మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా వికాస్ అఘాడీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. తమ తమ పార్టీల తరఫున ప్రచారం చేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మిత్రపక్ష నేతలను రాష్ట్రానికి రప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పాల్గొన్నారు.
బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే పార్టీ), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేశారు. మహారాష్ట్రలోని డెగ్లూర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మ రక్షణ కోసమే శివసేన, జనసేన ఆవిర్భవించాయని పవన్ చెప్పారు. శివాజీ మహరాజ్ పుట్టిన గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందని, జాతీయ భావం, ప్రాంతీయ తత్వం జనసేన, శివసేనల సిద్ధాంతమని అన్నారు. బాల్ ఠాక్రే నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, శివసేన-జనసేన అన్యాయంపై పోరాడతాయని తెలిపారు.
ధైర్యం, పౌరుషంతో కూడిన భారత్ను బాల్ ఠాక్రే కోరుకున్నారని, ఆయన కలలుగన్న అయోధ్య రామమందిరాన్ని ప్రధాని మోడీ నిర్మించి చూపారని చెప్పారు. దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నామని, దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విడిపోయి బలహీనపడదామా?.. లేదా కలిసి బలంగా నిలబడదామా? అని ప్రజలను ప్రశ్నించారు. విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా? లేదా కలిసి బంగారు భవిష్యత్ను నిర్మించుకుందామా? అని అన్నారు.
This post was last modified on November 16, 2024 5:28 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…