికి సంబంధించి వీడియో ఆధారాలను ఆమె అందించారు. దీంతో కొడాలిపై కేసు నమోదు చేశారు. కాగా, కూటమి ప్రభుత్వ హయాంలో కొడాలిపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.
This post was last modified on November 18, 2024 4:31 pm
భారతదేశంలో డాక్టర్ వృత్తికి ఉన్న గౌరవం అందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడు అదే వృత్తిలో ఉన్నవారు తమ పిల్లలను డాక్టర్లుగా…
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడేందుకు టీమ్ ఇండియా సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే…
తమిళనాట త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని అధికార పార్టీ డీఎంకేకు.. అత్యంత కీలకంగా మారున్నాయి. ఒకవైపు…
అదును చూసుకుని వ్యాపార సంస్థలు తమ నైజాన్ని బయట పెట్టుకుంటాయి. పది రూపాయలు పోగేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు చమురు విషయంలోనూ…
రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి, ‘మాస్ రాజా’ అనే ట్యాగ్ను కూడా పక్కన పెట్టి చేసిన సినిమా..…
ఉదయం నుంచి ఎప్పుడెప్పుడా అని తెగ వెయిటింగ్ లో పెట్టిన పెద్ది సెకండ్ సింగల్ వచ్చేసింది. నిజానికి సాయంత్రం ఏడు…