Political News

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో దుమ్ము రేపారు. మరాఠీలో ప్రసంగించి మరాఠా ప్రజల హృదయాలను గెలుచుకున్న పవన్ కల్యాణ్, తాను ఓట్లు అడిగేందుకు రాలేదని, మహారాష్ట్ర వీరులకు నివాళి అర్పించేందుకు వచ్చానని స్పష్టం చేశారు.

పవన్ ప్రసంగం “జై భవానీ, జై శివాజీ” అంటూ మొదలైంది. ‘‘ఇది ఛత్రపతి శివాజీ పరిపాలించిన భూమి. స్వాతంత్ర్య పోరాటం స్ఫూర్తిగా నిలిచిన గడ్డ. ఇక్కడికి రావడం గౌరవంగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం మహారాష్ట్రలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం, ఆలయ అభివృద్ధి, పోలీస్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, ఇది కొనసాగడానికి ఎన్డీయే విజయం కీలకమని తెలిపారు.

పవన్ తన ప్రసంగంలో సనాతన ధర్మంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ‘‘సినిమాల్లో యాక్షన్ సులువు. కానీ ధర్మ పోరాటం నిజ జీవితంలో అత్యంత క్లిష్టం. మనం సనాతన ధర్మం కోసం నిలబడాలి. ఎవరు తల్వార్ పట్టుకుని వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి’’ అని పవన్ భావోద్వేగంగా పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, పవన్ కల్యాణ్‌ను ‘‘ఆంధీ కల్యాణ్’’ అని అభివర్ణించారు. ప్రధాని మోదీ కూడా ఇదే ప్రస్తావన చేసినట్లు గుర్తుచేశారు. ఇది పవన్ ప్రసంగానికి విశేష ఆకర్షణను తెచ్చిపెట్టింది.

ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ‘‘పవన్ కల్యాణ్ ఆలోచన ఏపీలో 175 సీట్లలో 164 సీట్లు గెలిపించేందుకు ప్రేరణగా నిలిచింది’’ అని కొనియాడారు. మహారాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న పవన్, డెగ్లూరులో ఎన్డీయే విజయానికి మద్దతు పునరుద్ఘాటించారు.

This post was last modified on November 16, 2024 4:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

1 hour ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

2 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

3 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

3 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

3 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

4 hours ago