Political News

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని సంగతి తెలిసిందే. ఐదేళ్లు సీఎంగా జగన్ ఉన్నప్పటికీ తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడలేదని, తనకు న్యాయం జరగలేదని సునీత పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఈ కేసులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై నేరుగా సునీతోపాటు వైఎస్ షర్మిల కూడా పలు ఆరోపణలు చేసినా ఫలితం లేదు. అయితే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ కేసులో వైఎస్ సునీత స్పీడు పెంచారు.

తన తండ్రిని కిరాతకంగా హత్య చేసిన వారిని శిక్ష పడాలంటూ న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్న సునీతా ఈ రోజు కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిశారు. వివేకా కేసు గురించి ఎస్పీకి వివరించిన సునీత…హంతకులకు శిక్ష పడేలా పోలీసులు విచారణ వేగవంతం చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డి తనపై పెట్టిన అభ్యంతరకర పోస్టులపై కూడా ఎస్పీతో సునీత చర్చించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హోంమంత్రి అనితను కలిసిన తర్వాత అప్పటి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును సునీత కలిసిన సంగతి తెలిసిందే. వివేకా హంతకులకు స్థానిక పోలీసుల అండ లభిస్తోందని అనితను కలిసన సమయంలో సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సీబీఐ విచారణకు పోలీసులు సహకరించేలా చూడాలని అనితకు సునీత విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో వివేకా కేసు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వైసీపీ అండతో ఉన్న అవినాష్ రెడ్డికి ఈ కేసులో చిక్కులు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Satya

Recent Posts

రణ్వీర్ నిషేధం… హీరోలకు ఒక పాఠం

రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…

57 minutes ago

భార‌త్ బంగారం అమ్మేసిందా?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో ఇంధ‌నం, బంగారం దిగుమ‌తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం భారీ స్థాయిలో విదేశీ మార‌క‌ద్ర‌వ్యాన్ని వెచ్చిస్తున్న విష‌యం…

2 hours ago

అమ్మ సెంటిమెంట్ జాన్వీకి కలిసొస్తుందా

అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…

3 hours ago

ఆంధ్రాలో కుల భావన ఉంది… ‘నా ఆంధ్రా’ భావన లేదు: పవన్

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

బాబు స్పందించారు… మిగిలింది ఇక రేవంతే!

పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…

4 hours ago

అమెరికాలో భారత జెండా చించివేత… కౌంటరిస్తున్న ఎన్నారైలు!

టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…

5 hours ago