Political News

మండ‌లిని ఇలా బ‌లోపేతం చేస్తున్నారు.. బాబు ఐడియా భేష్ ..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఐడియా వేస్తే.. తిరుగుండ‌దు. అది ఎన్నిక‌లైనా.. రాజ‌కీయాలైనా పాల‌న‌లో అయినా.. ఆయ‌న ఆలోచ‌న‌లు చ‌క్క‌గా అమ‌లు కావాల్సిందే. ఇప్పుడు అదే ఫార్ములాను శాస‌న మండ‌లిలోనూ ప్ర‌యోగిస్తున్నారు. ప్రతిప‌క్ష వైసీపీకి అసెంబ్లీలో బ‌లం లేక‌పోయినా.. మండ‌లిలో బాగానే ఉంది. దీంతో ఏ స‌మావేశాలు జ‌రిగిన శాస‌న స‌భ‌కు రాని స‌భ్యులు.. మండ‌లికి మాత్రం ఠంచనుగా వ‌స్తున్నారు.

ఈ క్ర‌మంలోనే కూట‌మి స‌ర్కారుకు ఎదురు ప్ర‌శ్న‌లు సంధిస్తూ.. ఇరుకున పెట్టే ఆలోచ‌న చేస్తున్నారు. తాజాగా జ‌రుగుతున్న బ‌డ్జెట్ స‌మావేశాల‌ను కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ సీరియ‌స్‌గా తీసుకున్నా.. స‌భ‌కు మాత్రం వెళ్ల‌కుండా మండ‌లికి మాత్రం ప్ర‌తి స‌భ్యుడిని హాజ‌ర‌య్యేలా చూస్తున్నారు. దీంతో శాస‌న స‌భ‌లో ఏక‌ప‌క్షంగా సాగుతున్న కార్య‌క్ర‌మాలు.. మండ‌లి విష‌యానికి వ‌స్తే మాత్రం ఉత్కంఠ‌గా మారుతున్నాయి.

వైసీపీ ఎమ్మెల్సీల‌కు, కూట‌మి పార్టీల స‌భ్యుల‌కు మ‌ధ్య వాగ్యుద్ధం స‌హా చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి. అయితే.. కూట‌మి పార్టీల‌కు వైసీపీకి ఉన్నంత బ‌లం లేక‌పోవ‌డంతో మండ‌లిలో వైసీపీదే పైచేయి అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. గ‌తంలోనూ వైసీపీ హ‌యాంలో ఇలానే జ‌రిగింది. మండ‌లిలో ఆ పార్టీకి బ‌లం లేక‌పోవ‌డం.. అప్ప‌టిటీడీపీకి సంఖ్యా బలం ఎక్కువ‌గా ఉండ‌డంతో వైసీపీకి ఇబ్బందులు వ‌చ్చాయి. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబుఐడియాతో కూట‌మి పార్టీల‌కు మండ‌లి కూడా బ‌లంగా మారింది.

ప్ర‌స్తుతం మండ‌లిలో కూట‌మి పార్టీల‌కు సంఖ్యా బ‌లం త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు మంత్రుల‌ను మండ‌లికి పంపిస్తున్నారు. వీరికి అటు శాస‌న‌స‌భ‌లోనూ.. ఇటు మండ‌లిలోనూ ప్ర‌వేశించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో వైసీపీ ఎమ్మెల్సీల దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేందుకు చంద్ర‌బాబు మంత్రులు మొత్తాన్ని మండ‌లికి పంపిస్తున్నారు.

అంటే.. ఉన్న మంత్రులు 25 మంది దాదాపు 13 నుంచి 15 మంది వ‌ర‌కు మండ‌లికే వ‌స్తున్నారు. దీంతో వైసీపీ దూకుడు పెద్ద‌గా క‌నిపించ‌క‌పోగా.. అడుగ‌డుగునా వారిని మంత్రులు అడ్డుకుంటున్నారు. దీంతో వైసీపీ పైచేయి సాధించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా.. అది సాధ్యం కావ‌డంలేదు. ఈ ప‌రిణామాల‌తో చంద్ర‌బాబు ఐడియా స‌క్సెస్ అయిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 18, 2024 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

31 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago