Political News

జనసేన, శివసేనల లక్ష్యం అదే: పవన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా వికాస్ అఘాడీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. తమ తమ పార్టీల తరఫున ప్రచారం చేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మిత్రపక్ష నేతలను రాష్ట్రానికి రప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఈ రోజు పాల్గొన్నారు.

బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్‌ షిండే పార్టీ), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేశారు. మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మ రక్షణ కోసమే శివసేన, జనసేన ఆవిర్భవించాయని పవన్ చెప్పారు. శివాజీ మహరాజ్‌ పుట్టిన గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందని, జాతీయ భావం, ప్రాంతీయ తత్వం జనసేన, శివసేనల సిద్ధాంతమని అన్నారు. బాల్ ఠాక్రే నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, శివసేన-జనసేన అన్యాయంపై పోరాడతాయని తెలిపారు.

ధైర్యం, పౌరుషంతో కూడిన భారత్‌ను బాల్ ఠాక్రే కోరుకున్నారని, ఆయన కలలుగన్న అయోధ్య రామమందిరాన్ని ప్రధాని మోడీ నిర్మించి చూపారని చెప్పారు. దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నామని, దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విడిపోయి బలహీనపడదామా?.. లేదా కలిసి బలంగా నిలబడదామా? అని ప్రజలను ప్రశ్నించారు. విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా? లేదా కలిసి బంగారు భవిష్యత్‌ను నిర్మించుకుందామా? అని అన్నారు.

This post was last modified on November 16, 2024 5:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

3 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

5 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago