ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సోమవారం ఒకే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమవారం కేసులు నమోదయ్యాయి. రెండు కేసులూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఒకరు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు గాను పోలీసులు కేసు నమోదు చేయగా, మరొకరు.. నేరుగా మీడియా ముందు గతంలో చేసిన వ్యాక్యలపై కేసు నమోదైంది. దీంతో వైసీపీలో అలజడి మరింత పెరిగింది.
ఎవరు వారు?
వైసీపీ నేత, యర్రగొండ పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఆయనకు వాట్సాప్ ద్వారా 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే, చంద్రశేఖర్ స్పందించలేదు. దీంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నేరుగా ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేశామని చెబుతూ.. 41 ఏ కింద నోటీసులను ఆయనకే ఇచ్చారు. గతంలో టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పై తాటిపర్తి సోషల్ మీడియా వేదికగా దుర్భాషలాడారని టీడీపీ నాయకుడు ఒకరు ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన పోలీసులు చంద్రశేఖర్పై కేసు పెట్టారు.
ఇక, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్పైనా కేసు నమోదైంది. సోమవారం జనసేన పార్టీకి చెందిన కీలక నాయకుడు పోలీసులను ఆశ్రయించారు. గత ఎన్నికలకు ముందు తమ పార్టీ అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై దువ్వాడ నోరు చేసుకున్నారని, వినలేని మాటలు మాట్లాడారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దువ్వాడపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on November 18, 2024 1:41 pm
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…
ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య…