టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఏదో ఒక కేసులో చింతమనేనిని అరెస్టు చేయడం, స్టేషన్ కు తీసుకువెళ్లి విచారణ చేయడం నిత్యకృత్యమైందని విమర్శలు వచ్చాయి. అయితే, చింతమనేనిని వేధించిన అధికారులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కీలక పోస్టులు ఇచ్చిందని స్వయంగా చింతమనేని సంచలన ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే అధికారుల తీరుపై, తమ పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో తనపై వేధింపులకు పాల్పడిన అధికారులకు మంచి పోస్టింగ్లు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, అలా పోస్టింగులు ఇప్పిస్తోంది కూడా తమ పార్టీకి చెందిన నాయకులేనింటూ దెందులూరి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో చిట్ చాట్ సందర్భంగా దెందులూరి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
తనపై గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించిందని, అయితే తనను వేధించిన అధికారులు ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని అన్నారు. ఆ అధికారులే కావాలంటూ తమ నాయకులే వారికి మంచి పోస్టింగ్లు ఇప్పిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తనపై 27 అక్రమ కేసులు పెట్టిందని, వాటిలో రెండింటిని కోర్టు కొట్టివేసిందని గుర్తు చెప్పారు. తనపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, ఆ కేసుల్లో ఎస్సీలు కూడా బాధితులుగా ఉన్నారని చింతమనేని చెప్పారు. మరి, సొంత ప్రభుత్వంపై, తమ పార్టీ నాయకులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on November 16, 2024 9:59 pm
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…