Political News

కొత్త రాజ‌ధాని కోసం చంద్ర‌బాబు పాట్లు చూశారా…!

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ప్ర‌ధానంగా మూడు విష‌యాల‌ను ఆయ‌న కేంద్ర మంత్రుల‌తో చ‌ర్చించారు. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, విదేశాంగ మంత్రి ఎస్. జైశంక‌ర్‌ల‌తోనూ ఆయ‌న భేటీ అయ్యారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఏపీలోనే చంద్ర‌బాబు.. అనంత‌రం ఢిల్లీ వెళ్లి.. అక్క‌డ వారిని క‌లిశారు. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తి రాజ‌ధానికి సంబంధించిన కీల‌క విష‌యంపై జైశంక‌ర్‌తో చ‌ర్చించారు.

అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్మించేందుకు, ఈ ఐదేళ్ల కాలంలోనే దానిని పూర్తి చేసేందుకు కూడా చంద్ర‌బా బు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న నిధులు స‌మీక‌రిస్తున్నారు. మూడు మార్గాల్లో ఆయ‌న అమ‌రావ‌తి కోసం సొమ్ములు సేక‌రిస్తున్నారు. ఇక‌, ఈ నిర్మాణాలు పూర్తి చేయాలంటే.. సింగ‌పూర్ ప్ర‌భు త్వంతో మ‌రోసారి సంబంధాలు పెంచుకోవాల‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌. గ‌తంలోనే సింగ‌పూర్ తో సంబంధాలు కొన‌సాగించారు.

అయితే.. వైసీపీ హ‌యాంలో అమ‌రావ‌తి నిర్మాణం ఆగిపోయింది. దీంతో సింగ‌పూర్ ఒప్పందం ర‌ద్ద‌యిపో యింది. ఇప్పుడు దానిని పున‌రుద్ధ‌రించుకోవాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్రం సాయం చేయాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌గా ఉంది. ఈ విష‌యాన్ని తాజాగా ప్ర‌స్తావించారు. దీనిపై కేంద్రం ఏం చేస్తుందో చూడాలి. ఇక‌, మ‌రో కీల‌క‌మైన విష‌యం పోల‌వ‌రం జ‌లాల‌ను సీమ ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డం.

దీనికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో చంద్ర‌బాబు చ‌ర్చ‌లు జ‌రిపారు. గోదావ రి-పెన్నా న‌దుల‌ను అనుసంధానించ‌డం ద్వారా.. సీమ జిల్లాల‌కు నీళ్లు ఇస్తామ‌ని.. దీనికి సంబంధించి 60 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని.. సాయం చేయాల‌ని ఆయ‌న కోరారు. ఇక‌, మూడో కీల‌క‌మైన అంశం… రాష్ట్రంలో విధిస్తున్న జీఎస్టీలో ఏపీకి చెందిన ప‌న్నులలో 1 శాతం అద‌నంగా స‌ర్ చార్జీని విధించాల‌ని కోర‌డం. ఇది కూడా రాష్ట్రానికి అత్యంత కీల‌క‌మైన విష‌యం. దీనికి క‌నుక కేంద్రం ఓకే చెబితే..వ చ్చే రెండేళ్ల‌పాటు.. జీఎస్టీ ఆదాయంలో 1 శాతం మేరకు రాష్ట్రానికి అద‌నంగా ప‌న్నులు స‌మ‌కూరుతాయి. మ‌రి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on November 18, 2024 3:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

3 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

4 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

4 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

4 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

5 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

6 hours ago