విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ ప్యాలెస్ కట్టిన జగన్ ను జీవితాంతం జైలులో పెట్టినా తప్పు లేదని ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి శాసన సభలో జగన్ పై విష్ణుకుమార్ రాజు పదుునైన విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఈ భూమి మీద జగన్ ఉన్నంత కాలం ఏపీ నాశనం అవుతుందని విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంట్రాక్టర్ల జీవితాలను జగన్ సర్వనాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో చేసిన పనులకు డబ్బులు రాక, ఆ పనులు పూర్తి చేసేందుకు చేసిన అప్పులు చెల్లించలేక వారు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల ఒత్తిడి తట్టుకోలేక 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
1983 నుంచి తాను కాంట్రాక్టులు చేస్తున్నానని. దుర్మార్గమైన రాక్షస జగన్ ప్రభుత్వం దగ్గర మాత్రం పనులు చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్లను జగన్ పెట్టిన బాధలకు…తాను 10 సార్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చేదని షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తాడా? అని ఎదురు చూస్తున్నానని… ఆయనను అసెంబ్లీకి పిలిపించాలని స్పీకర్ ను కోరారు. 2019-24 మధ్య కాలంలో రాక్షస పాలన కొనసాగిందని విమర్శించారు.
This post was last modified on November 16, 2024 4:27 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…