ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సోమవారం ఒకే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమవారం కేసులు నమోదయ్యాయి. రెండు కేసులూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఒకరు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు గాను పోలీసులు కేసు నమోదు చేయగా, మరొకరు.. నేరుగా మీడియా ముందు గతంలో చేసిన వ్యాక్యలపై కేసు నమోదైంది. దీంతో వైసీపీలో అలజడి మరింత పెరిగింది.
ఎవరు వారు?
వైసీపీ నేత, యర్రగొండ పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఆయనకు వాట్సాప్ ద్వారా 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే, చంద్రశేఖర్ స్పందించలేదు. దీంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నేరుగా ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేశామని చెబుతూ.. 41 ఏ కింద నోటీసులను ఆయనకే ఇచ్చారు. గతంలో టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పై తాటిపర్తి సోషల్ మీడియా వేదికగా దుర్భాషలాడారని టీడీపీ నాయకుడు ఒకరు ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన పోలీసులు చంద్రశేఖర్పై కేసు పెట్టారు.
ఇక, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్పైనా కేసు నమోదైంది. సోమవారం జనసేన పార్టీకి చెందిన కీలక నాయకుడు పోలీసులను ఆశ్రయించారు. గత ఎన్నికలకు ముందు తమ పార్టీ అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై దువ్వాడ నోరు చేసుకున్నారని, వినలేని మాటలు మాట్లాడారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దువ్వాడపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…