Political News

మండ‌లిని ఇలా బ‌లోపేతం చేస్తున్నారు.. బాబు ఐడియా భేష్ ..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఐడియా వేస్తే.. తిరుగుండ‌దు. అది ఎన్నిక‌లైనా.. రాజ‌కీయాలైనా పాల‌న‌లో అయినా.. ఆయ‌న ఆలోచ‌న‌లు చ‌క్క‌గా అమ‌లు కావాల్సిందే. ఇప్పుడు అదే ఫార్ములాను శాస‌న మండ‌లిలోనూ ప్ర‌యోగిస్తున్నారు. ప్రతిప‌క్ష వైసీపీకి అసెంబ్లీలో బ‌లం లేక‌పోయినా.. మండ‌లిలో బాగానే ఉంది. దీంతో ఏ స‌మావేశాలు జ‌రిగిన శాస‌న స‌భ‌కు రాని స‌భ్యులు.. మండ‌లికి మాత్రం ఠంచనుగా వ‌స్తున్నారు.

ఈ క్ర‌మంలోనే కూట‌మి స‌ర్కారుకు ఎదురు ప్ర‌శ్న‌లు సంధిస్తూ.. ఇరుకున పెట్టే ఆలోచ‌న చేస్తున్నారు. తాజాగా జ‌రుగుతున్న బ‌డ్జెట్ స‌మావేశాల‌ను కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ సీరియ‌స్‌గా తీసుకున్నా.. స‌భ‌కు మాత్రం వెళ్ల‌కుండా మండ‌లికి మాత్రం ప్ర‌తి స‌భ్యుడిని హాజ‌ర‌య్యేలా చూస్తున్నారు. దీంతో శాస‌న స‌భ‌లో ఏక‌ప‌క్షంగా సాగుతున్న కార్య‌క్ర‌మాలు.. మండ‌లి విష‌యానికి వ‌స్తే మాత్రం ఉత్కంఠ‌గా మారుతున్నాయి.

వైసీపీ ఎమ్మెల్సీల‌కు, కూట‌మి పార్టీల స‌భ్యుల‌కు మ‌ధ్య వాగ్యుద్ధం స‌హా చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి. అయితే.. కూట‌మి పార్టీల‌కు వైసీపీకి ఉన్నంత బ‌లం లేక‌పోవ‌డంతో మండ‌లిలో వైసీపీదే పైచేయి అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. గ‌తంలోనూ వైసీపీ హ‌యాంలో ఇలానే జ‌రిగింది. మండ‌లిలో ఆ పార్టీకి బ‌లం లేక‌పోవ‌డం.. అప్ప‌టిటీడీపీకి సంఖ్యా బలం ఎక్కువ‌గా ఉండ‌డంతో వైసీపీకి ఇబ్బందులు వ‌చ్చాయి. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబుఐడియాతో కూట‌మి పార్టీల‌కు మండ‌లి కూడా బ‌లంగా మారింది.

ప్ర‌స్తుతం మండ‌లిలో కూట‌మి పార్టీల‌కు సంఖ్యా బ‌లం త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు మంత్రుల‌ను మండ‌లికి పంపిస్తున్నారు. వీరికి అటు శాస‌న‌స‌భ‌లోనూ.. ఇటు మండ‌లిలోనూ ప్ర‌వేశించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో వైసీపీ ఎమ్మెల్సీల దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేందుకు చంద్ర‌బాబు మంత్రులు మొత్తాన్ని మండ‌లికి పంపిస్తున్నారు.

అంటే.. ఉన్న మంత్రులు 25 మంది దాదాపు 13 నుంచి 15 మంది వ‌ర‌కు మండ‌లికే వ‌స్తున్నారు. దీంతో వైసీపీ దూకుడు పెద్ద‌గా క‌నిపించ‌క‌పోగా.. అడుగ‌డుగునా వారిని మంత్రులు అడ్డుకుంటున్నారు. దీంతో వైసీపీ పైచేయి సాధించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా.. అది సాధ్యం కావ‌డంలేదు. ఈ ప‌రిణామాల‌తో చంద్ర‌బాబు ఐడియా స‌క్సెస్ అయిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 18, 2024 3:57 pm

Share

Recent Posts

పార్టీ అధిష్టానానికే బోండా ఉమ సవాల్?

ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…

14 minutes ago

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

3 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

4 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

5 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

5 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

9 hours ago