Political News

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని సంగతి తెలిసిందే. ఐదేళ్లు సీఎంగా జగన్ ఉన్నప్పటికీ తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడలేదని, తనకు న్యాయం జరగలేదని సునీత పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఈ కేసులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై నేరుగా సునీతోపాటు వైఎస్ షర్మిల కూడా పలు ఆరోపణలు చేసినా ఫలితం లేదు. అయితే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ కేసులో వైఎస్ సునీత స్పీడు పెంచారు.

తన తండ్రిని కిరాతకంగా హత్య చేసిన వారిని శిక్ష పడాలంటూ న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్న సునీతా ఈ రోజు కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిశారు. వివేకా కేసు గురించి ఎస్పీకి వివరించిన సునీత…హంతకులకు శిక్ష పడేలా పోలీసులు విచారణ వేగవంతం చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డి తనపై పెట్టిన అభ్యంతరకర పోస్టులపై కూడా ఎస్పీతో సునీత చర్చించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హోంమంత్రి అనితను కలిసిన తర్వాత అప్పటి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును సునీత కలిసిన సంగతి తెలిసిందే. వివేకా హంతకులకు స్థానిక పోలీసుల అండ లభిస్తోందని అనితను కలిసన సమయంలో సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సీబీఐ విచారణకు పోలీసులు సహకరించేలా చూడాలని అనితకు సునీత విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో వివేకా కేసు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వైసీపీ అండతో ఉన్న అవినాష్ రెడ్డికి ఈ కేసులో చిక్కులు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Satya

Recent Posts

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

3 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

29 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

30 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

1 hour ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

1 hour ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago