Political News

కొత్త రాజ‌ధాని కోసం చంద్ర‌బాబు పాట్లు చూశారా…!

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ప్ర‌ధానంగా మూడు విష‌యాల‌ను ఆయ‌న కేంద్ర మంత్రుల‌తో చ‌ర్చించారు. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, విదేశాంగ మంత్రి ఎస్. జైశంక‌ర్‌ల‌తోనూ ఆయ‌న భేటీ అయ్యారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఏపీలోనే చంద్ర‌బాబు.. అనంత‌రం ఢిల్లీ వెళ్లి.. అక్క‌డ వారిని క‌లిశారు. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తి రాజ‌ధానికి సంబంధించిన కీల‌క విష‌యంపై జైశంక‌ర్‌తో చ‌ర్చించారు.

అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్మించేందుకు, ఈ ఐదేళ్ల కాలంలోనే దానిని పూర్తి చేసేందుకు కూడా చంద్ర‌బా బు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న నిధులు స‌మీక‌రిస్తున్నారు. మూడు మార్గాల్లో ఆయ‌న అమ‌రావ‌తి కోసం సొమ్ములు సేక‌రిస్తున్నారు. ఇక‌, ఈ నిర్మాణాలు పూర్తి చేయాలంటే.. సింగ‌పూర్ ప్ర‌భు త్వంతో మ‌రోసారి సంబంధాలు పెంచుకోవాల‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌. గ‌తంలోనే సింగ‌పూర్ తో సంబంధాలు కొన‌సాగించారు.

అయితే.. వైసీపీ హ‌యాంలో అమ‌రావ‌తి నిర్మాణం ఆగిపోయింది. దీంతో సింగ‌పూర్ ఒప్పందం ర‌ద్ద‌యిపో యింది. ఇప్పుడు దానిని పున‌రుద్ధ‌రించుకోవాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్రం సాయం చేయాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌గా ఉంది. ఈ విష‌యాన్ని తాజాగా ప్ర‌స్తావించారు. దీనిపై కేంద్రం ఏం చేస్తుందో చూడాలి. ఇక‌, మ‌రో కీల‌క‌మైన విష‌యం పోల‌వ‌రం జ‌లాల‌ను సీమ ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డం.

దీనికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో చంద్ర‌బాబు చ‌ర్చ‌లు జ‌రిపారు. గోదావ రి-పెన్నా న‌దుల‌ను అనుసంధానించ‌డం ద్వారా.. సీమ జిల్లాల‌కు నీళ్లు ఇస్తామ‌ని.. దీనికి సంబంధించి 60 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని.. సాయం చేయాల‌ని ఆయ‌న కోరారు. ఇక‌, మూడో కీల‌క‌మైన అంశం… రాష్ట్రంలో విధిస్తున్న జీఎస్టీలో ఏపీకి చెందిన ప‌న్నులలో 1 శాతం అద‌నంగా స‌ర్ చార్జీని విధించాల‌ని కోర‌డం. ఇది కూడా రాష్ట్రానికి అత్యంత కీల‌క‌మైన విష‌యం. దీనికి క‌నుక కేంద్రం ఓకే చెబితే..వ చ్చే రెండేళ్ల‌పాటు.. జీఎస్టీ ఆదాయంలో 1 శాతం మేరకు రాష్ట్రానికి అద‌నంగా ప‌న్నులు స‌మ‌కూరుతాయి. మ‌రి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on November 18, 2024 3:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

17 minutes ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

37 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

1 hour ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

6 hours ago