టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఏదో ఒక కేసులో చింతమనేనిని అరెస్టు చేయడం, స్టేషన్ కు తీసుకువెళ్లి విచారణ చేయడం నిత్యకృత్యమైందని విమర్శలు వచ్చాయి. అయితే, చింతమనేనిని వేధించిన అధికారులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కీలక పోస్టులు ఇచ్చిందని స్వయంగా చింతమనేని సంచలన ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే అధికారుల తీరుపై, తమ పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో తనపై వేధింపులకు పాల్పడిన అధికారులకు మంచి పోస్టింగ్లు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, అలా పోస్టింగులు ఇప్పిస్తోంది కూడా తమ పార్టీకి చెందిన నాయకులేనింటూ దెందులూరి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో చిట్ చాట్ సందర్భంగా దెందులూరి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
తనపై గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించిందని, అయితే తనను వేధించిన అధికారులు ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని అన్నారు. ఆ అధికారులే కావాలంటూ తమ నాయకులే వారికి మంచి పోస్టింగ్లు ఇప్పిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తనపై 27 అక్రమ కేసులు పెట్టిందని, వాటిలో రెండింటిని కోర్టు కొట్టివేసిందని గుర్తు చెప్పారు. తనపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, ఆ కేసుల్లో ఎస్సీలు కూడా బాధితులుగా ఉన్నారని చింతమనేని చెప్పారు. మరి, సొంత ప్రభుత్వంపై, తమ పార్టీ నాయకులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on November 16, 2024 9:59 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…