టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఏదో ఒక కేసులో చింతమనేనిని అరెస్టు చేయడం, స్టేషన్ కు తీసుకువెళ్లి విచారణ చేయడం నిత్యకృత్యమైందని విమర్శలు వచ్చాయి. అయితే, చింతమనేనిని వేధించిన అధికారులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కీలక పోస్టులు ఇచ్చిందని స్వయంగా చింతమనేని సంచలన ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే అధికారుల తీరుపై, తమ పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో తనపై వేధింపులకు పాల్పడిన అధికారులకు మంచి పోస్టింగ్లు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, అలా పోస్టింగులు ఇప్పిస్తోంది కూడా తమ పార్టీకి చెందిన నాయకులేనింటూ దెందులూరి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో చిట్ చాట్ సందర్భంగా దెందులూరి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
తనపై గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించిందని, అయితే తనను వేధించిన అధికారులు ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని అన్నారు. ఆ అధికారులే కావాలంటూ తమ నాయకులే వారికి మంచి పోస్టింగ్లు ఇప్పిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తనపై 27 అక్రమ కేసులు పెట్టిందని, వాటిలో రెండింటిని కోర్టు కొట్టివేసిందని గుర్తు చెప్పారు. తనపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, ఆ కేసుల్లో ఎస్సీలు కూడా బాధితులుగా ఉన్నారని చింతమనేని చెప్పారు. మరి, సొంత ప్రభుత్వంపై, తమ పార్టీ నాయకులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on November 16, 2024 9:59 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…