Political News

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని సంగతి తెలిసిందే. ఐదేళ్లు సీఎంగా జగన్ ఉన్నప్పటికీ తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడలేదని, తనకు న్యాయం జరగలేదని సునీత పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఈ కేసులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై నేరుగా సునీతోపాటు వైఎస్ షర్మిల కూడా పలు ఆరోపణలు చేసినా ఫలితం లేదు. అయితే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ కేసులో వైఎస్ సునీత స్పీడు పెంచారు.

తన తండ్రిని కిరాతకంగా హత్య చేసిన వారిని శిక్ష పడాలంటూ న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్న సునీతా ఈ రోజు కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిశారు. వివేకా కేసు గురించి ఎస్పీకి వివరించిన సునీత…హంతకులకు శిక్ష పడేలా పోలీసులు విచారణ వేగవంతం చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డి తనపై పెట్టిన అభ్యంతరకర పోస్టులపై కూడా ఎస్పీతో సునీత చర్చించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హోంమంత్రి అనితను కలిసిన తర్వాత అప్పటి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును సునీత కలిసిన సంగతి తెలిసిందే. వివేకా హంతకులకు స్థానిక పోలీసుల అండ లభిస్తోందని అనితను కలిసన సమయంలో సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సీబీఐ విచారణకు పోలీసులు సహకరించేలా చూడాలని అనితకు సునీత విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో వివేకా కేసు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వైసీపీ అండతో ఉన్న అవినాష్ రెడ్డికి ఈ కేసులో చిక్కులు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on November 15, 2024 10:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

4 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

6 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

8 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

8 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

10 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

12 hours ago