Political News

ప‌వ‌న్ కోసం.. హైవే పై అఘోరి ర‌చ్చ‌!

గ‌త కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హ‌ల్చ‌ల్ సృష్టిస్తున్న మ‌హిళా అఘోరి వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతోంది. ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ.. ప్ర‌జ‌ల‌ను భ‌య భ్రాంతుల‌కు గురి చేస్తోంది. ఏ క్ష‌ణంలో ఆమె ఎక్క‌డ ప్ర‌త్య‌క్ష మ‌వుతుందో తెలియ‌క ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా.. కొద్దిపాటి బూడిద రాసుకుని.. సంచ‌రిస్తున్న ఆమె వ్య‌వ‌హార శైలితో సాధార‌ణ ప్ర‌జ‌లు బెంబేలెత్తుతున్నారు.

తాజాగా ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లుసుకుని తీరుతానంటూ.. మ‌హిళా అఘోరీ చేసిన ర‌చ్చ‌తో విజ‌య‌వాడ‌-మంగ‌ళ‌గిరి హైవేలో పెద్ద వివాద‌మే చోటు చేసుకుంది. సోమ‌వారం ఉద‌యాన్నే.. ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ఏమో అఘోరీ.. హ‌ఠాత్తుగావిజ‌య‌వాడ నుంచి మంగ‌ళ‌గిరికి వెళ్లే జాతీయ ర‌హ‌దారిపై ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డ‌కు కొంత ద‌గ్గ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం ఉంది. ఈ క్ర‌మంలో ఆమె ఆ పార్టీ కార్యాల‌యం వైపు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించింది.

ఇంత‌లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు జోక్యం చేసుకుని ఆమెను జాతీయ ర‌హ‌దారిపైనే నిలువ‌రించారు. దీంతో ఆమె పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. తాను ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం వ‌చ్చాన‌ని, ఆయ‌న‌ను క‌లుసుకోవాల్సి ఉంటుంద‌ని, క‌ల‌వ‌కుండా వెళ్లేది లేద‌ని ప‌ట్టుబ‌ట్టింది. దీంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు.. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు.. అఘోరిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా ఆమె న‌డిరోడ్డుపై బైఠాయించి.. ప‌వ‌న్ రావాల్సిందేన‌ని తేల్చి చెప్పారు.

ఈ ప‌రిణామాల‌తో జాతీయ ర‌హ‌దారిపై వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని వాహ‌నాల‌ను పోలీసులు ముందుకు పంపించినా.. త‌ర్వాత న‌డిరోడ్డులో అఘోరీ భైటాయించడంతో పోలీసులు కూడా ఏమీ చేయ‌లేక మౌనంగా ఉండిపోయారు. కాగా, మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

9 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago