అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేస్తున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తా వించారు. వైసీపీ నాయకులు కొందరిని పోలీసులు అరెస్టు చేశారని, వారంతా సోషల్ మీడియాలో రెచ్చిపో యారని తెలిపారు.
అందుకే పోలీసులు వారిని అరెస్టు చేశారని చంద్రబాబు చెప్పారు. అయితే.. కేవలం వైసీపీ నేతలకే కాద ని.. మహిళలను, ఇంట్లో వాళ్లను అవమానించేలా.. వారు నొచ్చుకునేలా ఎవరూ కామెంట్లు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తాను పారదర్శకంగా ఉంటానని తెలిపారు. కూటమి నాయకుల ను కూడా ఉపేక్షించేది లేదన్నారు. అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.
అందరికీ ఒకే రకంగా ట్రీట్మెంట్ ఉంటుందని చంద్రబాబు చెప్పారు. కానీ, వైసీపీ హయాంలో ప్రతిపక్షాల కు చెందిన నాయకుల ఇళ్ల లోని ఆడవారిపై పోస్టులు పెడితే.. ఎంజాయ్ చేసిన పరిస్థితి ఉందన్నారు. కాబట్టి.. ఇప్పుడు కూడా అలానే ఉంటాయని భావిస్తున్నారని కానీ, తాము ఊరుకునేది లేదన్నారు. ప్రతి విషయాన్ని పారదర్శకంగా తీసుకుంటామని.. ఈ విషయాన్ని కూటమి నాయకులు కూడా గుర్తించాలని సూచించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని కోరారు.
This post was last modified on November 15, 2024 4:26 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…