Political News

ప‌వ‌న్ కోసం.. హైవే పై అఘోరి ర‌చ్చ‌!

గ‌త కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హ‌ల్చ‌ల్ సృష్టిస్తున్న మ‌హిళా అఘోరి వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతోంది. ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ.. ప్ర‌జ‌ల‌ను భ‌య భ్రాంతుల‌కు గురి చేస్తోంది. ఏ క్ష‌ణంలో ఆమె ఎక్క‌డ ప్ర‌త్య‌క్ష మ‌వుతుందో తెలియ‌క ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా.. కొద్దిపాటి బూడిద రాసుకుని.. సంచ‌రిస్తున్న ఆమె వ్య‌వ‌హార శైలితో సాధార‌ణ ప్ర‌జ‌లు బెంబేలెత్తుతున్నారు.

తాజాగా ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లుసుకుని తీరుతానంటూ.. మ‌హిళా అఘోరీ చేసిన ర‌చ్చ‌తో విజ‌య‌వాడ‌-మంగ‌ళ‌గిరి హైవేలో పెద్ద వివాద‌మే చోటు చేసుకుంది. సోమ‌వారం ఉద‌యాన్నే.. ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ఏమో అఘోరీ.. హ‌ఠాత్తుగావిజ‌య‌వాడ నుంచి మంగ‌ళ‌గిరికి వెళ్లే జాతీయ ర‌హ‌దారిపై ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డ‌కు కొంత ద‌గ్గ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం ఉంది. ఈ క్ర‌మంలో ఆమె ఆ పార్టీ కార్యాల‌యం వైపు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించింది.

ఇంత‌లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు జోక్యం చేసుకుని ఆమెను జాతీయ ర‌హ‌దారిపైనే నిలువ‌రించారు. దీంతో ఆమె పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. తాను ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం వ‌చ్చాన‌ని, ఆయ‌న‌ను క‌లుసుకోవాల్సి ఉంటుంద‌ని, క‌ల‌వ‌కుండా వెళ్లేది లేద‌ని ప‌ట్టుబ‌ట్టింది. దీంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు.. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు.. అఘోరిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా ఆమె న‌డిరోడ్డుపై బైఠాయించి.. ప‌వ‌న్ రావాల్సిందేన‌ని తేల్చి చెప్పారు.

ఈ ప‌రిణామాల‌తో జాతీయ ర‌హ‌దారిపై వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని వాహ‌నాల‌ను పోలీసులు ముందుకు పంపించినా.. త‌ర్వాత న‌డిరోడ్డులో అఘోరీ భైటాయించడంతో పోలీసులు కూడా ఏమీ చేయ‌లేక మౌనంగా ఉండిపోయారు. కాగా, మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే.

This post was last modified on November 18, 2024 12:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

6 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

7 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

7 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

9 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

9 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

11 hours ago