ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు చక్కగా అమలు కావాల్సిందే. ఇప్పుడు అదే ఫార్ములాను శాసన మండలిలోనూ ప్రయోగిస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీకి అసెంబ్లీలో బలం లేకపోయినా.. మండలిలో బాగానే ఉంది. దీంతో ఏ సమావేశాలు జరిగిన శాసన సభకు రాని సభ్యులు.. మండలికి మాత్రం ఠంచనుగా వస్తున్నారు.
ఈ క్రమంలోనే కూటమి సర్కారుకు ఎదురు ప్రశ్నలు సంధిస్తూ.. ఇరుకున పెట్టే ఆలోచన చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాలను కూడా వైసీపీ అధినేత జగన్ సీరియస్గా తీసుకున్నా.. సభకు మాత్రం వెళ్లకుండా మండలికి మాత్రం ప్రతి సభ్యుడిని హాజరయ్యేలా చూస్తున్నారు. దీంతో శాసన సభలో ఏకపక్షంగా సాగుతున్న కార్యక్రమాలు.. మండలి విషయానికి వస్తే మాత్రం ఉత్కంఠగా మారుతున్నాయి.
వైసీపీ ఎమ్మెల్సీలకు, కూటమి పార్టీల సభ్యులకు మధ్య వాగ్యుద్ధం సహా చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. కూటమి పార్టీలకు వైసీపీకి ఉన్నంత బలం లేకపోవడంతో మండలిలో వైసీపీదే పైచేయి అవుతుందని అందరూ అనుకున్నారు. గతంలోనూ వైసీపీ హయాంలో ఇలానే జరిగింది. మండలిలో ఆ పార్టీకి బలం లేకపోవడం.. అప్పటిటీడీపీకి సంఖ్యా బలం ఎక్కువగా ఉండడంతో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయి. కానీ, ఇప్పుడు చంద్రబాబుఐడియాతో కూటమి పార్టీలకు మండలి కూడా బలంగా మారింది.
ప్రస్తుతం మండలిలో కూటమి పార్టీలకు సంఖ్యా బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు మంత్రులను మండలికి పంపిస్తున్నారు. వీరికి అటు శాసనసభలోనూ.. ఇటు మండలిలోనూ ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు మంత్రులు మొత్తాన్ని మండలికి పంపిస్తున్నారు.
అంటే.. ఉన్న మంత్రులు 25 మంది దాదాపు 13 నుంచి 15 మంది వరకు మండలికే వస్తున్నారు. దీంతో వైసీపీ దూకుడు పెద్దగా కనిపించకపోగా.. అడుగడుగునా వారిని మంత్రులు అడ్డుకుంటున్నారు. దీంతో వైసీపీ పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నా.. అది సాధ్యం కావడంలేదు. ఈ పరిణామాలతో చంద్రబాబు ఐడియా సక్సెస్ అయినట్టేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 18, 2024 3:57 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…