Political News

కొత్త రాజ‌ధాని కోసం చంద్ర‌బాబు పాట్లు చూశారా…!

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ప్ర‌ధానంగా మూడు విష‌యాల‌ను ఆయ‌న కేంద్ర మంత్రుల‌తో చ‌ర్చించారు. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, విదేశాంగ మంత్రి ఎస్. జైశంక‌ర్‌ల‌తోనూ ఆయ‌న భేటీ అయ్యారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఏపీలోనే చంద్ర‌బాబు.. అనంత‌రం ఢిల్లీ వెళ్లి.. అక్క‌డ వారిని క‌లిశారు. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తి రాజ‌ధానికి సంబంధించిన కీల‌క విష‌యంపై జైశంక‌ర్‌తో చ‌ర్చించారు.

అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్మించేందుకు, ఈ ఐదేళ్ల కాలంలోనే దానిని పూర్తి చేసేందుకు కూడా చంద్ర‌బా బు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న నిధులు స‌మీక‌రిస్తున్నారు. మూడు మార్గాల్లో ఆయ‌న అమ‌రావ‌తి కోసం సొమ్ములు సేక‌రిస్తున్నారు. ఇక‌, ఈ నిర్మాణాలు పూర్తి చేయాలంటే.. సింగ‌పూర్ ప్ర‌భు త్వంతో మ‌రోసారి సంబంధాలు పెంచుకోవాల‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌. గ‌తంలోనే సింగ‌పూర్ తో సంబంధాలు కొన‌సాగించారు.

అయితే.. వైసీపీ హ‌యాంలో అమ‌రావ‌తి నిర్మాణం ఆగిపోయింది. దీంతో సింగ‌పూర్ ఒప్పందం ర‌ద్ద‌యిపో యింది. ఇప్పుడు దానిని పున‌రుద్ధ‌రించుకోవాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్రం సాయం చేయాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌గా ఉంది. ఈ విష‌యాన్ని తాజాగా ప్ర‌స్తావించారు. దీనిపై కేంద్రం ఏం చేస్తుందో చూడాలి. ఇక‌, మ‌రో కీల‌క‌మైన విష‌యం పోల‌వ‌రం జ‌లాల‌ను సీమ ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డం.

దీనికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో చంద్ర‌బాబు చ‌ర్చ‌లు జ‌రిపారు. గోదావ రి-పెన్నా న‌దుల‌ను అనుసంధానించ‌డం ద్వారా.. సీమ జిల్లాల‌కు నీళ్లు ఇస్తామ‌ని.. దీనికి సంబంధించి 60 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని.. సాయం చేయాల‌ని ఆయ‌న కోరారు. ఇక‌, మూడో కీల‌క‌మైన అంశం… రాష్ట్రంలో విధిస్తున్న జీఎస్టీలో ఏపీకి చెందిన ప‌న్నులలో 1 శాతం అద‌నంగా స‌ర్ చార్జీని విధించాల‌ని కోర‌డం. ఇది కూడా రాష్ట్రానికి అత్యంత కీల‌క‌మైన విష‌యం. దీనికి క‌నుక కేంద్రం ఓకే చెబితే..వ చ్చే రెండేళ్ల‌పాటు.. జీఎస్టీ ఆదాయంలో 1 శాతం మేరకు రాష్ట్రానికి అద‌నంగా ప‌న్నులు స‌మ‌కూరుతాయి. మ‌రి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

9 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

11 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

13 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

14 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

14 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

14 hours ago