ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు చక్కగా అమలు కావాల్సిందే. ఇప్పుడు అదే ఫార్ములాను శాసన మండలిలోనూ ప్రయోగిస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీకి అసెంబ్లీలో బలం లేకపోయినా.. మండలిలో బాగానే ఉంది. దీంతో ఏ సమావేశాలు జరిగిన శాసన సభకు రాని సభ్యులు.. మండలికి మాత్రం ఠంచనుగా వస్తున్నారు.
ఈ క్రమంలోనే కూటమి సర్కారుకు ఎదురు ప్రశ్నలు సంధిస్తూ.. ఇరుకున పెట్టే ఆలోచన చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాలను కూడా వైసీపీ అధినేత జగన్ సీరియస్గా తీసుకున్నా.. సభకు మాత్రం వెళ్లకుండా మండలికి మాత్రం ప్రతి సభ్యుడిని హాజరయ్యేలా చూస్తున్నారు. దీంతో శాసన సభలో ఏకపక్షంగా సాగుతున్న కార్యక్రమాలు.. మండలి విషయానికి వస్తే మాత్రం ఉత్కంఠగా మారుతున్నాయి.
వైసీపీ ఎమ్మెల్సీలకు, కూటమి పార్టీల సభ్యులకు మధ్య వాగ్యుద్ధం సహా చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. కూటమి పార్టీలకు వైసీపీకి ఉన్నంత బలం లేకపోవడంతో మండలిలో వైసీపీదే పైచేయి అవుతుందని అందరూ అనుకున్నారు. గతంలోనూ వైసీపీ హయాంలో ఇలానే జరిగింది. మండలిలో ఆ పార్టీకి బలం లేకపోవడం.. అప్పటిటీడీపీకి సంఖ్యా బలం ఎక్కువగా ఉండడంతో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయి. కానీ, ఇప్పుడు చంద్రబాబుఐడియాతో కూటమి పార్టీలకు మండలి కూడా బలంగా మారింది.
ప్రస్తుతం మండలిలో కూటమి పార్టీలకు సంఖ్యా బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు మంత్రులను మండలికి పంపిస్తున్నారు. వీరికి అటు శాసనసభలోనూ.. ఇటు మండలిలోనూ ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు మంత్రులు మొత్తాన్ని మండలికి పంపిస్తున్నారు.
అంటే.. ఉన్న మంత్రులు 25 మంది దాదాపు 13 నుంచి 15 మంది వరకు మండలికే వస్తున్నారు. దీంతో వైసీపీ దూకుడు పెద్దగా కనిపించకపోగా.. అడుగడుగునా వారిని మంత్రులు అడ్డుకుంటున్నారు. దీంతో వైసీపీ పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నా.. అది సాధ్యం కావడంలేదు. ఈ పరిణామాలతో చంద్రబాబు ఐడియా సక్సెస్ అయినట్టేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 18, 2024 3:57 pm
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…