Political News

బాబు మ్యాజిక్ మ‌హారాష్ట్ర లో పని చేస్తదా?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో రెండు పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌నతోపాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా మ‌హారాష్ట్ర‌కు వెళ్తారు. ఈ నెల 20(నాలుగు రోజుల్లో) జ‌ర‌గ‌నున్న మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన బీజేపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున‌(ఎన్డీయే కూట‌మి- మ‌హారాష్ట్రలో మ‌హాయుతి కూట‌మిగా ఉంది) చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు ప్ర‌చారం చేస్తారు. తెలుగు వారు ఎక్కువ‌గా ఉన్న నాందేడ్‌, ష‌ర్డి త‌దిత‌ర జిల్లాల్లో వీరు ప్ర‌చారం చేయ‌నున్నారు.

తొలుత శుక్ర‌వారం ఢల్లీ చేరుకునే చంద్ర‌బాబు బీజేపీ పెద్ద‌ల‌తో అక్క‌డ భేటీ అవుతారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ స‌హా ప‌లువురు ఇత‌ర నేత‌ల‌ను కూడా క‌లుసుకుంటారు. పోల‌వ‌రం నిధులు, రాజ‌ధాని రుణం వంటి అంశాల పురుగ‌తిపై వారితో చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం.. రాత్రికి ఆయ‌న మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై చేరుకుంటారు. రాత్రికి అక్క‌డే బ‌స చేయ‌నున్నారు. ఇక‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ నేరుగా ముంబైకి చేరుకుంటారు.

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల నుంచే ప్ర‌చార ప‌ర్వంలోకి అడుగు పెట్ట నున్నారు. రెండు రోజుల పాటు వారు అక్క‌డే ఉండి బీజేపీ అభ్య‌ర్థుల విజ‌యానికి కృషి చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా కూట‌మి రాక‌, డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు విజ‌యవంతం, పెట్టుబ‌డులు, మోడీ ఇమేజ్ స‌హా.. దేశంలో సుస్థితర‌త వంటి అంశాల‌ను ప్ర‌చారం చేయ‌నున్న‌ట్టు తెలిసింది. దీనిపై కూడా బీజేపీ కొంత బ్రీఫ్ చేసింది. ప్ర‌ధానంగా న‌రేంద్ర మోడీ ఇమేజ్ ద్వారా భార‌త్ సాధిస్తున్న పురోగ‌తిని వివ‌రించే అవ‌కాశం ఉంది.

అదేవిధంగా శ‌నివారం, ఆదివారం వ‌రుస మీడియా స‌మావేశాలు కూడా నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు చంద్ర‌బాబు షెడ్యూల్ ఖ‌రారైంది. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ షిర్డీలో ప్ర‌త్యేకంగా ప్ర‌చారం చేయ‌నున్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా బీజేపీ పెద్ద‌ల కోరిక మేరకు మ‌హారాష్ట్ర‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఇద్ద‌రు నేత‌లు వెళ్తుండ‌డం గ‌మ‌నార్హం. కాగా, 288 అసెంబ్లీ స్థానాలున్న మ‌హారాష్ట్రలో ఈ నెల 20న ఒకే విడత‌లో ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

Satya

Recent Posts

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

24 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

25 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

55 minutes ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

59 minutes ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago

ఇంత అహంకారమెందుకు అంబటి

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…

2 hours ago