Political News

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో దుమ్ము రేపారు. మరాఠీలో ప్రసంగించి మరాఠా ప్రజల హృదయాలను గెలుచుకున్న పవన్ కల్యాణ్, తాను ఓట్లు అడిగేందుకు రాలేదని, మహారాష్ట్ర వీరులకు నివాళి అర్పించేందుకు వచ్చానని స్పష్టం చేశారు.

పవన్ ప్రసంగం “జై భవానీ, జై శివాజీ” అంటూ మొదలైంది. ‘‘ఇది ఛత్రపతి శివాజీ పరిపాలించిన భూమి. స్వాతంత్ర్య పోరాటం స్ఫూర్తిగా నిలిచిన గడ్డ. ఇక్కడికి రావడం గౌరవంగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం మహారాష్ట్రలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం, ఆలయ అభివృద్ధి, పోలీస్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, ఇది కొనసాగడానికి ఎన్డీయే విజయం కీలకమని తెలిపారు.

పవన్ తన ప్రసంగంలో సనాతన ధర్మంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ‘‘సినిమాల్లో యాక్షన్ సులువు. కానీ ధర్మ పోరాటం నిజ జీవితంలో అత్యంత క్లిష్టం. మనం సనాతన ధర్మం కోసం నిలబడాలి. ఎవరు తల్వార్ పట్టుకుని వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి’’ అని పవన్ భావోద్వేగంగా పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, పవన్ కల్యాణ్‌ను ‘‘ఆంధీ కల్యాణ్’’ అని అభివర్ణించారు. ప్రధాని మోదీ కూడా ఇదే ప్రస్తావన చేసినట్లు గుర్తుచేశారు. ఇది పవన్ ప్రసంగానికి విశేష ఆకర్షణను తెచ్చిపెట్టింది.

ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ‘‘పవన్ కల్యాణ్ ఆలోచన ఏపీలో 175 సీట్లలో 164 సీట్లు గెలిపించేందుకు ప్రేరణగా నిలిచింది’’ అని కొనియాడారు. మహారాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న పవన్, డెగ్లూరులో ఎన్డీయే విజయానికి మద్దతు పునరుద్ఘాటించారు.

This post was last modified on November 16, 2024 4:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

44 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

10 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

10 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

12 hours ago