Political News

తమ పార్టీ నాయకులపై చింతమనేని అసహనం

టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఏదో ఒక కేసులో చింతమనేనిని అరెస్టు చేయడం, స్టేషన్ కు తీసుకువెళ్లి విచారణ చేయడం నిత్యకృత్యమైందని విమర్శలు వచ్చాయి. అయితే, చింతమనేనిని వేధించిన అధికారులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కీలక పోస్టులు ఇచ్చిందని స్వయంగా చింతమనేని సంచలన ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలోనే అధికారుల తీరుపై, తమ పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో తనపై వేధింపులకు పాల్పడిన అధికారులకు మంచి పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, అలా పోస్టింగులు ఇప్పిస్తోంది కూడా తమ పార్టీకి చెందిన నాయకులేనింటూ దెందులూరి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో చిట్ చాట్ సందర్భంగా దెందులూరి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

తనపై గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించిందని, అయితే తనను వేధించిన అధికారులు ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని అన్నారు. ఆ అధికారులే కావాలంటూ తమ నాయకులే వారికి మంచి పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తనపై 27 అక్రమ కేసులు పెట్టిందని, వాటిలో రెండింటిని కోర్టు కొట్టివేసిందని గుర్తు చెప్పారు. తనపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, ఆ కేసుల్లో ఎస్సీలు కూడా బాధితులుగా ఉన్నారని చింతమనేని చెప్పారు. మరి, సొంత ప్రభుత్వంపై, తమ పార్టీ నాయకులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on November 16, 2024 9:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ అనంతబాబు కథ ముగిసినట్టేనా?

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…

33 minutes ago

నయనతార ఛాయిస్ ఎందుకు మారింది

ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…

59 minutes ago

హవ్వ… ఆరో తరగతిలో పాటల కంపోజింగా?

స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…

2 hours ago

ఏప్రిల్ నెలను వారణాసే కాపాడాలి

టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…

3 hours ago

రాకీ భాయ్ తిరిగి వస్తాడా?

కొన్ని క‌థ‌లు ముగిసిపోవ‌డాన్ని ప్రేక్ష‌కులు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. వాటికి కొన‌సాగింపు ఉంటేనే బాగుంటుంద‌ని ఆశిస్తారు. వాటి మేక‌ర్స్ కూడా ఆ…

4 hours ago

గొడవ వల్ల గడ్డివాము తగలెట్టేసాడంట

నిందితులను పోలీసులు పబ్లిక్‌లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…

4 hours ago