ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు చక్కగా అమలు కావాల్సిందే. ఇప్పుడు అదే ఫార్ములాను శాసన మండలిలోనూ ప్రయోగిస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీకి అసెంబ్లీలో బలం లేకపోయినా.. మండలిలో బాగానే ఉంది. దీంతో ఏ సమావేశాలు జరిగిన శాసన సభకు రాని సభ్యులు.. మండలికి మాత్రం ఠంచనుగా వస్తున్నారు.
ఈ క్రమంలోనే కూటమి సర్కారుకు ఎదురు ప్రశ్నలు సంధిస్తూ.. ఇరుకున పెట్టే ఆలోచన చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాలను కూడా వైసీపీ అధినేత జగన్ సీరియస్గా తీసుకున్నా.. సభకు మాత్రం వెళ్లకుండా మండలికి మాత్రం ప్రతి సభ్యుడిని హాజరయ్యేలా చూస్తున్నారు. దీంతో శాసన సభలో ఏకపక్షంగా సాగుతున్న కార్యక్రమాలు.. మండలి విషయానికి వస్తే మాత్రం ఉత్కంఠగా మారుతున్నాయి.
వైసీపీ ఎమ్మెల్సీలకు, కూటమి పార్టీల సభ్యులకు మధ్య వాగ్యుద్ధం సహా చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. కూటమి పార్టీలకు వైసీపీకి ఉన్నంత బలం లేకపోవడంతో మండలిలో వైసీపీదే పైచేయి అవుతుందని అందరూ అనుకున్నారు. గతంలోనూ వైసీపీ హయాంలో ఇలానే జరిగింది. మండలిలో ఆ పార్టీకి బలం లేకపోవడం.. అప్పటిటీడీపీకి సంఖ్యా బలం ఎక్కువగా ఉండడంతో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయి. కానీ, ఇప్పుడు చంద్రబాబుఐడియాతో కూటమి పార్టీలకు మండలి కూడా బలంగా మారింది.
ప్రస్తుతం మండలిలో కూటమి పార్టీలకు సంఖ్యా బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు మంత్రులను మండలికి పంపిస్తున్నారు. వీరికి అటు శాసనసభలోనూ.. ఇటు మండలిలోనూ ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు మంత్రులు మొత్తాన్ని మండలికి పంపిస్తున్నారు.
అంటే.. ఉన్న మంత్రులు 25 మంది దాదాపు 13 నుంచి 15 మంది వరకు మండలికే వస్తున్నారు. దీంతో వైసీపీ దూకుడు పెద్దగా కనిపించకపోగా.. అడుగడుగునా వారిని మంత్రులు అడ్డుకుంటున్నారు. దీంతో వైసీపీ పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నా.. అది సాధ్యం కావడంలేదు. ఈ పరిణామాలతో చంద్రబాబు ఐడియా సక్సెస్ అయినట్టేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 18, 2024 3:57 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…