ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సోమవారం ఒకే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమవారం కేసులు నమోదయ్యాయి. రెండు కేసులూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఒకరు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు గాను పోలీసులు కేసు నమోదు చేయగా, మరొకరు.. నేరుగా మీడియా ముందు గతంలో చేసిన వ్యాక్యలపై కేసు నమోదైంది. దీంతో వైసీపీలో అలజడి మరింత పెరిగింది.
ఎవరు వారు?
వైసీపీ నేత, యర్రగొండ పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఆయనకు వాట్సాప్ ద్వారా 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే, చంద్రశేఖర్ స్పందించలేదు. దీంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నేరుగా ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేశామని చెబుతూ.. 41 ఏ కింద నోటీసులను ఆయనకే ఇచ్చారు. గతంలో టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పై తాటిపర్తి సోషల్ మీడియా వేదికగా దుర్భాషలాడారని టీడీపీ నాయకుడు ఒకరు ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన పోలీసులు చంద్రశేఖర్పై కేసు పెట్టారు.
ఇక, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్పైనా కేసు నమోదైంది. సోమవారం జనసేన పార్టీకి చెందిన కీలక నాయకుడు పోలీసులను ఆశ్రయించారు. గత ఎన్నికలకు ముందు తమ పార్టీ అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై దువ్వాడ నోరు చేసుకున్నారని, వినలేని మాటలు మాట్లాడారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దువ్వాడపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on November 18, 2024 1:41 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…