Political News

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ ప్యాలెస్ కట్టిన జగన్ ను జీవితాంతం జైలులో పెట్టినా తప్పు లేదని ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి శాసన సభలో జగన్ పై విష్ణుకుమార్ రాజు పదుునైన విమర్శలతో విరుచుకుపడ్డారు.

ఈ భూమి మీద జగన్ ఉన్నంత కాలం ఏపీ నాశనం అవుతుందని విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంట్రాక్టర్ల జీవితాలను జగన్ సర్వనాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో చేసిన పనులకు డబ్బులు రాక, ఆ పనులు పూర్తి చేసేందుకు చేసిన అప్పులు చెల్లించలేక వారు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల ఒత్తిడి తట్టుకోలేక 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.

1983 నుంచి తాను కాంట్రాక్టులు చేస్తున్నానని. దుర్మార్గమైన రాక్షస జగన్ ప్రభుత్వం దగ్గర మాత్రం పనులు చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్లను జగన్ పెట్టిన బాధలకు…తాను 10 సార్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చేదని షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తాడా? అని ఎదురు చూస్తున్నానని… ఆయనను అసెంబ్లీకి పిలిపించాలని స్పీకర్ ను కోరారు. 2019-24 మధ్య కాలంలో రాక్షస పాలన కొనసాగిందని విమర్శించారు.

This post was last modified on November 16, 2024 4:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

4 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

6 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

13 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

14 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

14 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

16 hours ago