వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానీపై కేసు నమోదైంది. ఇప్పటి వరకు టీడీపీ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. చెలరేగిపోయిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కొడాలి నానీ. గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం దక్కించుకున్న ఆయన తాజా ఎన్నికల్లో పరాజయం పాలయ్యా రు.
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ.. నిప్పులు చెరిగిన కొడాలి నాని.. బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. నోరు విప్పితే ఎంత మాట పడితే అంత మాట అనేయడం.. వెనుకా ముందు కూడా ఆలోచించకుండా.. ఆడు-ఈడు అంటూ నోరు చేసుకోవడం కొడాలికే చెల్లింది. అప్పట్లోనే ఆయనపై సామాజిక వాదులు కూడా అసహ్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి వైసీపీ ఓటమికి ఇలాంటి వారు కూడా కారకులు అయ్యారు.
అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దూషణలు, బూతులకు దిగి మహిళలను, రాజకీయ నాయకులను కించపరిచేలా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడాలి నానీపై.. విశాఖలో పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని అంజన ప్రియ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. విశాఖ పోలీసులు కేసు పెట్టారు. దీనికి సంబంధించి త్వరలోనే 41ఏ కింద నోటీసులు ఇవ్వనున్నట్టు సీఐ తెలిపారు.
ఏంటీ కేసు..
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లపై బండ బూతులతో విరుచుకుపడ్డారని, సోషల్ మీడియాలోనూ ఇలాంటి కామెంట్లే చేశారని.. అంజన ప్రియ పోలీసులకు తెలిపారు. దీనికి సంబంధించి వీడియో ఆధారాలను ఆమె అందించారు. దీంతో కొడాలిపై కేసు నమోదు చేశారు. కాగా, కూటమి ప్రభుత్వ హయాంలో కొడాలిపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.
This post was last modified on November 18, 2024 4:31 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…