Political News

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ ప్యాలెస్ కట్టిన జగన్ ను జీవితాంతం జైలులో పెట్టినా తప్పు లేదని ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి శాసన సభలో జగన్ పై విష్ణుకుమార్ రాజు పదుునైన విమర్శలతో విరుచుకుపడ్డారు.

ఈ భూమి మీద జగన్ ఉన్నంత కాలం ఏపీ నాశనం అవుతుందని విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంట్రాక్టర్ల జీవితాలను జగన్ సర్వనాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో చేసిన పనులకు డబ్బులు రాక, ఆ పనులు పూర్తి చేసేందుకు చేసిన అప్పులు చెల్లించలేక వారు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల ఒత్తిడి తట్టుకోలేక 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.

1983 నుంచి తాను కాంట్రాక్టులు చేస్తున్నానని. దుర్మార్గమైన రాక్షస జగన్ ప్రభుత్వం దగ్గర మాత్రం పనులు చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్లను జగన్ పెట్టిన బాధలకు…తాను 10 సార్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చేదని షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తాడా? అని ఎదురు చూస్తున్నానని… ఆయనను అసెంబ్లీకి పిలిపించాలని స్పీకర్ ను కోరారు. 2019-24 మధ్య కాలంలో రాక్షస పాలన కొనసాగిందని విమర్శించారు.

This post was last modified on November 16, 2024 4:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏప్రిల్ నెలను వారణాసే కాపాడాలి

టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…

8 minutes ago

రాకీ భాయ్ తిరిగి వస్తాడా?

కొన్ని క‌థ‌లు ముగిసిపోవ‌డాన్ని ప్రేక్ష‌కులు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. వాటికి కొన‌సాగింపు ఉంటేనే బాగుంటుంద‌ని ఆశిస్తారు. వాటి మేక‌ర్స్ కూడా ఆ…

42 minutes ago

బాలయ్య మూవీ అంటే కొరటాలకు సవాలే

దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…

1 hour ago

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

‘చంద్రబాబు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు’

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌తిప‌క్ష(ప్ర‌ధాన కాదు) నాయ‌కుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు రాష్ట్రంలో అన్యాయంగా…

7 hours ago